logo

రోశయ్య మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు

మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతి తెలుగు ప్రజలకు తీరని లోటని ఆర్యవైశ్య సంఘం ..

Updated : 05 Dec 2021 15:40 IST

కలసపాడు : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతి తెలుగు ప్రజలకు తీరని లోటని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నాగరాజ తెలిపారు. కలసపాడులోని అమ్మవారిశాలలో రోశయ్య సంతాప సభ ఏర్పాటు చేశారు. రోశయ్య చిత్రపటానికి నాగరాజ, సంఘం సలహాదారుడు సుదర్శన్‌, ప్రధాన కార్యదర్శి నారాయణ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోశయ్య ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు ఎల్లయ్య, వెంకటేశ్, సత్యనారాయణ, పూర్ణచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని