ఇసుక కొండంత..సాయం గోరంత !
చెయ్యేరు వరదతో బంగరు పంటలు పండే నేలలు ఇసుకార్పణం అయ్యాయి. దీంతో కర్షకుల కంట కన్నీరు సుడులు తిరుగుతోంది. చెయ్యేరు నది పరివాహక పరిధిలోని రైతుల పొలాల్లో భారీగా ఇసుక చేరింది. జల ప్రళయంతో నేల పైపొర మన్ను పూర్తిగా కొట్టుకుపోయి
ఆరడుగుల మేర మేటలు
హెక్టారుకు రూ.12,500
సరిపోదని అన్నదాతల ఆందోళన
ఎగువ మందపల్లిలో చెయ్యేరు ఒడ్డున పసిడి నేలల్లో వొసేన ఇసుక మేటలు
చెయ్యేరు వరదతో బంగరు పంటలు పండే నేలలు ఇసుకార్పణం అయ్యాయి. దీంతో కర్షకుల కంట కన్నీరు సుడులు తిరుగుతోంది. చెయ్యేరు నది పరివాహక పరిధిలోని రైతుల పొలాల్లో భారీగా ఇసుక చేరింది. జల ప్రళయంతో నేల పైపొర మన్ను పూర్తిగా కొట్టుకుపోయి ఇసుక మేటలు వేసింది. ప్రస్తుతం సైకతం తొలగింపు రైతులకు ఆర్థికంగా పెనుభారం కానుంది. ఒకటి, రెండు కాదు... ఆరేడు అడుగులకు పైగా మేటలను ఎలా తొలగించుకోవాలని రైతులు గుబులు చెందుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన హెక్టారుకు రూ. 12,500 సాయం ఏమాత్రం సరిపోదని పెదవి విరస్తున్నారు. - న్యూస్టుడే, రాజంపేట పట్టణం
జిల్లాలో గత నెల 19న అన్నమయ్య జలాశయం మట్టి కట్ట తెగిపోయింది. దీంతో రాజంపేట, నందలూరు, పెనగలూరు మండలాలపై తీవ్ర ప్రభావం చూపింది. సాగులోని పంటలు నీటిపాలయ్యాయి. సాగు భూముల్లోకి భారీగా వరద రావడంతో ఇసుక దిబ్బలు చేరాయి. ఈ మూడు మండలాల్లో 486 మందికి చెందిన 328.52 హెక్టార్లలో ఇసుక, రాళ్లు మేటలు చేరాయి. చెయ్యేరు నదికి సమీప పొలాల్లోకి 5-8 అడుగుల మేర సైకతం వచ్చింది. కాస్త దూరంగా ఉన్న ప్రాంతాల్లో 2-3 అడుగుల మేర చేరింది. దీంతో ఏరు, భూములు ఒక్కటైనట్లు కనిపిస్తున్నాయి. n రాష్ట్ర ప్రభుత్వం ఇసుక మేటల తొలగింపునకు హెక్టారుకు రూ.12,500 చెల్లిస్తామని ప్రకటించింది. ఈ తక్కువ మొత్తంతో పొలాలను బాగు చేసుకోవడం కష్టమని అన్నదాతలు వాపోతున్నారు. n రాజంపేట మండలంలో 396 మందికి చెందిన 273.08 హెక్టార్లలో ఇసుక మేటలు వేశాయి. పులపుత్తూరు రైతు భరోసా కేంద్రం పరిధిలో 54.22 హెక్టార్లు, మందరం 40, ఎంజీ పురం 40, మందపల్లి గుండ్లూరు 40, మందపల్లి 76.06, ఆర్.బుడుగుంటపల్లి 6.8, తాళ్లపాక 16 హెక్టార్లను మెరుగుపరచుకోవాల్సి ఉందని వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. n నందలూరు మండలంలో 27.44 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు నిర్ధారించారు. పాటూరు 3.23, కుందానెల్లూరు 3, టంగుటూరు 1, నల్లతిమ్మాయపల్లె 19.4 హెక్టార్లలో ఈ సమస్య ఉంది. పెనగలూరు-1లో 8, కొండూరు-1లో ఆరు, సిద్దవరం 6, కోమంరాజుపురం 4, ఓబలి ఆర్బీకే పరిధిలో నాలుగు హెక్టార్లలో ఇసుక చేరి నేల స్వభావాన్ని అధ్వానంగా మార్చేసినట్లు అధికార యంత్రాంగం గుర్తించింది.
రవాణా హక్కు.. చిక్కు
చెయ్యేరు నది పరివాహక వ్యవసాయ భూముల్లోకి భారీగా ఇసుక చేరింది. ఇక్కడి నుంచి ఇసుక రవాణా చేసే హక్కు ఎవరికీ ఉందనే అంశంపై అధికార యంత్రాంగం స్పష్టత ఇవ్వలేదు. తమ భూమిలోని ఇసుకను రైతులు విక్రయించుకోవచ్చా, దీనికి అనుమతి ఇస్తారా లేదా అనే సందేహం తలెత్తుతోంది. పంట పొలాల్లోని ఇసుకను అమ్ముకునే వెసులుబాటు ఇస్తే తమకు ఆర్థికంగా కొంత ఊరట ఇచ్చినట్లు అవుతుందని రైతులు భావిస్తున్నారు.
ఉన్నతాధికారులకు నివేదించాం - జె.మురళీకృష్ణ, జేడీ, వ్యవసాయశాఖ, కడప
చెయ్యేరు నది పరివాహకంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో వరద రావడంతో వ్యవసాయ భూముల్లో ఇసుక మేటలు చేరాయి. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని సేకరించాం. జిల్లా వ్యాప్తంగా 483 హెక్టార్లలో ఇసుక చేరినట్లు గుర్తించాం. ఇదే విషయాన్ని రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదించాం. హెక్టారుకు రూ.12,500 చెల్లిస్తామని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఈ మొత్తం మరికొంత పెంచాలని రైతుల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. ఉన్నత స్థాయి నంచి అందే ఉత్తర్వులను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
ఆరు అడుగుల ఎత్తున చేరిన ఇసుక మేటలను చూపుతున్న రైతు పేరు కామటం రాజా. ఈయన సొంతూరు రాజంపేట మండలం సాలిపేట. ఇటీవల చెయ్యేరు వరద రావడంతో ఎకరా విస్తీర్ణంలో 5-6 అడుగులకు పైగా ఇసుక చేరింది. మరో ఎకరాలో 2-3 అడుగుల మేర సైకతం పేరుకుపోయింది. బాగు చేసుకోవాలంటే కనీసం రూ.రెండు లక్షలు కావాలని రైతు చెబుతున్నారు. హెక్టారుకు రూ.12,500 చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఈయన పెదవి విరుస్తున్నారు.
ఆ మొత్తం సరిపోదు...
మా ఊరి పక్కనే చెయ్యేరు నది ప్రవహిస్తోంది. అన్నమయ్య మట్టి కట్ట తెగిపోవంతో మహోగ్రరూపంతో పరవళ్లు తొక్కుతూ భూములను నాశనం చేసింది. మా భూమిలో మూడు అడుగుల మేర ఇసుక మేటలు వేశాయి. ఎలా తొలగించాలో అర్థం కావడం లేదు. హెక్టారుకు రూ.12,500 ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు. అది ఎలా సరిపోతుందో ఆలోచించాలి. ఇంత తక్కువ మొత్తంతో ఏవిధంగా బాగు చేసుకోవాలి. ఎకరాకు రూ.25 వేలు సాయం చేస్తే మా డబ్బులను కొంత పెట్టుకొని భూములను సాగులోకి తెచ్చుకుంటాం. దీనిపై ఉన్నతాధికారులు సానుకూల దృక్ఫథంతో ఆలోచించాలి. - తోట సుబ్బరాయుడు, రైతు, ఎగువ మందపల్లి
పంటలను నాశనం చేసింది
అన్నమయ్య జలాశయం కట్ట తెగిపోవడంతో ఎల్లవొచ్చి పంటలను నాశనం చేసింది. ఎకరా పసుపు పూర్తిగా దెబ్బతింది. ఇందుకోసం పెట్టిన పెట్టుబడి రూ.50 వేలు గంగ పాలైంది. వరి ఎకరా, వేరుసెనగ ఎకరాలో సాగు చేశా. రెండు బోర్లకు ఏర్పాటు చేసిన మోటార్లు నీటిపాలయ్యాయి. ఊర్లో ఒక ఎకరా మిగల్లేదు. అంతా కోతకు గురై ఇసుక మేటలు వేయడంతో పంటలు సాగు చేసుకోవడం కష్టంగా ఉంది. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. - వెంగని వెంకటరమణ, రైతు, ఏకిరిపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాయంచపై రాములోరి రాజసం
[ 19-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు గురువారం రాత్రి రాయంచపై రాములోరి విహారం కనులపండువగా సాగింది. -
మొదలైన నామినేషన్ల సందడి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ గురువారం మొదలైంది. కలెక్టర్ విజయ రామరాజు ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం కలెక్టరేట్లోని తన ఛాంబరులో నామపత్రాల స్వీకరణను ఆయన ప్రారంభించారు. -
జగన్ను నమ్మాం... నిండా మునిగాం!
[ 19-04-2024]
‘నేను ఉన్నానన్నావ్... నేను విన్నానన్నావ్... నిజమే అనుకున్నాం... నీ మాటలు విని మా బాధలు తెలుసుకుంటావని, పరిష్కారం చూపుతావని ఎంతో ఆశతో నిన్ను గెలిపించాం... తీరా చూస్తే నువ్వు ఉన్నావు... కానీ వినే ఓపికే లేకుండా పోయింది. -
షర్మిలకు మద్దతుగా పులివెందులలో సునీత ప్రచారం
[ 19-04-2024]
కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల తరఫున మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత దంపతులు గురువారం నుంచి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. -
బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మరథం
[ 19-04-2024]
బ్రహ్మాండ నాయకుడైన శ్రీరాముడి రథోత్సవం గురువారం వాల్మీకి క్షేత్రంలో వైభవంగా జరిగింది. ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
మరో వైకాపా ఫ్యానుపై వేటు
[ 19-04-2024]
వృత్తి ఉద్యోగమైనా... నిబంధనలు ఉల్లంఘించి అత్యుత్సాహంతో ముఖ్యమంత్రి జగన్కు ఊడిగం చేసే వారికి తగిన శాస్తి జరుగుతుందనడానికి నిదర్శనమే... ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై వేటు. -
పెద్దిరెడ్డి కుటుంబ దోపిడీని ఓటుతో అడ్డుకోండి
[ 19-04-2024]
రాజంపేట పార్లమెంట్ పరిధిలో పెద్దిరెడ్డి దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ముఖ్యమంత్రి, భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. -
జగన్ బాటలో బస్సులు.. జనానికి ‘ముప్పు’తిప్పలు!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో పల్లెలకు బస్సులు దూరమయ్యాయి... కొత్త బస్సులు రాకపోగా, ఉన్న బస్సులు మరమ్మతులకు గురయ్యాయి... పల్లె బస్సులు రద్దయ్యాయి. అవీ ఎప్పుడొస్తాయో తెలియదు. -
బ్రహ్మోత్సవ శోభ... ఆధ్యాత్మిక ప్రభ
[ 19-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రామయ్య క్షేత్రంలో రెండో రోజు గురువారం ఉదయం యాగశాలలో తితిదే ఆగమ సలహాదారు కల్యాణపురం రాజేష్ భట్టార్ ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు. -
జగనన్న చెప్పాడంటే చెయ్యడంతే
[ 19-04-2024]
మైకు పట్టుకుని రాజకీయ నాయకులేం చెబుతారో ఎన్నికల తర్వాత ఆ పని చేయకపోతే రాజీనామా చేసిపోయే పరిస్థితి రావాలన్నావు. నీ మాటలు నమ్మి ప్రశ్నిస్తే.. కేసులు పెట్టిస్తున్నావ్.. నీ అనునాయులతో ఉరికించి ఉరికించి కొట్టిస్తున్నావ్.. చెప్పిన మాటకు కట్టుబడక పోతే ఎలాగన్నా. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి
[ 19-04-2024]
కేంద్రం, రాష్ట్రంలో తమ ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే చేనేత కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తామని కడప ఎంపీ తెదేపా అభ్యర్థి భూపేష్రెడ్డి, జమ్మలమడుగు అసెంబ్లీ భాజపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డి హామీ ఇచ్చారు. -
జిల్లాకు చేరుకున్న కేంద్ర ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై పర్యవేక్షణకు కేంద్ర ఎన్నికల పరిశీలకులు గురువారం జిల్లాకు చేరుకున్నారు. తొలుత కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, ఎస్పీ కృష్ణారావు, ఇతర జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. -
రాజంపేట వైకాపాలో ముసలం
[ 19-04-2024]
రాజంపేట వైకాపాలో ముసలం పుట్టింది. నియోజకవర్గానికి చెందిన వైకాపా నాయకులు, కార్యకర్తలు ఇటీవల తెదేపాలో చేరారు. ఈ క్రమంలో హైదరాబాద్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో బుధవారం జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు, తెదేపా నాయకుడు పోలి సుబ్బారెడ్డి, సుగవాసి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో నందలూరు, రాజంపేట మండలాలకు చెందిన వైకాపా నేతలు పార్టీలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!