శనగకు అదనపు వసూలు బెడద
అసలే పంట నష్టంతో ముప్పుతిప్పలు పడుతున్న రైతులు అడుగడుగునా దోపిడీకి గురవుతున్నారు. శనగ పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం 80 శాతం రాయితీతో విత్తనం అందిస్తోంది. దీనిపై స్పష్టమైన ధరను పేర్కొనగా రైతు భరోసా కేంద్రాల్లో
క్వింటాకు రూ.20
అసలే పంట నష్టంతో ముప్పుతిప్పలు పడుతున్న రైతులు అడుగడుగునా దోపిడీకి గురవుతున్నారు. శనగ పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం 80 శాతం రాయితీతో విత్తనం అందిస్తోంది. దీనిపై స్పష్టమైన ధరను పేర్కొనగా రైతు భరోసా కేంద్రాల్లో మాత్రం క్వింటాకు అదనంగా రూ.20 వసూలు చేస్తున్నారు. - న్యూస్టుడే, ఎర్రగుంట్ల, ఒంటిమిట్ట, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు
జిల్లాలో రబీ సీజన్లో శనగ సాధారణ విస్తీర్ణం 95,489 హెక్టార్లు. నల్లరేగడి భూములున్న కమలాపురం, పులివెందుల, ముద్దనూరు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప, పోరుమామిళ్ల వ్యవసాయ డివిజన్ల పరిధిలో విస్తారంగా సాగు చేస్తారని అధికారులు ముందస్తుగా గుర్తించారు. అన్నదాతలకు జె.జి-11 రకం 65,648 క్వింటాళ్ల విత్తనాలను ఇవ్వాలని రాష్ట్ర ఉన్నతాధికారులు అనుమతిచ్చారు. కాకపోతే ఈసారి రాయితీ 25 శాతానికి పరిమితం చేశారు. క్వింటా పూర్తి ధర రూ.6,900 కాగా అందులో ప్రభుత్వ వాటా రూ.1,725 (25 శాతం), రైతు రూ.5,175 (75 శాతం) చెల్లించాలని ధరలను ఖరారు చేశారు. విపణిలో ఇంతకంటే తక్కువ ధరకే విత్తనాలు లభిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థకు సేకరణ, సరఫరా బాధ్యతలు అప్పగించారు. l జిల్లాలో గత నెలలో భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. నల్లరేగడి భూముల్లో సాగు చేసిన శనగ పంట నీటిలో మునిగి, తేమ ఎక్కువై దెబ్బతింది. జిల్లావ్యాప్తంగా సుమారు 88,209.63 హెక్టార్లలో ఈ పైరు వర్షార్పణం అయినట్లు వ్యవసాయాధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో శనగ పంటను మళ్లీ సాగు చేసేందుకు ఆసక్తి చూపే అన్నదాతలకు ఆర్థికంగా విత్తన రూపంలో ఊతమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. l 53,102 క్వింటాళ్లు అదనంగా తెప్పించాలని ఏపీ సీడ్స్ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే 32,850 క్వింటాళ్లను ఆయా మండలాల్లోని ఆర్బీకేలకు చేర్చారు. రైతులు 44,250 క్వింటాళ్లు కావాలని తమ పేర్లను నమోదు చేసుకున్నారు. l పెద్దముడియం మండలంలో అత్యధికంగా 35 వేల ఎకరాల్లో పంట దెబ్బతినగా రాయితీ శనగల పంపిణీ జరుగుతోంది. క్వింటా రూ.6,900 ధర నిర్ణయించగా, 80 శాతం రాయితీపోనూ రైతు వాటా రూ.1380 చెల్లించాలి. కొన్ని ఆర్బీకేల్లో రూ.1,400 వసూలు చేస్తున్నారు. కొన్ని మండలాల్లో ఒక్కో ప్యాకెట్ (25 కిలోలు) రూ.345 అయితే రూ.350 తీసుకుంటున్నట్లు సమాచారం. l ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి రైతు భరోసా కేంద్రంలో క్వింటాకు రూ.1,400 వసూలు చేస్తున్నారు. విత్తనం కూడా పూర్తిస్థాయిలో ఇవ్వకుండా తగ్గించి ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
8 మందిపై బైండోవర్ కేసులు
[ 18-04-2024]
మండలంలోని కలసపాడు, చెన్నుపల్లెల్లో 8 మంది పాత నేరస్తులపై గురువారం బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎస్సై నాగమురళి తెలిపారు. -
మేనమామ వేషం... అక్కచెల్లెమ్మలకు మోసం
[ 18-04-2024]
సీఎం జగన్... రాష్ట్రంలోని విద్యార్థులందరికీ తాను మేనమామని గొప్పగా చెప్పుకొంటుంటారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేవిధంగా చేస్తానంటూ బీరాలు పలుకుతుంటారు. ఇందుకోసం అన్ని రకాల సాయాలు చేస్తానంటూ వాగ్దానాలు ఇచ్చేస్తుంటారు. -
ఎన్నికల రణరంగానికి వేళాయె!
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తలపడనున్న అభ్యర్థులు గురువారం నుంచి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంటు స్థానానికి, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు(ఎస్సీ), వైయస్ఆర్ జిల్లా కడప పార్లమెంటు స్థానంతో పాటు కడప, పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు, బద్వేలు(ఎస్సీ), జమ్మలమడుగు, మైదుకూరు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై మైనార్టీల తిరుగుబాటు
[ 18-04-2024]
జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై ముస్లిం మైనార్టీలు తీవ్ర స్థాయిలో తిరుగుబాటు చేశారు. జమ్మలమడుగులోని ఆయన కార్యాలయాన్ని బుధవారం రాత్రి వారంతా ముట్టడించి నిరసన తెలిపారు. -
జగన్ దంపతులకు తెలియకుండా వివేకా హత్య జరిగి ఉండదు
[ 18-04-2024]
సీఎం జగన్ దంపతులకు తెలియకుండా మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగి ఉండదని భాజపా జమ్మలమడుగు అభ్యర్థి ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక భాజపా కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. -
రాజంపేటలో వైకాపాకు భారీ షాక్!
[ 18-04-2024]
రాజంపేట నియోజకవర్గంలో వైకాపాకు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే అధిక సంఖ్యలో నాయకులు తెదేపాలో చేరగా, మరికొందరు నేతలు బుధవారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో మంగళగిరిలో చేరారు. -
దాశరథి...శేష వాహన విహారి
[ 18-04-2024]
శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో తొలిరోజు బుధవారం రాత్రి సీతారాములు ప్రత్యేక అలంకరణలో శేష వాహనంపై భక్తులకు దర్శన మిచ్చారు. -
కాస్త మిగిల్చారు
[ 18-04-2024]
మళ్లీ వైకాపా అధికారంలోకొస్తే ఇక్కడ గగ్గితిప్ప కొండ ఉండేదని మా పిల్లలకు చెప్పాల్సి వస్తుందని ఇటీవల అధికార వైకాపా నుంచి తెదేపాలో చేరిన ఓ నాయకుడు అన్న మాటలవి. -
వైకాపా అండదండలు... నేతలే అనకొండలు..!
[ 18-04-2024]
అధికార వైకాపా అండదండలతో నేతలు అనకొండల్లా కొండలు, గుట్టలను మింగేస్తున్నారు. ‘పచ్చని చెట్లను నరికేస్తే మళ్లీ నాటుకోవచ్చు. అదే కొండలు, గుట్టలను కొల్లగొడితే వాటి ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉంది’ అని న్యాయస్థానాలు అక్షింతలు వేసినా, ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా అధికార నేతల చెవికెక్కడంలేదు. -
ప్రతి హృది నిండుగా... పురుషోత్తముని పండగ
[ 18-04-2024]
ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు ధ్వజారోహణం క్రతువు వైభవంగా జరిగింది. -
ఇదేం సన్నద్ధత
[ 18-04-2024]
ఒంటిమిట్ట కోదండరామాలయం బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని గత మూడు నెలలుగా తితిదే అధికారులు తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. -
ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు తయారీ
[ 18-04-2024]
ఒంటిమిట్ట రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 22న నిర్వహించే సీతారాముల కల్యాణం తిలకించడానికి తరలిరానున్న భక్తులకు పంపిణీ చేయడానికి ముత్యాల తలంబ్రాలు ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. -
పోతన రచనలు జన రంజకం
[ 18-04-2024]
బమ్మెర పోతన రచనలు జన రంజకమై చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయినట్లు తితిదే దత్సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనందతీర్థాచార్యులు పేర్కొన్నారు. ఒంటిమిట్టలో బుధవారం పోతన జయంతి వేడుకలను నిర్వహించారు. -
తొలిప్రయత్నంలోనే సివిల్స్లో 475 ర్యాంకు
[ 18-04-2024]
సివిల్స్లో కడప యువకుడు హరిప్రసాద్రాజు మెరిశాడు. తొలిప్రయత్నంలోనే 475వ ర్యాంకుతో సత్తాచాటాడు. వీరి సొంతూరు రాజంపేట ములక్కాయలపల్లె గ్రామం కాగా, ప్రస్తుతం కడప బాలాజీనగర్ నివాసముంటున్నారు. -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
[ 18-04-2024]
ఎన్నికల ప్రక్రియలో అతి కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు విజయరామరాజు తెలిపారు. -
సెక్యూరిటీ గార్డే శవపరీక్ష నిపుణుడు
[ 18-04-2024]
మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఎంత మంది ఎంఎన్వోలు, జీడీఏ సిబ్బంది వచ్చినా శవపరీక్షలు మాత్రం భద్రతా సిబ్బందే చేయాల్సి వస్తోంది. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రెడ్డెప్ప గత కొంతకాలంగా శవపరీక్ష విధులు నిర్వహిస్తున్నారు. -
చేనేతల సమస్యల పరిష్కారానికి కృషి : నల్లారి
[ 18-04-2024]
చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి హామీ ఇచ్చారు. -
ఉప కారాగారంలో రిమాండు ఖైదీ మృతి
[ 18-04-2024]
మద్యం కేసులో అరెస్టు అయిన నిందితుడు మదనపల్లె ఉప కారాగారంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం ముతుకూరుకు చెందిన మొగిలప్ప (67) వ్యవసాయ కూలి. -
రామయ్యను దర్శించుకున్న శారదాపీఠం ఉత్తరాధికారి
[ 18-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని విశాఖపట్నం శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి బుధవారం సందర్శించారు. -
కడప ఎంపీ స్థానానికి పోటీ చేయాలంటే రూ.40 కోట్ల ఖర్చు
[ 18-04-2024]
కడప పార్లమెంటుకు పోటీ చేయడానికి రూ.40 కోట్ల వరకు ఖర్చవుతుందని, కాంగ్రెస్ పార్టీ మహా అయితే రూ.10 లక్షలు ఇస్తుందని, మిగిలిన డబ్బులు అభ్యర్థి వైఎస్ షర్మిల ఎక్కడి నుంచి తెస్తారని వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి రమేశ్రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
-
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?