logo

ఏపీ గణిత ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా నరసింహారెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ గణిత ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రొద్దుటూరుకు చెందిన అట్లా నరసింహారెడ్డిని ఎన్నుకున్నారు. ఆదివారం విజయవాడ భవానిపురంలోని నేతాజీ ఉన్నత పాఠశాలలో గణిత ఫోరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.ఇందులో భాగంగా ఆయనను

Published : 06 Dec 2021 03:18 IST

ప్రొద్దుటూరు విద్య : ఆంధ్రప్రదేశ్‌ గణిత ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రొద్దుటూరుకు చెందిన అట్లా నరసింహారెడ్డిని ఎన్నుకున్నారు. ఆదివారం విజయవాడ భవానిపురంలోని నేతాజీ ఉన్నత పాఠశాలలో గణిత ఫోరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.ఇందులో భాగంగా ఆయనను ఎన్నుకున్నారు. టెక్నికల్‌ కమిటీ కన్వీనర్‌గా పులివెందులకు చెందిన కోన కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎన్నుకున్నారు. జాతీయనూతనవిద్యా విధానం అమలులో భాగంగా గణిత ప్రాధాన్యంను పెంచాలని నరసింహారెడ్డి కోరారు. ఉపాధ్యాయుల సమస్యపై కృషి చేస్తానని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని