logo

అంగన్‌వాడీ కార్యకర్త దారుణ హత్య

మండలంలోని జౌకుపల్లె ఎస్సీ కాలనీకి చెందిన అంగన్వాడీ కార్యకర్త జాలా వసుంధర (34) శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. జౌకుపల్లెలో జాలా వసుంధర భర్త ప్రభాకర్‌తో కలసి నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో పరస్పరం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు

Updated : 15 Jan 2022 06:34 IST


జాలా వసుంధర (దాచిన చిత్రం)

బ్రహ్మంగారిమఠం, న్యూస్‌టుడే: మండలంలోని జౌకుపల్లె ఎస్సీ కాలనీకి చెందిన అంగన్వాడీ కార్యకర్త జాలా వసుంధర (34) శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. జౌకుపల్లెలో జాలా వసుంధర భర్త ప్రభాకర్‌తో కలసి నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో పరస్పరం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. రాత్రి ఇంటి నుంచి గట్టిగా కేకలు వినిపించడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే వసుంధర రక్తపు మడుగులో శవమై ఉన్నట్లు వారు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. భర్త ప్రభాకర్‌ కోసం గాలిస్తున్నట్లు ఎస్సై చెప్పారు. హతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని