విలీనం దిశగామరో 300 పాఠశాలలు
నూతన విద్యా విధానం అమలుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఇప్పటి నుంచి అవసరమైన ప్రక్రియకు ఉపక్రమించింది. ఇందులో 250 మీటర్ల దూరంలోని ప్రాథమిక పాఠశాలల 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీప ఉన్నత బడుల్లో పంపి విలీనం చేయడం ముఖ్యమైంది. జిల్లావ్యాప్తంగా 307 ప్రాథమిక
కి.మీ. పరిధి నేపథ్యం
వచ్చే విద్యా సంవత్సరంలో అమలు?
కడప విద్య, న్యూస్టుడే : నూతన విద్యా విధానం అమలుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఇప్పటి నుంచి అవసరమైన ప్రక్రియకు ఉపక్రమించింది. ఇందులో 250 మీటర్ల దూరంలోని ప్రాథమిక పాఠశాలల 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీప ఉన్నత బడుల్లో పంపి విలీనం చేయడం ముఖ్యమైంది. జిల్లావ్యాప్తంగా 307 ప్రాథమిక బడుల్లోని 3, 4, 5 తరగతులను వాటి సమీపంలోని 246 ఉన్నత పాఠశాలల్లో విలీనం పూర్తి అయింది. ఈ ప్రక్రియ అమలు సందర్భంగా అనేకచోట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొన్ని పాఠశాలల్లో ప్రాథమిక బడుల నుంచి వెళ్లిన విద్యార్థులతో ఉన్నత పాఠశాలల్లో వసతులు సరిపడక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో అదే ప్రాథమిక పాఠశాలల్లో తరగతులు నిర్వహించుకోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఇదే సమయంలో వచ్చే విద్యా సంవత్సరం ఈ ప్రక్రియను మరింత వేగంగా అమలు చేయటానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది బడుల మధ్య దూరాన్ని పెంచేలా కసరత్తు చేస్తోంది. ఒకటి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో విలీనం చేయడానికి అనువైన పాఠశాలలు ఎన్ని, ఆ విధంగా అయితే ఉన్నత పాఠశాలలకు ఎంతమంది విద్యార్థులు వెళ్లే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల సంఖ్య తదితర అంశాలపై అధికారుల నుంచి ప్రభుత్వం నివేదికలు కోరుతోంది. l జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కిలోమీటరు దూరంలోని 300కుపైగా ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను ఉన్నత బడుల్లో విలీనం చేయాల్సి ఉంటుందని అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమలైతే ఈ విద్యా సంవత్సరం విలీనం అయిన 307 పాఠశాలలకు మరో 300 అదనం కానున్నాయి. అదే 2, 3 కిలోమీటర్ల పరిధిలో పాఠశాలలను విలీనం చేస్తే మరో ఐదువందలకుపైగా బడులు విలీనం కానున్నాయి. ప్రస్తుతం కాగితాలకే పరిమితమైన ఈ అంచనాల వ్యవహారం వచ్చే ఏడాది అమలుకు సిద్ధమైతే విద్యార్థులు తమ పాఠశాలలను మార్చుకోవాల్సి ఉంటుంది. l ప్రాథమిక పాఠశాలల విలీనం వలన డ్రాపౌట్స్ పెరుగుతాయని ప్రాథమిక విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. l ఈ విషయమై జిల్లా విద్యాశాఖాధికారి శైలజ మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరం 250 మీటర్లలోపు ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశామని తెలిపారు. 1, 2, 3 కిలోమీటర్ల దూరంలో పాఠశాలల విలీనం చేయాల్సి వస్తే ఎలాంటి పరిస్థితులు తలెత్తనున్నాయన్న అంశాలపై ఉన్నతాధికారులు వివరాలు సేకరించమన్నారని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారు అడిగిన సమాచారాన్ని సేకరిస్తున్నామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చూసిన కనులదే భాగ్యం!
[ 23-04-2024]
జగదభిరాముడి కల్యాణానికి జగమే ఊయలూగింది. సర్వమంగళ స్వరూపుడు శ్రీరాముడు, సకల జన శుభధాత్రి సీతాదేవి మూడు ముళ్లబంధంతో ఒక్కటైన వేళ భక్తజనం ఆనందంతో పులకించిపోయారు. -
జగన్ను నమ్మినందుకు నట్టేట ముంచారు!
[ 23-04-2024]
సీఎం జగన్ సొంత జిల్లాలో వైకాపా నుంచి పలువురు కీలక నేతలు వరుసగా జారుకుంటున్నారు. ఏళ్ల తరబడి పార్టీలో సేవలందించి.. సొంత ఆస్తుల్ని అమ్ముకున్న వారు... ఇప్పుడు ఆ పార్టీపై, అగ్రనేతలపై విశ్వాసం కోల్పోయి బయటకొచ్చేస్తున్నారు. -
జగన్ పాలన ఫలితమిది!
[ 23-04-2024]
పదోతరగతి ఫలితాల్లో 86.67 ఉత్తీర్ణత శాతంతో జిల్లా రాష్ట్రంలో 17వ స్థానంలో నిలిచింది. బాలురు 83.65, బాలికలు 89.71 ఉత్తీర్ణత శాతం నమోదుతో బాలికలు పైచేయి సాధించారు. -
బద్వేలులో వైకాపాకు భంగపాటు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల తరుణంలో బద్వేలు నియోజకవర్గ వైకాపాలో విభేదాలు రోడ్డెక్కాయి. -
వాలంటీర్ల కోసం వెతుకులాట!
[ 23-04-2024]
తాము రాజీనామా చేసేందుకు ససేమిరా అంటూ గ్రామ/ వార్డు వాలంటీర్లు వైకాపా నేతలకు కంట కనిపించకుండా తిరుగుతున్నారు. -
బాలికలదే పైచేయి!
[ 23-04-2024]
పదోతరగతి ఫలితాల్లో 92.10 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో జిల్లా మూడో స్థానంలో నిలిచింది. -
స్వామిభక్తిని చాటుకున్న పోలీసులు
[ 23-04-2024]
పోలీసులు పక్షపాత ధోరణిని వీడడంలేదు. వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్ల సందర్భంగా వివక్ష చూపిస్తున్నారు. -
కడపలో ఏకమవుతున్న తెదేపా నేతలు
[ 23-04-2024]
కడపలో తెదేపా నేతలందరూ ఏకతాటిపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
అయిదేళ్ల వైకాపా పాలనలో... సాగునీటి ప్రాజెక్టులకు ఒక్క పైసా విదల్చలేదు
[ 23-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు ఒక్క పైసా విదల్చలేదని భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి విమర్శించారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం... నిధులు నిరుపయోగం
[ 23-04-2024]
జిల్లాలో తొలి చెత్త సంపద మండల కేంద్రం రాజుపాళెంలో నిర్మించి గత ప్రభుత్వంలో జిల్లాకు ఆదర్శంగా ఇక్కడ కంపోస్టు ఎరువులు చేసిన ఘణత ఉంది. -
కూటమి అభ్యర్థుల గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి
[ 23-04-2024]
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉమ్మడి పార్టీల అభ్యర్థులను గెలిపించాలని ఎన్డీఏ అభ్యర్థులు, పార్టీల నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. -
‘పది’లో విద్యార్థుల ప్రతిభ
[ 23-04-2024]
జిల్లాలో సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. -
శాసనసభ స్థానాలకు నామపత్రాల దాఖలు
[ 23-04-2024]
ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఆయా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ నామపత్రాలను సమర్పించారు. -
జగన్ పాలన... అభివృద్ధికి ఆమడ దూరాన
[ 23-04-2024]
బద్వేలు పురపాలకలోని శివారు వార్డులు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. -
ఆర్టీపీపీలో ఉద్యోగోన్నతికి అడ్డదారులు
[ 23-04-2024]
డాక్టర్ ఎంవీఆర్ తాప విద్యుదుత్పత్తి కేంద్రం (ఆర్టీపీపీ)లో కొందరు ఉద్యోగులు ఉద్యోగోన్నతికి అడ్డదారులు తొక్కుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ