వృథా నీరు...అరికట్టేదెవరు!
ఏకశిలానగరి చెరువు కట్ట రాళ్ల మధ్యలో నుంచి నీరు కారుతూ బయటికి వస్తోంది. కొన్ని రోజులుగా ఇలా జరుగుతున్నా అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. రామతీర్థం వద్ద తటాకం అంతర్భాగం నుంచి జలాలు కారిపోతున్నా అడ్డుకట్ట వేయలేదు. అయితే 2001 అక్టోబరు 2న వచ్చిన
మరమ్మతులు పట్టని అధికారులు
ఒంటిమిట్ట చెరువు కట్ట మధ్యలో కారుతున్న జలధార
చెరువు కట్ట రాళ్ల మధ్యలో బయటికి వస్తున్న నీరు
ఒంటిమిట్ట, న్యూస్టుడే: ఏకశిలానగరి చెరువు కట్ట రాళ్ల మధ్యలో నుంచి నీరు కారుతూ బయటికి వస్తోంది. కొన్ని రోజులుగా ఇలా జరుగుతున్నా అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. రామతీర్థం వద్ద తటాకం అంతర్భాగం నుంచి జలాలు కారిపోతున్నా అడ్డుకట్ట వేయలేదు. అయితే 2001 అక్టోబరు 2న వచ్చిన వరదలతో రామతీర్థం వద్ద చెరువు మట్టి దెబ్బతింది. అప్పట్లో అధికారులు, రైతులు అప్రమత్తమై బాగు చేయించారు. కడప-రేణిగుంట రహదారి విస్తరణ, అభివృద్ధిలో భాగంగా కట్టను మునుపటి కంటే మరింత బలోపేతం చేశారు. కాకపోతే కోనేరు ఎగువన గతంలో ఎక్కడైతే దెబ్బతిందో అక్కడి నుంచే కట్ట మధ్యలో రాళ్ల నుంచి కొన్నిరోజులుగా జలధార బయటికి వస్తోంది. రామ, లక్ష్మణ తీర్థాల చెంతకు వెళ్లడానికి తాపలు నిర్మించారు. కట్టకు మధ్యలో పిట్ట గోడను ఏర్పాటు చేశారు. మొక్కలు, తీగజాతి ఆకులు అల్లుకున్నాయి. దాంతో నీరు వృథాగా పోతున్నట్లు గుర్తించడం లేదు. మరిన్ని రోజులపాటు నీరు వృథాగా పోతే కట్ట మరింత బలహీనమై పెను ముప్పు జరిగే అవకాశం ఉందని అన్నదాతలు వాపోతున్నారు.
అడ్డుకట్ట వేయాలి..
తటాకం అంతర్గత భాగం నుంచి నీటి ఊట బయటికి రాకుండా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. నీరు కారుతున్న కట్ట ప్రాంతాన్ని గత నెల 20న జలవనరుల శాఖ కడప రెగ్యులర్ డివిజన్ కార్యనిర్వాహక సాంకేతిక అధికారి వెంకట్రామయ్య, ఏఈ సుదర్శన్ పరిశీలించారు. రెండు వారాలు దాటినా ఇక్కడ ఎలాంటి కదలిక లేదు. పనులు చేసినా బిల్లులు సకాలంలో రావని గుత్తేదారులు కూడా చేసేందుకు ఆసక్తి చూపడం లేదని తెలిసింది. ఇప్పటికైనా జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంపై ఈఈ వెంకట్రామయ్యను వివరణ కోరగా చెరువు కట్ట మధ్య భాగంలో నీరు కారుతున్నట్లు తమ పరిశీలనలో గుర్తించినట్లు చెప్పారు. వెంటనే బాగు చేయిస్తామన్నారు.
గత నెల 20న లీకేజీ ప్రాంతాన్ని ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఈఈ వెంకట్రామయ్య (దాచిన చిత్రం)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
[ 25-04-2024]
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
[ 25-04-2024]
సీఎం జగన్ వైకాపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు గురువారం పులివెందుల రానున్నారు. -
మీ బిడ్డనని గారాలు... నీ గడ్డపైనే ఘోరాలు!
[ 25-04-2024]
రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా నరేగా నుంచి రూ.26.02 కోట్లతో 349 మట్టి పనులను వైకాపా నేతలకు పంచిపెట్టారు. -
ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం
[ 25-04-2024]
మాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు -
నేడు రాజంపేట, రైల్వేకోడూరులో ప్రజాగళం
[ 25-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరు పర్యటనకు రానున్నారు -
అక్రమాలకు పాల్పడకుండా గెలిచే సత్తా మీకుందా?
[ 25-04-2024]
అక్రమాలకు పాల్పడకుండా పులివెందులలో గెలిచే సత్తా మీకుందా? అని తెదేపా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి సీఎం జగన్కు సవాల్ విసిరారు -
నీళ్లు గరళం... పారిశుద్ధ్యం అధ్వానం
[ 25-04-2024]
నియోజకవర్గ కేంద్రాలు ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు పట్టణ ప్రాంతాల్లోని కాలనీల ప్రజలు కనీస వసతులకు నోచుకోలేక తల్లడిల్లుతున్నారు -
జగన్ పాలనలో పర్యాటకాభివృద్ధి శూన్యం
[ 25-04-2024]
పర్యాటకుల నుంచి ఛార్జీలు, పన్నులు తదితరాల పేరుతో ఆదాయం వస్తున్నా ఆ రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. -
జగనన్న హామీలు...నీటి మూటలు
[ 25-04-2024]
ఆరునూరైనా అభివృద్ధి చేసి తీరుతాం.. మైదుకూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామంటూ జగన్ ప్రభుత్వంలో పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!