logo

పండగ పూట విషాదం

పండగ పూట రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం ఆయా కుటుంబాల్లో విషాదాన్ని నింపిన ఘటన కూకట్‌పల్లి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నర్సింగరావు కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిధి తాళ్లగడ్డకు చెందిన వహీద్‌(22) రెండేళ్లుగా

Published : 17 Jan 2022 04:30 IST

ప్రమాదంలో ఇద్దరి మృతి...
మరొకరి పరిస్థితి విషమం


ఓబుల్‌రెడ్డి (దాచిన చిత్రం)

కేపీహెచ్‌బీకాలనీ, న్యూస్‌టుడే: పండగ పూట రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం ఆయా కుటుంబాల్లో విషాదాన్ని నింపిన ఘటన కూకట్‌పల్లి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నర్సింగరావు కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిధి తాళ్లగడ్డకు చెందిన వహీద్‌(22) రెండేళ్లుగా కూకట్‌పల్లి పరిధిలోని బాలాజీనగర్‌లో ఉంటూ సెంట్రింగ్‌ పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం మిత్రుడు అమీన్‌పూర్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్‌(24)తో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ప్రవీణ్‌ వాహనం నడుపుతున్నాడు. కడప జిల్లా సిద్ధవటం పరిధి ఖాజీపల్లికి చెందిన చంద్ర ఓబుల్‌రెడ్డి(27) చింతల్‌ నుంచి మిత్రుడిని కలిసేందుకు కూకట్‌పల్లికి వచ్చాడు. పిల్లర్‌ నంబరు 808 వద్ద జాతీయ రహదారి దాటుతుండగా, ప్రవీణ్‌ వాహనాన్ని వేగంగా నడుపుతూ వచ్చి ఓబుల్‌రెడ్డిని ఢీకొట్టాడు. ముగ్గురికి తీవ్ర గాయాలపాలయ్యారు. వహీద్‌, ఓబుల్‌రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందారు. మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని