పద్దు మారక... వైద్యం పడక
ప్రజారోగ్య పరిరక్షణలో కీలమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ)ల నిర్వహణపై నిర్లక్ష్యం కొనసాగుతోంది. వీటిని కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతున్నామని, ఆధునిక పరికరాలు అందుబాటులో ఉంచి రోగులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నామని పాలకులు పదేపదే చెబుతున్నారు.
పీహెచ్సీల అభివృద్ధిపై నీలినీడలు
ఇది బి.కోడూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం. ఈ ఆసుపత్రి ఖాతాలో అభివృద్ధి నిధులు రూ.30,000 ఉన్నాయి.
ఇదే సందర్భంలో ఆరు నెలలుగా వినియోగించిన రూ.50,000 బిల్లులను మంజూరు చేయలేదు.
పోరుమామిళ్ల, బి.కోడూరు, న్యూస్టుడే ప్రజారోగ్య పరిరక్షణలో కీలమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ)ల నిర్వహణపై నిర్లక్ష్యం కొనసాగుతోంది. వీటిని కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతున్నామని, ఆధునిక పరికరాలు అందుబాటులో ఉంచి రోగులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నామని పాలకులు పదేపదే చెబుతున్నారు. వాస్తవంలో వీటికి అవసరమైన నిర్వహణ, అభివృద్ధి నిధులను అందుబాటులో ఉంచే విషయంలో జాప్యం చోటుచేసుకుంటోంది. కొత్తగా మంజూరు అటుంచితే అందుబాటులో ఉన్న నిధులు కూడా వెనక్కి తీసుకుంటున్నారని వైద్యులు ఆవేదన చెందుతున్నారు. హెచ్డీఎస్ పద్దు కింద జిల్లావ్యాప్తంగా వీటికి గతంలో మంజూరైన నిధుల్లో లక్షల మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాకు మళ్లించారు. ఇదే సందర్భంలో వాటి ఖర్చులకు చేసిన బిల్లులు మంజూరుకాకపోవటం విమర్శలకు దారితీస్తోంది.
* జిల్లాలో 75 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 629 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. ప్రజారోగ్య పరిరక్షణలో వీటి సేవలు కీలకం.
* వీటి అభివృద్ధికి ఏటా ఆర్సీహెచ్-2, హెచ్డీఎస్ నిధులు మంజూరు చేస్తారు. ఇందులో ఆసుపత్రి అభివృద్ధికి హెచ్డీఎస్ (ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ) కింద ఏటా రూ.1.75 లక్షలు చొప్పున మంజూరు చేస్తారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలోని 75 పీహెచ్సీలకు రూ. 1.31 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులను పీహెచ్సీ అభివృద్ధి, అత్యవసరమైన వైద్య పరికరాల కోసం వినియోగించాల్సి ఉంది.
* ఈ నిధులను పీడీ ఖాతాల్లో జమ చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తున్నాయి. ఈ పద్దు కింద సత్వరం బిల్లులు చెల్లించటంలేదు. ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులు, వైద్యులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. పరిష్కరించేందుకు వీలుగా ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి యూనియన్ బ్యాంకులో సున్నా ఖాతాలు ప్రారంభించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పీహెచ్సీల నిర్వాహకులు సున్నా ఖాతాలను ప్రారంభించారు. ఇదే సందర్భంలో పీహెచ్సీల్లోని 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయని నిధులను తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. వినియోగించని నిధులను ప్రభుత్వ ఖాతాలోకి జమచేయాలని కోరారు. ఇలా దారి మళ్లిన నిధులు సున్నా ఖాతాల్లోకి జమచేస్తారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆ నిధులను ఎప్పుడు సున్నా ఖాతాల్లోకి జమ చేస్తారో తెలియని పరిస్థితి.
* ఏటా జూన్-జులై నెలల్లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల అభివృద్ధికి రూ.1.75 లక్షల చొప్పున మంజూరు చేస్తారు. సంవత్సర కాలం నుంచి నిధులే మంజూరు కాలేదని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీడీ ఖాతాల్లో నిధులు ఉన్నాయని వైద్యులు సొంతంగా ఖర్చు పెట్టారు. ప్రస్తుతం బిల్లులు చేసేందుకు కూడా ఆస్కారం లేకుండా పోయింది. దీంతో వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనవరి వచ్చినా ఇప్పటికీ నిధులు మంజూరు కాలేదు. ఉన్న నిధులను వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. సేవలు మెరుగు పరచాలన్నా నిధులు అవసరం ఉంది. అన్నింటినీ సున్నా ఖాతాలుగా మార్చి నిధులు జమ చేస్తారని ఈ ప్రక్రియ జరిగేందుకు మరికొంత సమయం పడుతుందని చెబుతున్నారు.
పోరుమామిళ్ల మండలం టేకూరుపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రమిది. ఇక్కడ ఆసుపత్రి అభివృద్ధికి 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. ఆస్పత్రి ఖాతాలో ఉన్న నిధులను కూడా వెనక్కి తీసుకున్నారు. నాడు-నేడు కార్యక్రమం కింద ఆసుపత్రిని ఆధునికీకరించారు. ఒక్కటే పడక ఉంది. అది కూడా చిరిగిపోయి వినియోగానికి పనికిరాకుండా ఉంది.
అందుబాటులోని నిధులు
అట్లూరు పాథ్రమిక ఆరోగ్యకేంద్రంలో రూ. 2.75 లక్షలు ఖర్చు చేయకుండా మిగిలిపోయి ఉన్నాయి. వీటిని సున్నా ఖాతాలోకి జమ చేసిన తరువాతనే వ్యయం చేయటానికి అవకాశం ఉంది. ఖాతాలకు నిధులు జమ అయ్యే వరకు బిల్లులు మంజూరుకావని వైద్యులు పేర్కొంటున్నారు.
* తొట్టిగారిపల్లె ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఖాతాలో రూ. 4 లక్షల నిధులు ఉన్నాయి. వీటి వినియోగానికి ప్రస్తుతం అడ్డంకులు ఎదురవుతున్నాయి.
* కలసపాడు ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం పరిధిలో హెచ్డీఎస్ మిగులు నిధులతో రూ. 35,000 వెచ్చించి కంప్యూటర్లు కొనుగోలు చేశారు. ఆసుపత్రికి అవసరమైన పరికరాలు కొనుగోలుకు వీలుగా రూ.75,000 బిల్లులను పీడీ ఖాతాలకు పెట్టినా మంజూరు కాలేదు.
ఆందోళన అనవసరం
ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు వస్తున్న రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వైద్యఆరోగ్యశాఖలో జీరో ఖాతాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. నిధులు వెనక్కి వెళ్లడం కాదు. జీరో ఖాతాల్లో జమ చేస్తారు. వైద్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
- శేఖర్, డిప్యూటీ డీఎంహెచ్ంవో, రాజంపేట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుగుబాటు మొదలైంది.. జగన్ ఇంటికి పోవడం ఖాయం: చంద్రబాబు
[ 25-04-2024]
రాయలసీమలో తిరుగుబాటు మొదలైందని.. జగన్ ఇంటికి పోవడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
వైకాపాని పాతాళానికి తొక్కేద్దాం.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం: పవన్
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దాం.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
[ 25-04-2024]
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
[ 25-04-2024]
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
[ 25-04-2024]
సీఎం జగన్ వైకాపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు గురువారం పులివెందుల రానున్నారు. -
మీ బిడ్డనని గారాలు... నీ గడ్డపైనే ఘోరాలు!
[ 25-04-2024]
రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా నరేగా నుంచి రూ.26.02 కోట్లతో 349 మట్టి పనులను వైకాపా నేతలకు పంచిపెట్టారు. -
ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం
[ 25-04-2024]
మాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు -
నేడు రాజంపేట, రైల్వేకోడూరులో ప్రజాగళం
[ 25-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరు పర్యటనకు రానున్నారు -
అక్రమాలకు పాల్పడకుండా గెలిచే సత్తా మీకుందా?
[ 25-04-2024]
అక్రమాలకు పాల్పడకుండా పులివెందులలో గెలిచే సత్తా మీకుందా? అని తెదేపా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి సీఎం జగన్కు సవాల్ విసిరారు -
నీళ్లు గరళం... పారిశుద్ధ్యం అధ్వానం
[ 25-04-2024]
నియోజకవర్గ కేంద్రాలు ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు పట్టణ ప్రాంతాల్లోని కాలనీల ప్రజలు కనీస వసతులకు నోచుకోలేక తల్లడిల్లుతున్నారు -
జగన్ పాలనలో పర్యాటకాభివృద్ధి శూన్యం
[ 25-04-2024]
పర్యాటకుల నుంచి ఛార్జీలు, పన్నులు తదితరాల పేరుతో ఆదాయం వస్తున్నా ఆ రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. -
జగనన్న హామీలు...నీటి మూటలు
[ 25-04-2024]
ఆరునూరైనా అభివృద్ధి చేసి తీరుతాం.. మైదుకూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామంటూ జగన్ ప్రభుత్వంలో పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ