ఓటీఎస్ అనిపించాలని...
రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ద్వారా రుణం తీసుకుని నిర్మించుకున్న ఇళ్లకు ‘జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం’ ద్వారా ఏకకాలం చెల్లింపులు (ఓటీఎస్) పేరుతో చేపట్టిన వసూళ్లకు ప్రభుత్వం అతివల అప్పు సర్దుబాటు అస్త్రం ప్రయోగించింది. మహిళలకు డ్వాక్రా రుణం
మహిళలకు డ్వాక్రా రుణాల మంజూరు
ఏకకాల చెల్లింపులకు ఆ సొమ్మే వసూలు
మండలానికి 200 మంది లబ్ధిదారుల లక్ష్యం
ముందుకు రావాలంటూ వనితలపై ఒత్తిడి
- న్యూస్టుడే, రాజంపేట పట్టణం
లబ్ధిదారులకు పత్రాలు అందజేస్తున్న అధికారులు
రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ద్వారా రుణం తీసుకుని నిర్మించుకున్న ఇళ్లకు ‘జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం’ ద్వారా ఏకకాలం చెల్లింపులు (ఓటీఎస్) పేరుతో చేపట్టిన వసూళ్లకు ప్రభుత్వం అతివల అప్పు సర్దుబాటు అస్త్రం ప్రయోగించింది. మహిళలకు డ్వాక్రా రుణం మంజూరు చేసి జమ చేసుకోవాలని చేస్తున్న ప్రయత్నంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. తొలుత గుర్తించిన లబ్ధిదారులు స్వచ్ఛందంగా ముందుకు వస్తారని ఆశిస్తే.. క్షేత్రస్థాయిలో స్పందన తక్కువగా వచ్చింది. ఈ నేపథ్యంలో మహిళా స్వయం సహాయ సంఘాల సభ్యుల ద్వారా రాబట్టుకునేందుకు అధికారులు, సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రతి మండలం నుంచి 200 మంది ద్వారా రాబట్టాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ కాలేదు. కేవలం నోటి మాటను పరిగణనలోకి తీసుకుని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని మౌఖిక ఆదేశాలిచ్చారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారుల ద్వారా ఒత్తిడి పెంచినా కొన్ని మండలాల్లో చాలామంది స్వచ్ఛందంగా ముందుకు రాకపోవడం గమనార్హం.
అప్పు తీసుకోండి... జమ చేయండి
పేద, మధ్యతరగతి వర్గాల లబ్ధిదారుల నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వడంతో లక్ష్యం చేరుకోవడం కష్టమని భావించిన అధికారులు ప్రత్యామ్నాయ ఆలోచన చేశారు. సామాజిక పెట్టుబడినిధి, గ్రామ, మండల సమాఖ్య, పొదుపు నిల్వలు, బ్యాంకు లింకేజీ ద్వారా రూ.10 వేలు ఇస్తామని, ఓటీఎస్కు జమ చేయాలని క్షేత్రస్థాయిలో యంత్రాంగం ఒత్తిడి పెంచింది. ఊరూరా పర్యటించి కొన్ని మండలాల్లో రూ.10 వేలు పరపతిని నగదు రూపంలో డ్వాక్రా సభ్యులకు అందజేశారు. అక్కడే గ్రామ సచివాలయాల సిబ్బంది ద్వారా వసూలు చేసే ప్రక్రియను సైతం చేపట్టారు. మరికొన్ని మండలాల్లో ఆన్ లైన్ రూపంలో సర్దుబాటు చేశారు. అయినా కొన్నిచోట్ల 50 శాతం ప్రగతి సాధించలేదు. ఒంటిమిట్ట మండలంలో 200 మందికి 81 మంది, రాజంపేట మండలంలో 89, నందలూరులో 87, సిద్దవటంలో 73 మంది ముందుకొచ్చారు. మిగతా మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇలా తీసుకున్న రుణాన్ని 10, 24, 36 నెలల్లో కంతులు చెల్లించేవిధంగా ప్రణాళికను రూపొందించారు. ధనాగారాల్లో పరపతి పొందితే 9 శాతం, పొదుపు ద్వారా రుణం తీసుకుంటే 12 శాతం వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఈ భారం ఎలా భరించాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.
అధికారుల తీరుతో కినుక
డ్వాక్రా సంఘాల సభ్యులను ఓటీఎస్ అమలులో భాగస్వాములను చేయాలని ఉన్నతాధికారులు మౌఖికంగా డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. సంక్రాంతి పండగకు ముందు లక్ష్యాలను నిర్దేశించారు. వెనుకబడిన మండలాలను గుర్తించి అక్కడి సిబ్బందిని గట్టిగా మందలించినట్లు సమాచారం. పనిచేస్తే చేయండి.. లేదంటే వెళ్లిపోండి అనే ధోరణిలో మాట్లాడటంతో సిబ్బంది తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. అధికారిక ఉత్తర్వులివ్వకుండా నోటి మాటగా చెబితే ఎలా ముందుకెళ్లాలని సీనియర్ అధికారి ఒకరు వాపోయారు. జిల్లాలో లక్ష్యాలు చేరుకోని 29 మంది సచివాలయ సిబ్బందికి సంజాయిషీ తాఖీదులు జారీ చేసినట్లు తెలిసింది.
ఎవరిపై ఒత్తిడి తీసుకురాలేదు - ఎ.మురళీమనోహర్, పీడీ, డీఆర్డీఏ
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అమలులో భాగంగా ఏకకాల చెల్లింపులకు డ్వాక్రా సంఘాల సభ్యులపై ఎలాంటి ఒత్తిడి చేయలేదు. చాలామంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి నగదు చెల్లించారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి రుణాలు మంజూరు చేయించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
[ 25-04-2024]
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
[ 25-04-2024]
సీఎం జగన్ వైకాపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు గురువారం పులివెందుల రానున్నారు. -
మీ బిడ్డనని గారాలు... నీ గడ్డపైనే ఘోరాలు!
[ 25-04-2024]
రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా నరేగా నుంచి రూ.26.02 కోట్లతో 349 మట్టి పనులను వైకాపా నేతలకు పంచిపెట్టారు. -
ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం
[ 25-04-2024]
మాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు -
నేడు రాజంపేట, రైల్వేకోడూరులో ప్రజాగళం
[ 25-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరు పర్యటనకు రానున్నారు -
అక్రమాలకు పాల్పడకుండా గెలిచే సత్తా మీకుందా?
[ 25-04-2024]
అక్రమాలకు పాల్పడకుండా పులివెందులలో గెలిచే సత్తా మీకుందా? అని తెదేపా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి సీఎం జగన్కు సవాల్ విసిరారు -
నీళ్లు గరళం... పారిశుద్ధ్యం అధ్వానం
[ 25-04-2024]
నియోజకవర్గ కేంద్రాలు ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు పట్టణ ప్రాంతాల్లోని కాలనీల ప్రజలు కనీస వసతులకు నోచుకోలేక తల్లడిల్లుతున్నారు -
జగన్ పాలనలో పర్యాటకాభివృద్ధి శూన్యం
[ 25-04-2024]
పర్యాటకుల నుంచి ఛార్జీలు, పన్నులు తదితరాల పేరుతో ఆదాయం వస్తున్నా ఆ రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. -
జగనన్న హామీలు...నీటి మూటలు
[ 25-04-2024]
ఆరునూరైనా అభివృద్ధి చేసి తీరుతాం.. మైదుకూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామంటూ జగన్ ప్రభుత్వంలో పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు