కాసుల వేట...ప్రైవేటు కోత!
అమ్మ అవ్వాలని ప్రతి మహిళ కల. ఎన్ని కష్టాలనైనా అనుభవించి బిడ్డకు ఆరోగ్యకరమైన జన్మనివ్వాలని ఆరాట పడతుందామె. ఆరోగ్యపరంగా అత్యంత జాగ్రత్తలు పాటించి ప్రసవానికి సిద్ధమవుతారు. వారికిది ఒక అపురూప ఘట్టం. దీనిని ప్రైవేటు ఆసుపత్రులు
మాతృత్వంతో వ్యాపారం... సిజేరియన్లకే ప్రాధాన్యం
అధిక వసూళ్లపై దృష్టి సారించని అధికారులు
పేద, మధ్య తరగతి వర్గాలపై ఆర్థిక భారం
న్యూస్టుడే, ప్రొద్దుటూరు వైద్యం
అమ్మ అవ్వాలని ప్రతి మహిళ కల. ఎన్ని కష్టాలనైనా అనుభవించి బిడ్డకు ఆరోగ్యకరమైన జన్మనివ్వాలని ఆరాట పడతుందామె. ఆరోగ్యపరంగా అత్యంత జాగ్రత్తలు పాటించి ప్రసవానికి సిద్ధమవుతారు. వారికిది ఒక అపురూప ఘట్టం. దీనిని ప్రైవేటు ఆసుపత్రులు డబ్బుతో ముడి పెట్టడం సమాజాన్ని బాధిస్తోంది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉండేందుకు కుటుంబ సభ్యులు ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. దీనిని అందిపుచ్చుకుని ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు కాసుల పంట పండిస్తున్నారు. ఇష్టానుసారంగా శస్త్రచికిత్సలు (సిజేరియన్లు) చేస్తున్నారు. వీటి విషయంలో ప్రభుత్వం నిర్ధేశించిన నిబంధనను ఆసుపత్రులు పాటించడం లేదని తెలుస్తోంది. అధికారులు వీటిపై దృష్టి సారించక పోవడంతోనే ప్రైవేటు కాన్పుల ఆసుపత్రులు డబ్బుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పేద, ధనిక తేడా లేకుండా శస్త్రచికిత్సలు చేసి బాధితుల నుంచి రూ.వేలకు వేలు గుంజుతున్నారని బాధితులు వాపోతున్నారు. పలు ఆసుపత్రుల్లో చివరి నిమిషంలో వివిధ కారణాలు చూపి గర్భిణి బంధువులను భయానికి గురిచేసి శస్త్రచికిత్సే మార్గంగా చూపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేసేదేమి లేక వైద్యులు చెప్పిన దానికి తలూపి డబ్బును సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందంటున్నారు.
ప్రసవానికి రూ.50 వేలు వసూలు
సిజేరియన్ కాన్పుకు పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో సుమారు రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. సాధారణ ప్రసవమైతే రూ.20 వేల వరకు తీసుకుంటున్నారు. దీంతో పోలిస్తే సిజేరియన్కే ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తుండటంతో అవసరం లేకున్నా శస్త్రచికిత్సకే ప్రాధాన్యం ఇస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. దీంతో దాదాపుగా సిజేరియన్ కాన్పు జరగవచ్చని అంచనాతో ముందే దానికి సరిపడా నగదును సిద్ధం చేసుకుంటున్నామని పలువురు చెబుతున్నారు. మొదటిసారి సిజేరియన్ జరిగితే రెండవ సారి గర్భం దాల్చినపుడు దాదాపుగా సిజేరియన్ చేయాలి.
నైపుణ్యం తగ్గిందా... డబ్బు కోసమే చేస్తున్నారా?
అధునాతన వైద్యం అందుబాటులో లేని రోజుల్లో ఇళ్ల వద్దే సాధారణ కాన్పులు జరిగేవి. అనుభవం కలిగిన వారే (మంత్రసానులు, ఏమీ చదువుకోని వారు) సాధారణ ప్రసవాలు చేసేవారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు తల్లీబిడ్డను దక్కించుకోవడం కష్టంగానే ఉండేది. ప్రస్తుతం అధునాతన వైద్య విధానాలు, సకల సదుపాయాలు అందుబాటులో ఉన్నా ఎక్కువ శాతం సాధారణ ప్రసవాలు జరగడంలేదు. కాన్పు కూడా యాంత్రికంగా మారిపోయింది. తల్లీబిడ్డ ప్రాణాలకు హాని కలిగినప్పుడో, ఉమ్ము నీరు పోయినప్పుడో, బిడ్డ అడ్డంగా తిరిగినప్పుడో ఇలా తప్పని పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్కు మోగ్గు చూపాలి. అయితే పలువురు వైద్యులు అవసరం లేకున్నా సిజేరియన్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గర్భంలో ఉన్న శిశువును క్షుణ్ణంగా పరిశీలించే స్కానింగ్ పరికరాలూ అందుబాటులో ఉన్నాయి. పలుమార్లు బిడ్డ స్థితిగతులను తెలుసుకుంటున్నారు. సకల సదుపాయాలతో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటూ కూడా సాధారణ ప్రసవాలు తగ్గిపోతుండటంతో నైపుణ్యం తగ్గిందా? లేక డబ్బు కోసమే శస్త్రచికిత్సలు చేస్తున్నారా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. చేసిన ప్రసవాల సంఖ్యలో 30 శాతం వరకు మాత్రమే సిజేరియన్ కాన్పులు ఉండాలనే నిబంధన ఉంది. అయితే చాలా వరకు ఆసుపత్రులు దానికి భిన్నంగా చేస్తున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో సైతం సిజేరియన్ల శాతం ఎక్కువగానే ఉంది. అయితే ఇప్పటికీ సాధారణ ప్రసవాలకు పేరు మోసిన ప్రైవేటు ఆసుపత్రులు లేకపోలేదు. అవి చాలా తక్కువగా ఉన్నాయి.
తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటాం
ప్రభుత్వ నిబంధనల ప్రకారం 15 శాతం మాత్రమే శస్త్రచికిత్స ప్రసవాలు చేయాలి. గరిష్టంగా 30 శాతం వరకూ చేయవచ్ఛు ప్రతి ఆసుపత్రిలో సిజేరియన్ల సంఖ్యను నమోదు చేసుకుంటాం. కొన్నిచోట్ల ఎక్కువ శాతం జరుగుతున్నాయి. ప్రతి సిజేరియన్ ఎందుకు చేయాల్సి వచ్చిందనే పూర్తి వివరాలు సేకరిస్తాం. డీఎంహెచ్వో ఆసుపత్రులు తనిఖీ చేస్తుంటారు. వైద్యులకు సూచనలు చేస్తుంటాం. ఎక్కువ శాతం చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. సిజేరియన్ల సంఖ్యను తగ్గించే దిశగా చర్యలు చేపడతాం. - రామేశ్వరుడు, డీసీహెచ్ఎస్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
[ 25-04-2024]
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
[ 25-04-2024]
సీఎం జగన్ వైకాపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు గురువారం పులివెందుల రానున్నారు. -
మీ బిడ్డనని గారాలు... నీ గడ్డపైనే ఘోరాలు!
[ 25-04-2024]
రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా నరేగా నుంచి రూ.26.02 కోట్లతో 349 మట్టి పనులను వైకాపా నేతలకు పంచిపెట్టారు. -
ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం
[ 25-04-2024]
మాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు -
నేడు రాజంపేట, రైల్వేకోడూరులో ప్రజాగళం
[ 25-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరు పర్యటనకు రానున్నారు -
అక్రమాలకు పాల్పడకుండా గెలిచే సత్తా మీకుందా?
[ 25-04-2024]
అక్రమాలకు పాల్పడకుండా పులివెందులలో గెలిచే సత్తా మీకుందా? అని తెదేపా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి సీఎం జగన్కు సవాల్ విసిరారు -
నీళ్లు గరళం... పారిశుద్ధ్యం అధ్వానం
[ 25-04-2024]
నియోజకవర్గ కేంద్రాలు ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు పట్టణ ప్రాంతాల్లోని కాలనీల ప్రజలు కనీస వసతులకు నోచుకోలేక తల్లడిల్లుతున్నారు -
జగన్ పాలనలో పర్యాటకాభివృద్ధి శూన్యం
[ 25-04-2024]
పర్యాటకుల నుంచి ఛార్జీలు, పన్నులు తదితరాల పేరుతో ఆదాయం వస్తున్నా ఆ రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. -
జగనన్న హామీలు...నీటి మూటలు
[ 25-04-2024]
ఆరునూరైనా అభివృద్ధి చేసి తీరుతాం.. మైదుకూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామంటూ జగన్ ప్రభుత్వంలో పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!