logo

కడప జిల్లాలో లారీ- ఆర్టీసీ బస్సు ఢీ: పది మందికి తీవ్ర గాయాలు

కడప జిల్లా రాయచోటి- వేంపల్లి ప్రధాన మార్గంలోని పాయలోపల్లి ఘాట్ వద్ద ఆర్టీసీ బస్సు- లారీ ఢీకొన్నాయి.

Published : 22 Jan 2022 13:27 IST

 

రాయచోటి: కడప జిల్లా రాయచోటి- వేంపల్లి ప్రధాన మార్గంలోని పాయలోపల్లి ఘాట్ వద్ద ఆర్టీసీ బస్సు- లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై చక్రాయపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని