logo

చికిత్స పొందుతూఉపాధ్యాయురాలు మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మహిళా ఉపాధ్యాయురాలు మృతి చెందినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. కడప హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన ఉమాదేవి (56) చెన్నూరు మండలం చిన్నమాసుపల్లెలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఈనెల 18వ తేదీ ఆమె పాఠశాలకు

Published : 23 Jan 2022 02:32 IST


ఉమాదేవి (దాచిన చిత్రం)

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మహిళా ఉపాధ్యాయురాలు మృతి చెందినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. కడప హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన ఉమాదేవి (56) చెన్నూరు మండలం చిన్నమాసుపల్లెలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఈనెల 18వ తేదీ ఆమె పాఠశాలకు వెళ్లేందుకు ఆర్టీసీ అద్దె బస్సు ఎక్కారు. చోదకుడి నిర్లక్ష్యం కారణంగా బస్సులో నుంచి కింద పడడంతో తలకు బలమైన గాయమైంది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వేలూరుకు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ తెలిపారు. మృతురాలి భర్త వేంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని