పనులు జరిగేనా...పాలు పొంగేనా!
కడప పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టిడ్కో) చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు కొన్ని పూర్తయినా పేదల దరిచేరడంలేదు. టెండర్ల విధానంలో నిబంధనలు, పాలనా యంత్రాంగంలో కదలిక లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. జిల్లాలో 9 ప్రాంతాల్లో పేద వర్గాలకు అత్యాధునిక వసతులతో
అసంపూర్తిగా టిడ్కో గృహసముదాయాలు
కడప నగరంలోని లక్ష్మీనగర్లో నిర్మించిన టిడ్కో ఇళ్లు
- ఈనాడు డిజిటల్, కడప పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టిడ్కో) చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు కొన్ని పూర్తయినా పేదల దరిచేరడంలేదు. టెండర్ల విధానంలో నిబంధనలు, పాలనా యంత్రాంగంలో కదలిక లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. జిల్లాలో 9 ప్రాంతాల్లో పేద వర్గాలకు అత్యాధునిక వసతులతో పట్టణ ప్రాంతాల్లో 19,231 ఇళ్ల నిర్మాణాన్ని గత ప్రభుత్వం తలపెట్టింది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 25 శాతం చొప్పున, లబ్ధిదారులు 50 శాతం రుణ రూపంలో వెచ్చించాల్సి ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలు రాష్ట్రంలో అధికార మార్పిడితో నిలిచిపోయాయి. 25 శాతం లోపు పనులను నిలిపివేయాలనే నిబంధన కింద జిల్లా యూనిట్గా తీసుకోగా పనులన్నీ ఆపేయాల్సి వచ్చిందని టిడ్కో అధికారులు చెపుతున్నారు. దీంతో నిర్మాణాలు దాదాపు పూర్తయిన వాటిని కూడా లబ్ధిదారులకు కేటాయించలేని పరిస్థితి నెలకొంది. ఇతర జిల్లాల్లో అసంపూర్తి పనులు పూర్తిచేసి లబ్ధిదారులకు కేటాయించే ప్రయత్నాలు జరుగుతుండగా జిల్లాలో ఆ పరిస్థితి కనిపించడంలేదు. అత్యాధునిక నిర్మాణాలు నిర్వహణ లేక పాడైపోతుండడం గమనార్హం. n కడప నగరపాలక సంస్థ పరిధిలో మొదటి దశలో పారిశ్రామికవాడ లక్ష్మీనగర్ వద్ద జీ+3 ఆకృతితో 31 విభాగాల్లో 32 ఇళ్లు చొప్పున 992 ఇళ్ల నిర్మాణం చిన్నపాటి పనులు తప్ప పూర్తయ్యాయి. చలమా రెడ్డిపల్లె వద్ద రెండో దశ నిర్మాణాలు చేపట్టారు. విద్యుత్తు లైన్లు, నియంత్రికలు ఏర్పాటు చేయగా ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వడం తదితర చిన్నపాటి పనులే మిగిలి ఉన్నాయి. n జమ్మలమడుగులో 1,440 గానూ 1,404 గృహాల నిర్మాణం దాదాపు పూర్తయింది. ఇక్కడ ఒక బ్లాక్లో మాత్రమే 36 ఇళ్లు నిర్మించాల్సి ఉంది. n ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, రాయచోటిలో కొంత వరకు పనులు జరిగాయి. n రాజంపేట, బద్వేలు, మైదుకూరులో నిధులు వెచ్చించనప్పటికీ పులివెందుల్లో మాత్రం రూ.కోటి వ్యయం చేశారు.
నివేదిక సమర్పించాం...
టిడ్కో ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాం. నిర్మాణం చేపట్టిన గుత్తేదారే మిగిలిన పనులు చేయాల్సి ఉంటుంది. ఇందుకు అనుమతులు అవసరం. నిర్మాణం పూర్తయిన గృహాలు కేటాయింపునకు అసంపూర్తి పనులు సైతం పూర్తి చేయాల్సి ఉంది. - లీలాకృష్ణప్రసాద్, ఈఈ, టిడ్కో
భవన సముదాయాల నిర్మిత ప్రాంతాలు : 9
మూడు దశల్లో చేపట్టే ఇళ్ల యూనిట్లు : 19,231
నిర్మాణం ప్రారంభం : 13,744
ప్రాజెక్టు వ్యయం : రూ.1061.62 కోట్లు
నిధుల ఖర్చు : రూ.160.82 కోట్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాని పాతాళానికి తొక్కేద్దాం.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం: పవన్
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దాం.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
[ 25-04-2024]
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
[ 25-04-2024]
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
[ 25-04-2024]
సీఎం జగన్ వైకాపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు గురువారం పులివెందుల రానున్నారు. -
మీ బిడ్డనని గారాలు... నీ గడ్డపైనే ఘోరాలు!
[ 25-04-2024]
రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా నరేగా నుంచి రూ.26.02 కోట్లతో 349 మట్టి పనులను వైకాపా నేతలకు పంచిపెట్టారు. -
ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం
[ 25-04-2024]
మాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు -
నేడు రాజంపేట, రైల్వేకోడూరులో ప్రజాగళం
[ 25-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరు పర్యటనకు రానున్నారు -
అక్రమాలకు పాల్పడకుండా గెలిచే సత్తా మీకుందా?
[ 25-04-2024]
అక్రమాలకు పాల్పడకుండా పులివెందులలో గెలిచే సత్తా మీకుందా? అని తెదేపా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి సీఎం జగన్కు సవాల్ విసిరారు -
నీళ్లు గరళం... పారిశుద్ధ్యం అధ్వానం
[ 25-04-2024]
నియోజకవర్గ కేంద్రాలు ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు పట్టణ ప్రాంతాల్లోని కాలనీల ప్రజలు కనీస వసతులకు నోచుకోలేక తల్లడిల్లుతున్నారు -
జగన్ పాలనలో పర్యాటకాభివృద్ధి శూన్యం
[ 25-04-2024]
పర్యాటకుల నుంచి ఛార్జీలు, పన్నులు తదితరాల పేరుతో ఆదాయం వస్తున్నా ఆ రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. -
జగనన్న హామీలు...నీటి మూటలు
[ 25-04-2024]
ఆరునూరైనా అభివృద్ధి చేసి తీరుతాం.. మైదుకూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామంటూ జగన్ ప్రభుత్వంలో పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం