logo

రహదారి ప్రమాదంలో యువకుడి దుర్మరణం

మండలంలోని మంటపంపల్లెలో జరిగిన రహదారి ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఒంటిమిట్ట ఎస్‌.ఐ సంజీవరాయుడు కథనం మేరకు.. రాజంపేట మండలం బోయనపల్లి శివారులో ఉన్న ఎల్లాగడ్డకు చెందిన షేక్‌ మున్నా (22) వ్యక్తిగత పని నిమిత్తం ఆదివారం తన ద్విచక్ర వాహనంలో కడపకు వస్తుండగా కడప

Published : 24 Jan 2022 04:17 IST

షేక్‌ మున్నా (పాత చిత్రం)

మంటపంపల్లె(ఒంటిమిట్ట), న్యూస్‌టుడే: మండలంలోని మంటపంపల్లెలో జరిగిన రహదారి ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఒంటిమిట్ట ఎస్‌.ఐ సంజీవరాయుడు కథనం మేరకు.. రాజంపేట మండలం బోయనపల్లి శివారులో ఉన్న ఎల్లాగడ్డకు చెందిన షేక్‌ మున్నా (22) వ్యక్తిగత పని నిమిత్తం ఆదివారం తన ద్విచక్ర వాహనంలో కడపకు వస్తుండగా కడప నుంచి తిరుపతి వైపు వెళుతున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మున్నా తీవ్రంగా గాయపడ్డారు. అధిక రక్తస్త్రావం కావడం, తలకు బలమైన దెబ్బలు తగలడంతో ప్రమాదస్థలిలోనే ఆ యువకుడు కన్నుమూశాడు. తమ బిడ్డ మృతి చెందారని సమాచారం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతిచెందిన యువకుడికి కడపకు చెందిన యువతితో పెద్దలు ఆదివారమే వివాహం చేయాలని నిశ్చయించారు. మృతదేహాన్ని కడప సర్వజన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్‌.ఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు