logo

AP News:‘జగన్‌ కొంపముంచేది కొడాలి నానే’

వైకాపా పతనం కావడానికి ప్రజాగ్రహం, ఉద్యోగుల ఉద్యమాలు అవసరం లేదని మంత్రి కొడాలి నాని ఇష్టానుసారంగా మాట్లాడే మాటలే జగన్‌ కొంప ముంచనున్నాయని కడప పార్లమెంట్‌ తెదేపా అధ్యక్షుడు మల్లేల లింగారెడ్డి దుయ్యబట్టారు. మంగళవారం తెదేపా కార్యాలయంలో

Updated : 26 Jan 2022 09:37 IST

వైకాపా ఇసుక దోపిడీ విలువ రూ.5 వేల కోట్లు


మాట్లాడుతున్న తెదేపా నేత మల్లేల లింగారెడ్డి

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: వైకాపా పతనం కావడానికి ప్రజాగ్రహం, ఉద్యోగుల ఉద్యమాలు అవసరం లేదని మంత్రి కొడాలి నాని ఇష్టానుసారంగా మాట్లాడే మాటలే జగన్‌ కొంప ముంచనున్నాయని కడప పార్లమెంట్‌ తెదేపా అధ్యక్షుడు మల్లేల లింగారెడ్డి దుయ్యబట్టారు. మంగళవారం తెదేపా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. మంత్రి అంటే హుందాతనంగా ఉండాలని, వినకూడని, చదవకూడని భాషను జాతీయస్థాయి నాయకుడైన చంద్రబాబుపై ఆయన ప్రయోగించడం సిగ్గుచేటని విమర్శించారు. కొండాపురం మండలంలోని పొట్టిపాడు, అనంతపురం గ్రామాల్లో చిత్రావతి నదిపై ఉన్న ఇసుక క్వారీల్లో వైకాపా నాయకులు, ఎమ్మెల్యే దోపిడీ ఎక్కువైందని ఎమ్మెల్సీ శివనాథరెడ్డి, మల్లెల లింగారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీని సీఎం జగన్‌ రద్దు చేయడంతో భవన నిర్మాణ రంగంలోని కార్మికులతోపాటు 25 రకాల వ్యాపారాలు కుదేలయ్యాయని వాపోయారు. ఇసుక వల్ల ప్రభుత్వానికి రూ.300 కోట్లు ఆదాయం ఉంటే వైకాపా నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కలసి రూ.5 వేల కోట్లు దోచుకుంటున్నారని విమర్శించారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణారెడ్డి, పొన్నతోట శ్రీను పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు