logo

గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

తెలుగుగంగ మినీ జలాశయంలో పడిన హుషేన్‌బాషా(32) మృతదేహం బుధవారం లభ్యమైంది. చాగలమర్రి పట్టణానికి చెందిన వెల్డింగ్‌ వర్కర్‌ హుసేన్‌ బాషా(32) ఈ నెల 23న స్నేహితులతో కలసి భైరవగుండాల

Published : 27 Jan 2022 01:45 IST

చాగలమర్రి, న్యూస్‌టుడే: తెలుగుగంగ మినీ జలాశయంలో పడిన హుషేన్‌బాషా(32) మృతదేహం బుధవారం లభ్యమైంది. చాగలమర్రి పట్టణానికి చెందిన వెల్డింగ్‌ వర్కర్‌ హుసేన్‌ బాషా(32) ఈ నెల 23న స్నేహితులతో కలసి భైరవగుండాల వద్దకు సరదాగా గడిపేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు తెలుగు గంగ కాలువలో పడి గల్లంతైన విషయం తెలిసిందే. ఎస్సై మారుతీ రెండు రోజులుగా గాలించారు. దువ్వూరు మండలం నీలాపురం కొండల్లోని కాలువలో తేలియాడుతున్న శవాన్ని స్థానికులు గుర్తించి బుధవారం సమాచారం ఇచ్చారు. హుసేన్‌ బాషా మృతదేహంగా గుర్తించి ఆళ్లగడ్డకు తరలించామని ఎస్సై మారుతి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని