logo

ఉద్యోగులకు తేనీటి విందు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్‌ బంగళా ప్రాంగణంలో బుధవారం రాత్రి తేనీటి విందు సందడిగా జరిగింది. కలెక్టర్‌ విజయరామరాజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, ఎస్పీ అన్బురాజన్‌, జేసీలు గౌతమి, సాయికాంత్‌వర్మ, ధ్యాన్‌చంద్ర, సబ్‌ కలెక్టర్‌

Published : 27 Jan 2022 01:45 IST


మహిళా అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయరామరాజు, జేసీ గౌతమి

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్‌ బంగళా ప్రాంగణంలో బుధవారం రాత్రి తేనీటి విందు సందడిగా జరిగింది. కలెక్టర్‌ విజయరామరాజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, ఎస్పీ అన్బురాజన్‌, జేసీలు గౌతమి, సాయికాంత్‌వర్మ, ధ్యాన్‌చంద్ర, సబ్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌, డీఎఫ్‌వో రవీంద్రదామా, ఆర్డీవోలు ధర్మచంద్రారెడ్డి, శ్రీనివాసులు, మరికొందరు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో అధికారులు అందించిన సేవలు అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వీరందరికీ కలెక్టర్‌ జ్ఞాపికలు అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని