ఆర్టీసీ అద్దె బస్సుల దూకుడు
ఈనెల 18న కడప కోటిరెడ్డి కూడలి వద్ద ఆర్టీసీ అద్దెబస్సులో ఓ మహిళా ఉపాధ్యాయురాలు ఎక్కారు. కొద్ది దూరం రాగానే డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో ఆమె బస్సులో నుంచి కింద పడి తలకు తీవ్రమైన గాయాలు కావడంతో మృతి చెందింది.
20 రోజుల్లో ఏడు ప్రమాదాలు
రాయచోటి వద్ద ప్రమాదానికి గురైన ఆర్టీసీ అద్దె బస్సు (దాచిన చిత్రం)
న్యూస్టుడే, చిన్నచౌకు(కడప)* ఈనెల 18న కడప కోటిరెడ్డి కూడలి వద్ద ఆర్టీసీ అద్దెబస్సులో ఓ మహిళా ఉపాధ్యాయురాలు ఎక్కారు. కొద్ది దూరం రాగానే డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో ఆమె బస్సులో నుంచి కింద పడి తలకు తీవ్రమైన గాయాలు కావడంతో మృతి చెందింది.
* ఈ నెల 22న రాయచోటి నుంచి చక్రాయపేటకు వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు లక్ష్మీపురం వద్ద లారీని ఢీకొంది. ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఏడుగురికి స్వల్పగాయాలయ్యాయి. ఆ సమయానికి బస్సులో 50 మంది ప్రయాణికులున్నారు.
* జనవరి 14న ప్రొద్దుటూరు సమీపంలోని నాగులపల్లె వద్ద ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొనడంతో ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. ఇలా తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
జిల్లా వ్యాప్తంగా ఎనిమిది డిపోల పరిధిలో 250 ఆర్టీసీ అద్దె బస్సులున్నాయి. ఈ బస్సుల చోదకులు తరచూ రోడ్డు ప్రమాదాలు చేస్తుండడంతో ఆర్టీసీకి చెడ్డపేరు వస్తోంది. ఈ నెలలో 20 రోజుల్లో ఏడు ప్రమాదాలు చేయగా అందులో ఇద్దరు మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. అద్దె బస్సు డ్రైవర్లు నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నట్లు ఆర్టీసీ డ్రైవర్లంటున్నారు. గతంలో ఏకదాటిగా ఒకే డ్రైవరు బస్సు నడిపేవాడు. దీంతో ప్రమాదాలు చేస్తున్నారనే ఉద్దేశంతో ఆర్టీసీ యాజమాన్యం మూడు రోజుల ఒకరు, మరో మూడు రోజులు ఒకరు చొప్పున బస్సు నడపాలని సూచించారు. ఆ నిబంధన సక్రమంగా అమలు కావడం లేదు. హెవీ డ్రైవింగ్ లైసెన్సు తీసుకుని ఒకటిన్నర సంవత్సరం అనుభవం కలిగి ఉన్న వారినే చోదకులుగా తీసుకోవాలి. చాలా మంది చోదకులకు అనుభవం లేదు. అద్దె బస్సు చోదకులకు తొలుత వారం రోజులు సంస్థ నిపుణులు శిక్షణ ఇస్తారు. ప్రయాణికులతో ఎలా ఉండాలి, డ్రైవింగ్ ఎలా చేయాలి, ఆర్టీసీ నిబంధనల గురించి వివరిస్తారు. ఇప్పుడు శిక్షణ తరగతులు నిర్వహించడం లేదు. మద్యం మత్తులో, చరవాణి మాట్లాడుతూ బస్సులు నడుపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
జాగ్రత్తలు చెప్పి పంపిస్తున్నాం
ప్రమాదం ఎవరు చేసిన ఒక్కటే. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ప్రమాదాలు చేస్తే వెంటనే వారిని తొలగించి వారి స్థానంలో అనుభవం ఉన్న వారిని నియమిస్తున్నాం. సంస్థ నిర్వహించే వైద్యపరీక్షల్లో ఉత్తీర్ణులైన వారినే చోదకులుగా నియమిస్తున్నాం. ప్రతి రోజు జాగ్రత్తలు చెప్పి పంపిస్తున్నాం. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. - భాస్కర్, ఆర్టీసీ అద్దె బస్సుల సంఘం అధ్యక్షుడు, కడప
వారిని పక్కన పెడుతున్నాం
ఆర్టీసీ అద్దె బస్సుల ప్రమాదాలు ఇటీవల పెరిగినది వాస్తవం. ప్రమాదాలపై దృష్టి పెట్టాం. ఎక్కువగా ప్రమాదాలు చేసే వారిని, చరవాణి మాట్లాడుతూ బస్సు నడిపే చోదకులను పక్కన పెడుతున్నాం. ప్రమాదాలు నివారణకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. - భాస్కర్, ఆర్టీసీ డిప్యూటీ సీఎంఈ, కడప
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
[ 28-03-2024]
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
[ 28-03-2024]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
కరవు సీమగా మార్చేసిన పాపం జగన్దే
[ 28-03-2024]
‘నేను రాయలసీమ వాసిని. చిత్తూరు జిల్లాలో పుట్టాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమను రత్నాలసీమగా మారిస్తే, నేడు సాగు, తాగునీరు లేక కరవు సీమగా మార్చేసిన పాపం సీఎం జగన్దే’ అని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. -
సీఎం ఇలాకా.... కుర్చీలు ఖాళీగా!
[ 28-03-2024]
సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సుయాత్ర... అందులోనూ ప్రారంభం అదిరేపోయేలా ఉండాలనుకున్న వైకాపా నేతలు... సీఎం ఇలాకాలోని ఐదు నియోజకవర్గాల మీదుగా సాగే యాత్రలో ప్రత్యేకించి ప్రొద్దుటూరులో కడప పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల నుంచి జనసమీకరణ... -
వైకాపా సేవకు బస్సులు... ప్రయాణికులకు ఇక్కట్లు
[ 28-03-2024]
సీఎం జగన్ బహిరంగ సభలకు జిల్లా నుంచి నాలుగు రోజులపాటు 6 డిపోల నుంచి 90 ఆర్టీసీ బస్సులను తరలించడంతో గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
ముడిపట్టు రాయితీకి మంగళం!
[ 28-03-2024]
వేలాది చేనేత కుటుంబాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. బడుగు జీవుల వెతలు, కన్నీటి ఘోషను పాలకులు ఆలకించడం లేదు. -
భాజపా జమ్మలమడుగు అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి
[ 28-03-2024]
భాజపా జమ్మలమడుగు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, బద్వేలు నియోజకవర్గ అభ్యర్థిగా బొజ్జా రోషన్నకు టిక్కెట్లు లభించాయి. -
సీ విజిల్ ఫిర్యాదులకు సత్వర పరిష్కారం : కలెక్టర్
[ 28-03-2024]
రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి జిల్లాలో సీ విజిల్, ఎన్ కోర్, ఈ ఎస్ఎంఎస్ల ద్వారా అందిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరిస్తున్నామని ఎన్నికల అధికారి, కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. -
అనుమతులతో పనేంటి... తవ్వేద్దాం
[ 28-03-2024]
ఒంటిమిట్ట చెరువులో గత మూడు రోజులుగా అడ్డగోలుగా మట్టి తవ్వేస్తున్నారు. -
ఇళ్లు ధ్వంసం చేయడం సిగ్గుచేటు
[ 28-03-2024]
బద్వేలు పట్టణంలో ఇళ్లు లేని నిరుపేదలైన దివ్యాంగులు దరఖాస్తులు చేసుకుని విసిగి వేసారిపోయారని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మండిపడ్డారు. -
‘రాయలసీమను ఎడారిగా మార్చిన ప్రభుత్వాలు’
[ 28-03-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోగా, అటు 400 స్థానాలు వస్తాయని, ఇటు 175 స్థానాలు వస్తాయని చెబుతూ మభ్యపెడుతున్నారని రాకపా రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్రెడ్డి ఆరోపించారు. -
అనర్హులకు మూల్యంకన విధులపై విచారణ
[ 28-03-2024]
‘సస్పెండైనవారు... పది జవాబుపత్రాలు దిద్దుతారంట’ శీర్షికన బుధవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై పదోతరగతి పరీక్షల జిల్లా పరిశీలకులు వెంకటకృష్ణారెడ్డి స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య