logo

చిన్న జిల్లాలతో మెరుగైన పరిపాలన

చిన్న జిల్లాల ఏర్పాటుతో పరిపాలన మరింత మెరుగవుతుందని జడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక జడ్పీ ఆవరణలో బుధవారం ఆయన ఏవో రంగాచార్యులతో

Published : 27 Jan 2022 01:45 IST

జడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి

కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే : చిన్న జిల్లాల ఏర్పాటుతో పరిపాలన మరింత మెరుగవుతుందని జడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక జడ్పీ ఆవరణలో బుధవారం ఆయన ఏవో రంగాచార్యులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల స్థానంలో కొత్తగా మరో 13 జిల్లాలు రానుండడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ మినిస్ట్రిరియల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు మల్లేశ్వరరెడ్డి, జడ్పీ యూనిట్‌ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని