ఎస్సీ రుణ బకాయిలపై ప్రత్యేక దృష్టి
రుణ బకాయిల వసూలుపై ఎస్సీ కార్పొరేషన్ దృష్టిసారించింది. రుణ వసూళ్లకు జిల్లా అధికారులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. స్వయం ఉపాధికి రుణాలు పొంది తిరిగి చెల్లించని జాబితాను సిద్ధం చేశారు.
వసూలుకు ప్రత్యేక బృందాల నియామకం
జిల్లా సచివాలయం, న్యూస్టుడే : రుణ బకాయిల వసూలుపై ఎస్సీ కార్పొరేషన్ దృష్టిసారించింది. రుణ వసూళ్లకు జిల్లా అధికారులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. స్వయం ఉపాధికి రుణాలు పొంది తిరిగి చెల్లించని జాబితాను సిద్ధం చేశారు. షెడ్యూల్డు కులాల సహకార సంఘం పరిధిలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో పలు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జాతీయ ఎస్సీల ఆర్థిక అభివృద్ధి సంస్థ (ఎన్ఎస్ఎఫ్డీసీ), 2015-16 నుంచి జాతీయ సఫాయి కర్మచారీల ఆర్థిక అభివృద్ధి సంస్థ (ఎన్ఎస్కేఎఫ్డీసీ) పథకాన్ని 2016-17 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పట్లో రవాణా, రవాణేతర విభాగాల్లో స్వయం ఉపాధికి రుణాలు పొంది తిరిగి చెల్లించని వారి జాబితాను సిద్ధం చేశారు. వీరికి హామీనిస్తూ ష్యూరిటీ సంతకాలు చేసిన వారికి తాఖీదులు పంపిస్తున్నారు. రవాణా విభాగంలో కార్లు, ట్రాక్టర్లతో పాటు రవాణేతర విభాగంలో కిరాణా దుకాణాల ఏర్పాటుకు స్వయంఉపాధి యూనిట్లు మంజూరు చేశారు. సుమారు రూ.10 లక్షల వరకు రుణం మంజూరు చేశారు. ఇందులో రెండు శాతం లబ్ధిదారుడి వాటా కాగా, మిగిలిన మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించేలా రుణాలు మంజూరు చేశారు. అయిదేళ్లలోపు రుణాలను చెల్లించాలనే నిబంధనలను లబ్ధిదారులు ఉల్లంఘించారంటూ తాజాగా లబ్ధిదారులకు తాఖీదులు పంపించారు. జిల్లాలో రూ.10.48 కోట్లు వసూలు లక్ష్యంగా అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు రూ.3.54 కోట్లు మాత్రమే వసూలు కాగా, మిగిలిన రుణాల వసూలుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 447 మంది లబ్ధిదారులకుగాను 250 మందికి తాఖీదులు పంపారు. ఈ విషయమై ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డాక్టర్ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ రుణాల వసూలుకు చర్యలు చేపట్టింది వాస్తవమేనన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదేశాలకు పాతర.. ఇసుకాసురుల జాతర!
[ 29-03-2024]
పర్యావరణ అనుమతుల్లేకుండా ఇసుక తవ్వకాలు జరపొద్దని హైకోర్టు స్పష్టం చేసినా అధికార పార్టీ నేతలు ఖాతరు చేయడం లేదు. నిబంధనలను అతిక్రమిస్తే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తీర్పు వెల్లడించినా పోలీసు అధికారులు సైతం వాటిని పట్టించుకోకుండా వైకాపా నేతలకు వత్తాసు పలుకుతున్నారు. -
కీలక నేతలతో చంద్రబాబు భేటీ!
[ 29-03-2024]
మదనపల్లెలో బుధవారం రాత్రి, గురువారం ఉదయం తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ కీలక నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు -
రాయచోటిపై తెదేపా ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
రాయచోటి నియోజకవర్గంపై తెదేపా ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలను పిలిపించుకుని గెలుపు వ్యూహాలపై చర్చించారు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథరెడ్డితో చంద్రబాబు పలుమార్లు మాట్లాడారు -
రెండో రోజూ ప్రయాణికులకు తిప్పలే
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభలకు జిల్లా నుంచి బస్సులు కేటాయించడంతో వరుసగా రెండోరోజూ గురువారం ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. -
ఒంటిమిట్టలో ఆదర్శ పోలింగ్ కేంద్రం
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒంటిమిట్ట ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఆదర్శ పోలింగ్ (పీఎస్-47) కేంద్రం ఏర్పాటు చేశారు. ఉద్యోగుల విధుల నిర్వహణ, ఓటర్లతో మాట్లాడాల్సిన తీరు, ఈవీఎంల పనితీరుపై వీఆర్వోలు, వీఆర్ఏలు, బీఎల్వోలు, సిబ్బందికి అవగాహన కల్పించారు -
దాహమో.... రఘురామ!
[ 29-03-2024]
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది సీఎం జగన్ సొంత ఇలాకాలోని మైదుకూరు పురపాలక సంఘం ప్రజల పరిస్థితి -
మైనార్టీ విద్యకు గ్రహణం!
[ 29-03-2024]
కేంద్ర ప్రాయోజిత నిధులతో నిర్మించతలపెట్టిన ముస్లిం, దూదేకులు, దళిత క్రిస్టియన్ల పిల్లలకు 6 నుంచి 10వ తరగతి వరకు గురుకుల పాఠశాలలు, వసతిగృహ సముదాయాలు ప్రతిపాదనలకే పరిమిత మయ్యాయి -
‘దోషులను వెంట పెట్టుకుంది జగనే’
[ 29-03-2024]
శామాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిని వెంటపెట్టుని తిరుగుతున్నది సీఎం జగనే అని మాజీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు సనసభ తెదేపా అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి ఆరోపించారు -
వివేకా హత్య కేసులో నిందితుడు అవినాష్ ఎంపీ టికెట్టా?
[ 29-03-2024]
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడు వై.ఎస్.అవినాష్రెడ్డిని పక్కన పెట్టుకుని, తన చిన్నాన్నను ఎవరో చంపేశారని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని భాజపా జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్రెడ్డి అన్నారు. -
తాగునీటి గండం..విద్యార్థులకు శాపం
[ 29-03-2024]
దేశ సరిహద్దులో భద్రత ఏర్పాట్లు చూసే సైనికులు... పశువైద్య విజ్ఞానాన్ని అవపోశన పడుతున్న విద్యార్థులను తాగునీటి సమస్య విపరీతంగా వేధిస్తోంది.