logo

అన్ని రంగాల అభివృద్ధే ధ్యేయం : ఎంపీ అవినాష్‌రెడ్డి

అన్ని రంగాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. పులివెందులలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రజాదర్బార్‌ నిర్వహించారు. జిల్లా నమూలల నుంచి ప్రజలు, అధికారులు, వైకాపా నాయకులు కలిశారు.

Published : 27 Jan 2022 01:45 IST


స్థానికుల సమస్యలు వింటున్న ఎంపీ అవినాష్‌రెడ్డి

పులివెందుల, న్యూస్‌టుడే: అన్ని రంగాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. పులివెందులలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రజాదర్బార్‌ నిర్వహించారు. జిల్లా నమూలల నుంచి ప్రజలు, అధికారులు, వైకాపా నాయకులు కలిశారు. పురపాలక ఛైర్మన్‌ వరప్రసాద్, మార్కెట్ యార్డు ఛైర్మన్‌ చిన్నప్ప, కాలుష్య నియంత్రణ మండలి బోర్డు డైరెక్టర్‌ మరకా శివకృష్ణారెడ్డి, వైకాపా తొండూరు మండలం బాధ్యుడు వైఎస్‌ మధనమోహన్‌రెడ్డిలు ఎంపీని కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలు విన్నవించిన కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు