జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి
జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నట్లు కలెక్టరు విజయరామరాజు పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కడప పోలీసు మైదానంలో బుధవారం ఆయన జాతీయ పతాకం ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
కలెక్టరు విజయరామరాజు
ఘనంగా గణతంత్ర దినోత్సవం
మాట్లాడుతున్న కలెక్టర్ విజయరామరాజు
ఈనాడు డిజిటల్, కడప, న్యూస్టుడే, సచివాలయం, చిన్నచౌకు (కడప) జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నట్లు కలెక్టరు విజయరామరాజు పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కడప పోలీసు మైదానంలో బుధవారం ఆయన జాతీయ పతాకం ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ‘దేశంలోనే ఆదర్శవంతంగా అన్ని వర్గాల ప్రజలకు సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తీసుకెళుతున్నాం. ఆర్థిక రంగాన్ని కుదేలు చేసిన కొవిడ్ విపత్తును ప్రభుత్వం పటిష్టంగా అమలు చేసిన నియంత్రణ చర్యలతో సమర్థంగా ఎదుర్కొనగలిగాం. జిల్లాలో సాధారణ వర్షపాతం 647 మి.మీ కాగా.. అత్యధికంగా 1,008 మి.మీ నమోదుతో జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 64 శాతం అధికంగా నమోదైంది’ అని వివరించారు.
కడప పోలీసు పరేడ్ మైదానంలో కవాతు చేస్తున్న పోలీసు సిబ్బంది
* ‘జిల్లాలోని జలాశయాల్లో జలకళ సంతరించుకుంది. కరవు నివారణకు 12 నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి ఫలితంగా గండికోట జలాశయంలో పూర్తి సామర్థ్యంలో 26.85 టీఎంసీల నీటిని నిల్వ చేసుకున్నాం. గండికోట జలాశయానికి కృష్ణా జలాలను తరలించడానికి రూ.604 కోట్లకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో కూడా తొలిసారిగా పూర్తి సామర్థ్యం మేరకు 10.29 టీఎంసీల నీటిని నిల్వ చేసుకున్నాం’ అని తెలిపారు.
* ‘ఉపాధిహామీ పథకం అనుసంధానంతో రూ.250 కోట్ల అంచనాతో 631 గ్రామ సచివాలయ భవనాలు, రూ.135 కోట్లతో 621 రైతు భరోసా కేంద్రాలు, రూ.88 కోట్లతో 500 వైఎస్ఆర్ గ్రామ ఆరోగ్య కేంద్రాలు, రూ.91.44 కోట్లతో 581 పాలసేకరణ భవనాలు, రూ.50.40 కోట్లతో 365 డిజిటల్ లైబ్రరీ కేంద్రాల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి’ అని కలెక్టర్ పేర్కొన్నారు.
*‘నాడు- నేడు పనుల కింద తొలి విడతలో 1,040 పాఠశాలల్లో 6,591 పనులు చేపట్టి రూ.275 కోట్లతో 6,584 పనులు పూర్తిచేశాం. రెండో విడతలో 789 పాఠశాలలు గుర్తించాం. అన్ని నియోజకవర్గాల్లో 32 ఆదర్శ పాఠశాలలను సిద్ధం చేశాం. రూ.125 కోట్లతో 1,040 అదనపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. నవరత్నాలు కింద పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మాణాలు చేపట్టాం. జల సంరక్షణ చర్యల్లో భాగంగా జాతీయ స్థాయిలో మూడోసారి జాతీయ పురస్కారం అందుకున్నాం. జిల్లాలో రూ.603 కోట్ల పెట్టుబడితో వివిధ రకాలైన 7 ఎలక్ట్రానిక్ పరిశ్రమలు స్థాపించి 7,491 మందికి ఉపాధి కల్పించనున్నాం. వివిధ పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నాం.’ అని వివరించారు.
క్రీడాపాఠశాల విద్యార్థిని విన్యాసం
* ‘రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున అయిదేళ్లకు రూ.67,500 పెట్టుబడి సాయం అందజేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2,89,834 మంది రైతులకు 3 విడతలుగా రూ.394 కోట్ల సాయం అందించాం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద గతేడాది ఖరీఫ్లో 27,791 మంది రైతులకు రూ.5.74 కోట్లు, పంట రుణాలు రూ.4,733 కోట్లు అందించాం. దీంతో పాటు ప్రకృతి వ్యవసాయం చేపట్టేవిధంగా రైతులను ప్రోత్సహిస్తున్నాం. ఉద్యాన రైతులను అన్ని రకాలుగా ఆదుకోవడంతోపాటు ఈ ఏడాది రూ.25 కోట్లతో వివిధ పథకాలను అమలుచేస్తున్నాం. పార్లమెంటు నియోజకవర్గానికొక ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను నెలకొల్పనున్నాం. పులివెందులలో రూ.100 కోట్లతో అరటి ఉత్పత్తి ఆహార శుద్ధి పరిశ్రమ, రాయచోటిలో రూ.8.60 కోట్లతో టమోటా, చిరు ధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాం’ అని వెల్లడించారు.
* ‘పాడాను రూ.100 కోట్లతో పునరుద్ధరించడంతో పాటు రూ.500 కోట్లతో పులివెందులలో వైద్య కళాశాల నిర్మిస్తాం. పలు సాగునీటి ప్రాజెక్టులను చేపట్టడానికి ప్రతిపాదనలు తయారు చేశాం. కరోనా మహమ్మారి కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. కొవిడ్తో మృతిచెందినవారి కుటుంబాలను ఆదుకోవడంతో పాటు అనాథ పిల్లలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేశాం. టీకా కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం.’ అని వివరించారు. వేడుకల్లో ఎస్పీ అన్బురాజన్, సంయుక్త కలెక్టర్లు గౌతమి, సాయికాంత్వర్మ, ధ్యానచంద్ర, రాజంపేట సబ్కలెక్టర్ కేతన్గార్గ్, తదితరులు పాల్గొన్నారు.
బాలికల సంప్రదాయ నృత్యం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాయంచపై రాములోరి రాజసం
[ 19-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు గురువారం రాత్రి రాయంచపై రాములోరి విహారం కనులపండువగా సాగింది. -
మొదలైన నామినేషన్ల సందడి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ గురువారం మొదలైంది. కలెక్టర్ విజయ రామరాజు ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం కలెక్టరేట్లోని తన ఛాంబరులో నామపత్రాల స్వీకరణను ఆయన ప్రారంభించారు. -
జగన్ను నమ్మాం... నిండా మునిగాం!
[ 19-04-2024]
‘నేను ఉన్నానన్నావ్... నేను విన్నానన్నావ్... నిజమే అనుకున్నాం... నీ మాటలు విని మా బాధలు తెలుసుకుంటావని, పరిష్కారం చూపుతావని ఎంతో ఆశతో నిన్ను గెలిపించాం... తీరా చూస్తే నువ్వు ఉన్నావు... కానీ వినే ఓపికే లేకుండా పోయింది. -
షర్మిలకు మద్దతుగా పులివెందులలో సునీత ప్రచారం
[ 19-04-2024]
కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల తరఫున మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత దంపతులు గురువారం నుంచి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. -
బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మరథం
[ 19-04-2024]
బ్రహ్మాండ నాయకుడైన శ్రీరాముడి రథోత్సవం గురువారం వాల్మీకి క్షేత్రంలో వైభవంగా జరిగింది. ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
మరో వైకాపా ఫ్యానుపై వేటు
[ 19-04-2024]
వృత్తి ఉద్యోగమైనా... నిబంధనలు ఉల్లంఘించి అత్యుత్సాహంతో ముఖ్యమంత్రి జగన్కు ఊడిగం చేసే వారికి తగిన శాస్తి జరుగుతుందనడానికి నిదర్శనమే... ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై వేటు. -
పెద్దిరెడ్డి కుటుంబ దోపిడీని ఓటుతో అడ్డుకోండి
[ 19-04-2024]
రాజంపేట పార్లమెంట్ పరిధిలో పెద్దిరెడ్డి దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ముఖ్యమంత్రి, భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. -
జగన్ బాటలో బస్సులు.. జనానికి ‘ముప్పు’తిప్పలు!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో పల్లెలకు బస్సులు దూరమయ్యాయి... కొత్త బస్సులు రాకపోగా, ఉన్న బస్సులు మరమ్మతులకు గురయ్యాయి... పల్లె బస్సులు రద్దయ్యాయి. అవీ ఎప్పుడొస్తాయో తెలియదు. -
బ్రహ్మోత్సవ శోభ... ఆధ్యాత్మిక ప్రభ
[ 19-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రామయ్య క్షేత్రంలో రెండో రోజు గురువారం ఉదయం యాగశాలలో తితిదే ఆగమ సలహాదారు కల్యాణపురం రాజేష్ భట్టార్ ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు. -
జగనన్న చెప్పాడంటే చెయ్యడంతే
[ 19-04-2024]
మైకు పట్టుకుని రాజకీయ నాయకులేం చెబుతారో ఎన్నికల తర్వాత ఆ పని చేయకపోతే రాజీనామా చేసిపోయే పరిస్థితి రావాలన్నావు. నీ మాటలు నమ్మి ప్రశ్నిస్తే.. కేసులు పెట్టిస్తున్నావ్.. నీ అనునాయులతో ఉరికించి ఉరికించి కొట్టిస్తున్నావ్.. చెప్పిన మాటకు కట్టుబడక పోతే ఎలాగన్నా. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి
[ 19-04-2024]
కేంద్రం, రాష్ట్రంలో తమ ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే చేనేత కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తామని కడప ఎంపీ తెదేపా అభ్యర్థి భూపేష్రెడ్డి, జమ్మలమడుగు అసెంబ్లీ భాజపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డి హామీ ఇచ్చారు. -
జిల్లాకు చేరుకున్న కేంద్ర ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై పర్యవేక్షణకు కేంద్ర ఎన్నికల పరిశీలకులు గురువారం జిల్లాకు చేరుకున్నారు. తొలుత కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, ఎస్పీ కృష్ణారావు, ఇతర జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. -
రాజంపేట వైకాపాలో ముసలం
[ 19-04-2024]
రాజంపేట వైకాపాలో ముసలం పుట్టింది. నియోజకవర్గానికి చెందిన వైకాపా నాయకులు, కార్యకర్తలు ఇటీవల తెదేపాలో చేరారు. ఈ క్రమంలో హైదరాబాద్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో బుధవారం జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు, తెదేపా నాయకుడు పోలి సుబ్బారెడ్డి, సుగవాసి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో నందలూరు, రాజంపేట మండలాలకు చెందిన వైకాపా నేతలు పార్టీలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM