logo

పథకాలపై ప్రజల సంతృప్తి స్థాయి పెరగాలి : కలెక్టర్‌

ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల్లో సంతృప్తిస్థాయి పెరిగేలా చూడాలని కలెక్టర్‌ విజయరామరాజు పేర్కొన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలోని సభాభవనంలో బుధవారం కడప రెవెన్యూ డివిజన్‌ స్థాయి సమీక్ష సమావేశం జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ,

Published : 19 May 2022 03:54 IST


సమీక్షిస్తున్న కలెక్టర్‌ విజయరామరాజు, చిత్రంలో సంయుక్త కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ, ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల్లో సంతృప్తిస్థాయి పెరిగేలా చూడాలని కలెక్టర్‌ విజయరామరాజు పేర్కొన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలోని సభాభవనంలో బుధవారం కడప రెవెన్యూ డివిజన్‌ స్థాయి సమీక్ష సమావేశం జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ, ఆర్డీవో ధర్మచంద్రారెడ్డితో కలిసి నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ... స్పందన పోర్టల్‌, మీసేవా, ఏపీ సేవ పోర్టల్‌లో రోజూ వచ్చే సర్వీసు రిక్వెస్టులను పరిశీలించి పరిష్కారానికి వేదికలను నమోదు చేయాలన్నారు. జేసీ సాయికాంత్‌వర్మ మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు క్రమం తప్పకుండా బయోమెట్రిక్‌ హాజరు వేసేలా చూడాలన్నారు. హౌసింగ్‌ పీడీ కృష్ణయ్య, డ్వామా పీడీ యదుభూషణ్‌రెడ్డి, పీవో ప్రభాకర్‌రెడ్డి, జేడీఏ నాగేశ్వరరావు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని