ఖరీఫ్ ఆయకట్టుపై కసరత్తు
ఖరీఫ్లో మధ్యతరహా, పెద్ద జలాశయాల పరిధిలోని కాలువల ద్వారా ఆయకట్టు భూములకు సాగునీరివ్వాలని జలవనరుల శాఖ సాంకేతిక నిపుణులు కసరత్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో జల ప్రవాహానికి ఉన్న అడ్డంకులు గుర్తించి తొలగించాలని నిర్ణయించారు.
ప్రణాళిక రూపొందించిన జిల్లా ఉన్నతాధికారులు
బ్రహ్మంసాగర్ జలాశయం
న్యూస్టుడే, కడప ఖరీఫ్లో మధ్యతరహా, పెద్ద జలాశయాల పరిధిలోని కాలువల ద్వారా ఆయకట్టు భూములకు సాగునీరివ్వాలని జలవనరుల శాఖ సాంకేతిక నిపుణులు కసరత్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో జల ప్రవాహానికి ఉన్న అడ్డంకులు గుర్తించి తొలగించాలని నిర్ణయించారు. గాలేరు-నగరి సుజల స్రవంతి పథకం, తెలుగు గంగ, అనుబంధ జలవనరుల ప్రాంతాల్లోని బీడువారిన నేలకు సేద్యపు జలాలు తరలించాలని పక్కా ప్రణాళికను రూపొందించారు.
* జిల్లాలో 2022 ఖరీఫ్లో జీఎన్ఎస్ఎస్, తెలుగుగంగ అనుబంధ పథకాల పరిధిలో భూములకు సాగునీరు ఇవ్వాలని ప్రతిపాదించారు. మైలవరం, పైడిపాళెం, పీబీఆర్, లింగాల కుడి కాలువ, వామికొండ, సర్వ రాయసాగర్, బ్రహ్మంసాగర్, ఎస్ఆర్-1, ఎస్ఆర్-2 పరిధిలో 2,91,201 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం జిల్లాలో 54.975 టీఎంసీల నీరుంది. ఇప్పటికే 2.15 లక్షలకు సేద్యపు జలాలు ఇచ్చేలా ఏర్పాట్లు సిద్ధం చేశారు. పంటల సాగు కోసం 21.50 టీంఎసీలు, తాగునీటి అవసరాలకు 7.585 టీఎంసీలు అవసరం ఉంటుందని అంచనా. మరో 25.89 టీఎంసీల జలాలు మిగులు ఉంటుంది. వర్షాలు కురిస్తే నీరు చేర నుంది. ఈ నీటిని ఏం చేయాలి, అదనపు ఆయకట్టుకు ఇవ్వాలంటే క్షేత్రస్థాయిలో ప్రధాన, ఉప, పంట కాలువలను సిద్ధం చేయాల్సి ఉంటుందని గుర్తించారు. ఇందుకు నిధులివ్వాలని ఉన్నతస్థాయికి నివేదిక పంపినట్లు సీనియర్ అధికారి తెలిపారు. వరి పంట సాగును ప్రోత్సహించాలనా, ఆరుతడి పైర్లు వేసుకోవాలని ప్రకటన చేయాలనా అనే అంశంపై ఉన్నత స్థాయిలో చర్చిస్తున్నారు.
* వ్యవసాయ, ఉద్యాన పంటలకు, నేరుగా, బిందు, తుంపర పరికరాల ఎలా ఇవ్వాలని కసరత్తు చేస్తున్నారు. కడపలో బుధవారం జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలోనూ ఇదే సమస్యపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. మైలవరం జలాశయం నిల్వ సామర్థ్యం 6.50 టీఎంసీలు. ప్రస్తుతం 0.678 టీఎంసీల నీరుంది. ఉత్తర, దక్షిణ కాలువల కింద 70,587 ఎకరాలు ఉండగా ఈసారి 50 వేల ఎకరాలకు నీరిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయకట్టుకు అయిదు టీఎంసీలు, తాగునీటికి 1.892 టీఎంసీలు అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నీటి కంటే మరో ఆరు టీఎంసీలకు పైగా నీరు తెప్పించాల్సి ఉంటుంది. తెలుగుగంగ ఉప జలాశయం-1 నిల్వ సామర్థ్యం 2.134 టీఎంసీలు. ప్రస్తుతం 0.55 టీఎంసీల నీరుంది. ఈదఫా 10 వేల ఎకరాలకు గంగ తీసుకెళ్లాంటే ఒక టీఎంసీ కావాలి. మరో 0.450 టీఎంసీలను తీసుకురావాల్సి ఉంటుంది. ఎస్ఆర్-2లో నీటి కొరత ఉంది. మిగతా పంట కాలువలను పూర్తి చేయాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చూసిన కనులదే భాగ్యం!
[ 23-04-2024]
జగదభిరాముడి కల్యాణానికి జగమే ఊయలూగింది. సర్వమంగళ స్వరూపుడు శ్రీరాముడు, సకల జన శుభధాత్రి సీతాదేవి మూడు ముళ్లబంధంతో ఒక్కటైన వేళ భక్తజనం ఆనందంతో పులకించిపోయారు. -
జగన్ను నమ్మినందుకు నట్టేట ముంచారు!
[ 23-04-2024]
సీఎం జగన్ సొంత జిల్లాలో వైకాపా నుంచి పలువురు కీలక నేతలు వరుసగా జారుకుంటున్నారు. ఏళ్ల తరబడి పార్టీలో సేవలందించి.. సొంత ఆస్తుల్ని అమ్ముకున్న వారు... ఇప్పుడు ఆ పార్టీపై, అగ్రనేతలపై విశ్వాసం కోల్పోయి బయటకొచ్చేస్తున్నారు. -
జగన్ పాలన ఫలితమిది!
[ 23-04-2024]
పదోతరగతి ఫలితాల్లో 86.67 ఉత్తీర్ణత శాతంతో జిల్లా రాష్ట్రంలో 17వ స్థానంలో నిలిచింది. బాలురు 83.65, బాలికలు 89.71 ఉత్తీర్ణత శాతం నమోదుతో బాలికలు పైచేయి సాధించారు. -
బద్వేలులో వైకాపాకు భంగపాటు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల తరుణంలో బద్వేలు నియోజకవర్గ వైకాపాలో విభేదాలు రోడ్డెక్కాయి. -
వాలంటీర్ల కోసం వెతుకులాట!
[ 23-04-2024]
తాము రాజీనామా చేసేందుకు ససేమిరా అంటూ గ్రామ/ వార్డు వాలంటీర్లు వైకాపా నేతలకు కంట కనిపించకుండా తిరుగుతున్నారు. -
బాలికలదే పైచేయి!
[ 23-04-2024]
పదోతరగతి ఫలితాల్లో 92.10 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో జిల్లా మూడో స్థానంలో నిలిచింది. -
స్వామిభక్తిని చాటుకున్న పోలీసులు
[ 23-04-2024]
పోలీసులు పక్షపాత ధోరణిని వీడడంలేదు. వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్ల సందర్భంగా వివక్ష చూపిస్తున్నారు. -
కడపలో ఏకమవుతున్న తెదేపా నేతలు
[ 23-04-2024]
కడపలో తెదేపా నేతలందరూ ఏకతాటిపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
అయిదేళ్ల వైకాపా పాలనలో... సాగునీటి ప్రాజెక్టులకు ఒక్క పైసా విదల్చలేదు
[ 23-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు ఒక్క పైసా విదల్చలేదని భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి విమర్శించారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం... నిధులు నిరుపయోగం
[ 23-04-2024]
జిల్లాలో తొలి చెత్త సంపద మండల కేంద్రం రాజుపాళెంలో నిర్మించి గత ప్రభుత్వంలో జిల్లాకు ఆదర్శంగా ఇక్కడ కంపోస్టు ఎరువులు చేసిన ఘణత ఉంది. -
కూటమి అభ్యర్థుల గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి
[ 23-04-2024]
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉమ్మడి పార్టీల అభ్యర్థులను గెలిపించాలని ఎన్డీఏ అభ్యర్థులు, పార్టీల నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. -
‘పది’లో విద్యార్థుల ప్రతిభ
[ 23-04-2024]
జిల్లాలో సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. -
శాసనసభ స్థానాలకు నామపత్రాల దాఖలు
[ 23-04-2024]
ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఆయా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ నామపత్రాలను సమర్పించారు. -
జగన్ పాలన... అభివృద్ధికి ఆమడ దూరాన
[ 23-04-2024]
బద్వేలు పురపాలకలోని శివారు వార్డులు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. -
ఆర్టీపీపీలో ఉద్యోగోన్నతికి అడ్డదారులు
[ 23-04-2024]
డాక్టర్ ఎంవీఆర్ తాప విద్యుదుత్పత్తి కేంద్రం (ఆర్టీపీపీ)లో కొందరు ఉద్యోగులు ఉద్యోగోన్నతికి అడ్డదారులు తొక్కుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు