logo

ప్రొద్దుటూరులో దారిదోపిడీ ముఠా బీభత్సం

వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులో దారి దోపిడీ ముఠా బీభత్సం సృష్టించింది. ప్రొద్దుటూరు నుంచి అనంతపురంకు కారులో వెళ్తు్న్న ఇద్దరు వ్యక్తులపై మొదట రాళ్లదాడి చేసిన దొంగల ముఠా..

Updated : 20 May 2022 13:07 IST

ప్రొద్దుటూరు నేరవార్తలు: వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులో దారి దోపిడీ ముఠా బీభత్సం సృష్టించింది. ప్రొద్దుటూరు నుంచి అనంతపురంకు కారులో వెళ్తు్న్న ఇద్దరు వ్యక్తులపై మొదట రాళ్లదాడి చేసిన దొంగల ముఠా.. తర్వాత వారిద్దరినీ చితకబాదారు. ఒంటిపై ఉన్న బంగారం, రూ.20వేల నగదుతోపాటు మూడు చరవాణులను దోచుకెళ్లారు. దుండగుల దాడిలో అనంతపురం పట్టణానికి చెందిన తుకారం, నాగేశ్వరరావులకు తీవ్ర గాయాలవ్వడంతో ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆయుర్వేద మందులు డెలివరీ చేసేందుకు ప్రొద్దుటూరు పెన్నానగర్‌కు వచ్చిన తుకారం, నాగేశ్వరరావులు తిరిగి కారులో స్వస్థలానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న గ్రామీణ పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు. ప్రొద్దుటూరులో వరుస ఘటనలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని