logo

రహదారి ప్రమాదంలో యువతి మృతి

మండల పరిధిలోని ఆజాద్‌నగర్‌ వద్ద స్కూటీలో వెళ్తుండగా అదుపు తప్పి కింద పడి సగిలి సునీత (22) అనే యువతి మృతి చెందారు. ఏఎస్సై నాగరాజు వివరాల ప్రకారం... మండలంలోని ఇందిరానగర్‌ చెర్లోపల్లెకు చెందిన సునీత ఎంబీఎ పూర్తి చేసి, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు.

Published : 22 May 2022 04:06 IST

చింతకొమ్మదిన్నె, యోవేవి, న్యూస్‌టుడే : మండల పరిధిలోని ఆజాద్‌నగర్‌ వద్ద స్కూటీలో వెళ్తుండగా అదుపు తప్పి కింద పడి సగిలి సునీత (22) అనే యువతి మృతి చెందారు. ఏఎస్సై నాగరాజు వివరాల ప్రకారం... మండలంలోని ఇందిరానగర్‌ చెర్లోపల్లెకు చెందిన సునీత ఎంబీఎ పూర్తి చేసి, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు. శుక్రవారం రాత్రి తన స్కూటీలో కడప నగరంలోని దుర్గమ్మ ఆలయానికి వెళ్లి తిరిగి ఇంటికి బయల్దేరారు. ఆజాద్‌నగర్‌ వద్దకు రాగానే రోడ్డుపై ఉన్న గుంతపై నుంచి తన స్కూటీ వెళ్లడంతో అదుపు తప్పి సునీత కింద పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆమెను రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.  విద్యార్థినిమృతికి యోవేవి ఉపకులపతి సూర్యకళావతి, కులసచివులు విజయరాఘవ ప్రసాద్, ప్రిన్సిపల్‌ కృష్ణారెడ్డి,  ఆలుమ్ని సంఘం ప్రతినిధులు సంతాపం ప్రకటించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని