పథకం అందక.. యంత్రం కదలక !
జిల్లావ్యాప్తంగా చాలామంది రైతులకు ‘వైయస్ఆర్ యంత్ర సేవ’ పథకం కింద ట్రాక్టర్లు అందలేదు. తొలుత మార్గదర్శకాల జారీలో జాప్యం జరగడంతో పథకం అమలుపై ప్రభావం చూపింది. నిర్దేశిత గడువు ముగిసినా లక్ష్యం చేరుకోలేదు. అన్నదాతల దరికి అద్దె యంత్ర పరికరాలు చేరడం లేదు.
రైతుల దరి చేరని వ్యవసాయ సాగు పరికరాలు
ట్రాక్టర్ల కోసం ముందుకొచ్చిన 257 సీహెచ్సీలు
జిల్లాలో ‘వైయస్ఆర్ యంత్ర సేవ’ పథకం తీరు
ట్రాక్టరుతో వ్యవసాయ పనులు
జిల్లావ్యాప్తంగా చాలామంది రైతులకు ‘వైయస్ఆర్ యంత్ర సేవ’ పథకం కింద ట్రాక్టర్లు అందలేదు. తొలుత మార్గదర్శకాల జారీలో జాప్యం జరగడంతో పథకం అమలుపై ప్రభావం చూపింది. నిర్దేశిత గడువు ముగిసినా లక్ష్యం చేరుకోలేదు. అన్నదాతల దరికి అద్దె యంత్ర పరికరాలు చేరడం లేదు. గ్రామీణ గడపలో వినియోగదారుల అద్దె కేంద్రాలు (కస్టమ్ హైరింగ్ సెంటర్లు) అందుబాటులో లేవు. చాలాచోట్ల నిర్వహణ కేంద్రాల జాడ లేకుండాపోయింది. పథకం కింద లబ్ధి పొందినవారు వారి కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితం ఉన్నవారికే యంత్రాలను పంపిస్తుండడం గమనార్హం.
న్యూస్టుడే, కడప జిల్లాలో గ్రామీణ గడపలో రైతు భరోసా కేంద్రాలు (వ్యవసాయ ఉత్పత్తి నిల్వ భవనాలు) 414, పట్టణాల్లో మరో 18 ఉన్నాయి. ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక వినియోగదారుల అద్దె కేంద్రం (కస్టమ్ హైరింగ్ సెంటర్) ఏర్పాటు చేయాలని గతేడాది ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు. ప్రతి ఆర్బీకేలో అయిదుగురు ఔత్సాహిక రైతులను ఎంపిక చేయాలని ఆదేశించారు. వీరిని ఒక బృందంగా బృందంగా ఏర్పాటు చేయించారు. జిల్లాలో 425 సీహెచ్సీలను అందుబాటులోకి తీసుకోవాలని నిర్ణయించారు. వినియోగదారుల అద్దె కేంద్రాల నిర్వహణలో భాగంగా ట్రాక్టర్ల పంపిణీ నిదానంగా సాగుతోంది. వచ్చే నెలలో నిర్వహించే మెగా మేళా రోజున తీసుకోవాలని 257 సీహెచ్సీల సభ్యులు ఇప్పటికే సుముఖత వ్యక్తం చేశారు. అందులో 200 బృందాల్లోని అన్నదాతలు 50 శాతం డబ్బులు చెల్లించారు. ఇతర యంత్ర, పరికరాలు కొనుగోలు చేసేందుకు మొత్తం 393 సీహెచ్సీల సభ్యులు సుముఖత చూపారు. ఇప్పటికే తీసుకున్న యంత్రాలకు ప్రభుత్వం నుంచి రాయితీ కింద రూ.1.60 కోట్లు లబ్ధిదారులుగా ఎంపికైన అన్నదాతల ఖాతాల్లో జమ చేశారు. ఒక యూనిట్ విలువ రూ.15 లక్షలు. ఇందులో ప్రభుత్వం ఇచ్చే రాయితీ 40 శాతం (రూ.6 లక్షలు), బ్యాంకు రుణం 50 శాతం (రూ.7.50 లక్షలు), లబ్ధి పొందే రైతుల వాటా 10 శాతం (రూ.1.50 లక్షలు). అందరికీ ఒకేసారి ఇవ్వడానికి ఆర్థికంగా ఇబ్బందులొస్తాయని ఉన్నతస్థాయిలో గుర్తించారు. తొలి విడతలో గతేడాది జులై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి రోజున కొన్ని బృందాలకు ఇవ్వాలని నిర్ణయించారు. రెండో దశలో సెప్టెంబరు, మూడో దఫా డిసెంబరులో ఇచ్చేందుకు వ్యవసాయశాఖాధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. మార్గదర్శకాల జారీలో జాప్యం జరగడంతోపాటు విధివిధానాలపై ఉన్నతస్థాయి నుంచి స్పష్టత రాలేదు. దీంతో అమలులో అడ్డంకులు ఎదురయ్యాయి. మునుపటి బకాయిలు చెల్లిస్తేనే ట్రాక్టర్లు ఇస్తామని సరఫరా, పంపిణీ సంస్థల ప్రతినిధులు మెలిక పెట్టడంతో 2021-22 ఖరీఫ్, రబీ ముగిసిపోయినా ర్దేశిత లక్ష్యంలో పూర్తిస్థాయిలో 50 శాతం లక్ష్యాన్ని కూడా చేరుకోలేదు.
ఇవీ కారణాలు
అధికార పార్టీకి చెందిన కీలక నాయకులు సిఫార్సు చేసిన వారికే ప్రాధాన్యమివ్వాలని గతేడాది నిర్ణయించడంతో గ్రామాల్లో పోటీ నెలకొనడడం నాయకులకు తలనొప్పిగా మారింది. ట్రాక్టర్లు ఇచ్చేదిలేదని సరఫరా సంస్థల ప్రతినిధులు ప్రకటించారు. గతంలో రాయితీయేతర సొమ్ములు చెల్లించకుండా నిలిపివేశారని, ఆ డబ్బులు చెల్లిస్తే సీహెచ్సీ బృందాలకు ట్రాక్టర్లు ఇస్తామని తెగేసి చెప్పారు. ట్రాక్టరు లేకుండా దుక్కుల మడకలు, విత్తన గొర్రు, రోటావేటారు, పవర్ ట్రిల్లరు, బహుళ నూర్పిడి యంత్రాలు, పంటలకు ఆశించే తెగుళ్లు, పురుగుల నివారణకు మందుల పిచికారీ చేసే స్ప్రేయర్లు, లోతు దుక్కి కోసం రెండు మడకలు, కలుపుతీత పరికరాలతోపాటు మరికొన్ని అందుబాటులో పెడతామని చెప్పారు. వీటి కొనుగోలు రైతు ఇష్టానికే వదిలేశారు. అన్నదాతలు నచ్చిన రకాన్ని తీసుకునేలా అనుమతిచ్చారు. ట్రాక్టరు తర్వాత ఇస్తామని 10 నెలల కిందట అధికారులు చెప్పడంతో కర్షకుల్లో నైరాశ్యం నెలకొంది. పైగా యూనిట్ విలువ మొత్తం చెల్లిస్తే తర్వాత రాయితీ సీహెచ్సీ ఉమ్మడి ఖాతాలో జమ చేస్తామని చెప్పడంతో చాలామంది వెనుకడుగు వేయడంతో పోటీ తగ్గింది.
రైతులు అడిగిన రకాలు ఇస్తున్నాం
జిల్లాలో రైతు భరోసా కేంద్రాల పరిధిలో వినియోగదారుల అద్దె కేంద్రాల ఏర్పాటు చేయించాం. ఇప్పటికే చాలామంది అన్నదాతలు యంత్ర, పరికరాలు కావాలని డబ్బులు చెల్లించారు. రైతులకు ఏ రకం అవససమని సమాచారం సేకరించాం. కర్షకులు అడిగిన రకాలు ఇస్తున్నాం. జిల్లాలో 210 ట్రాక్టర్లు ఇవ్వాలని లక్ష్యాన్ని నిర్ణయించగా, అంత కంటే ఎక్కువమంది కర్షకులు ముందుకొచ్చారు. త్వరలో అందరికీ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. క్షేత్రస్థాయిలో సీహెచ్సీల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి రైతులకు మేలు జరిగేవిధంగా చూస్తాం. - ఎ.నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయాధికారి
మండలానికి ఆరు ట్రాక్టర్లు...
ప్రతి ఆర్బీకే పరిధిలో సీహెచ్సీ ఏర్పాటు చేయాలని వ్యవసాయాధికారులు తాజాగా ప్రణాళికను రూపొందించారు. మొదట సరఫరా సంస్థలు ట్రాక్టర్లు ఇవ్వడానికి ససేమిరా అన్నాయి. బృంద సభ్యులు కూడా యూనిట్ విలువను పూర్తి స్థాయిలో చెల్లించడానికి వెనకడుగు వేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీ ముగిసినా లక్ష్యాన్ని చేరుకోలేక చతికిలపడ్డారు. ఈ నేపథ్యంలో మండలానికి ఆరు సీహెచ్సీలను ఎంపిక చేసి ట్రాక్టర్లు ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటిని పంపిణీ చేసేందుకు వచ్చే నెలలో మెగా మేళా నిర్వహించాలని కసరత్తు చేస్తున్నారు. కొన్ని మండలాల్లో ఎక్కువ మంది ఆసక్తి చూపగా, మరికొన్ని చోట్ల తక్కువ సంఖ్యలో ముందుకొచ్చారు. దీంతో అన్ని ఆర్బీకేలకు ట్రాక్టర్లు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు.
అద్దె కేంద్రం నిర్వహణ ఎక్కడ...?
సన్న, చిన్నకారు రైతులకు ఆర్థికంగా ఉపశమనం కల్పించడానికి క్షేత్రస్థాయిలో వినినియోగదారుల అద్దె కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. రైతులు ఉమ్మడిగా ముందుకొచ్చి సీహెచ్సీ కేంద్రాన్ని సమర్థంగా నిర్వహిస్తే అదనపు ఆదాయం పొందవచ్చునని ప్రభుత్వ ఉద్దేశం. కాకపోతే చాలాచోట్ల సక్రమంగా అమలు కావడం లేదు. లబ్ధిదారులుగా ఎంపికైన వారితోపాటు బంధువులు, మిత్రులే ప్రయోజనం పొందుతున్నారు. అద్దె కేంద్రం ఏర్పాటు చేసి యంత్ర పరికరాలను అవసరమైన వారికి అందుబాటులో పెట్టాలనే మాటను మరిచారు. పర్యవేక్షణ లేమితో ప్రభుత్వ లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు కథనానికి స్పందన
[ 29-03-2024]
మండలంలోని దూలంవారిపల్లెలో మండలాధికారులు రక్షిత మంచి పథకానికి ఉన్న పార్టీ రంగులను చెరిపేసి తెల్లరంగుపూత వేశారు. -
భక్తిశ్రద్ధలతో గుడ్ఫ్రైడే
[ 29-03-2024]
మండలకేంద్రంలోని 136 ఏళ్ల నాటి పురాతన సీఎస్ఐ చర్చిలో శుక్రవారం గుడ్ఫ్రైడేను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. -
ఆదేశాలకు పాతర.. ఇసుకాసురుల జాతర!
[ 29-03-2024]
పర్యావరణ అనుమతుల్లేకుండా ఇసుక తవ్వకాలు జరపొద్దని హైకోర్టు స్పష్టం చేసినా అధికార పార్టీ నేతలు ఖాతరు చేయడం లేదు. నిబంధనలను అతిక్రమిస్తే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తీర్పు వెల్లడించినా పోలీసు అధికారులు సైతం వాటిని పట్టించుకోకుండా వైకాపా నేతలకు వత్తాసు పలుకుతున్నారు. -
కీలక నేతలతో చంద్రబాబు భేటీ!
[ 29-03-2024]
మదనపల్లెలో బుధవారం రాత్రి, గురువారం ఉదయం తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ కీలక నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు -
రాయచోటిపై తెదేపా ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
రాయచోటి నియోజకవర్గంపై తెదేపా ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలను పిలిపించుకుని గెలుపు వ్యూహాలపై చర్చించారు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథరెడ్డితో చంద్రబాబు పలుమార్లు మాట్లాడారు -
రెండో రోజూ ప్రయాణికులకు తిప్పలే
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభలకు జిల్లా నుంచి బస్సులు కేటాయించడంతో వరుసగా రెండోరోజూ గురువారం ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. -
ఒంటిమిట్టలో ఆదర్శ పోలింగ్ కేంద్రం
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒంటిమిట్ట ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఆదర్శ పోలింగ్ (పీఎస్-47) కేంద్రం ఏర్పాటు చేశారు. ఉద్యోగుల విధుల నిర్వహణ, ఓటర్లతో మాట్లాడాల్సిన తీరు, ఈవీఎంల పనితీరుపై వీఆర్వోలు, వీఆర్ఏలు, బీఎల్వోలు, సిబ్బందికి అవగాహన కల్పించారు -
దాహమో.... రఘురామ!
[ 29-03-2024]
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది సీఎం జగన్ సొంత ఇలాకాలోని మైదుకూరు పురపాలక సంఘం ప్రజల పరిస్థితి -
మైనార్టీ విద్యకు గ్రహణం!
[ 29-03-2024]
కేంద్ర ప్రాయోజిత నిధులతో నిర్మించతలపెట్టిన ముస్లిం, దూదేకులు, దళిత క్రిస్టియన్ల పిల్లలకు 6 నుంచి 10వ తరగతి వరకు గురుకుల పాఠశాలలు, వసతిగృహ సముదాయాలు ప్రతిపాదనలకే పరిమిత మయ్యాయి -
‘దోషులను వెంట పెట్టుకుంది జగనే’
[ 29-03-2024]
శామాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిని వెంటపెట్టుని తిరుగుతున్నది సీఎం జగనే అని మాజీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు సనసభ తెదేపా అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి ఆరోపించారు -
వివేకా హత్య కేసులో నిందితుడు అవినాష్ ఎంపీ టికెట్టా?
[ 29-03-2024]
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడు వై.ఎస్.అవినాష్రెడ్డిని పక్కన పెట్టుకుని, తన చిన్నాన్నను ఎవరో చంపేశారని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని భాజపా జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్రెడ్డి అన్నారు. -
తాగునీటి గండం..విద్యార్థులకు శాపం
[ 29-03-2024]
దేశ సరిహద్దులో భద్రత ఏర్పాట్లు చూసే సైనికులు... పశువైద్య విజ్ఞానాన్ని అవపోశన పడుతున్న విద్యార్థులను తాగునీటి సమస్య విపరీతంగా వేధిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు