గ్రామీణ రహదారులకు మోక్షం
అన్నమయ్య, వైయస్ఆర్ జిల్లాల్లో రహదారులు చిన్నాభిన్నమయ్యాయి. పెద్దపెద్ద గోతులతో రాకపోకలు సాగించలేని దుస్థితికి చేరాయి. ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించేవారికి నరకం చూపిస్తున్నాయి. గ్రామీణ, జిల్లా, రాష్ట్ర, జాతీయ రహదారులనే తేడా లేకుండా ఘోరంగా
ఏటూరు-రామిరెడ్డిపల్లె రహదారి దుస్థితి
ఈనాడు, డిజిటల్ కడప అన్నమయ్య, వైయస్ఆర్ జిల్లాల్లో రహదారులు చిన్నాభిన్నమయ్యాయి. పెద్దపెద్ద గోతులతో రాకపోకలు సాగించలేని దుస్థితికి చేరాయి. ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించేవారికి నరకం చూపిస్తున్నాయి. గ్రామీణ, జిల్లా, రాష్ట్ర, జాతీయ రహదారులనే తేడా లేకుండా ఘోరంగా దెబ్బతిన్నాయి. ఇటు రహదారులు, భవనాలశాఖ అటు పంచాయతీరాజ్శాఖలో గత రెండేళ్లుగా మరమ్మతులు చేపట్టలేదు. ఏటా చేపట్టే నిర్వహణ పనులను గాలికొదిలేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులకు మోక్షం కలిగించే కబురు కేంద్రం నుంచి అందింది. వడ్డీలేని రుణం ఇవ్వడానికి పచ్చజెండా ఊపింది. ఇదే తరుణంలో గుత్తేదారులకు బిల్లుల బకాయిల చెల్లింపులు మెరుగుపడుతున్నాయి.
కేంద్రం ఆర్థిక సాయం...
కేంద్రం నుంచి రూ.1,072 కోట్ల ఆర్థిక సాయం వడ్డీలేని రుణం కింద త్వరలో పంచాయతీరాజ్శాఖ ఇంజినీరింగ్ విభాగానికి అందనుంది. ఈ నిధులతో సుమారు 4,600 కిలోమీటర్ల పొడవున్న 1,646 రహదారులను అభివృద్ధి చేయనున్నారు. పాఠశాలలు, వైద్యశాలల అభివృద్ధి తరహాలో చేపట్టిన నాడు- నేడు కింద రహదారుల పనులు జరగనున్నాయి. ప్రస్తుత రహదారుల స్థితి... బాగు చేసిన అనంతరం చిత్రాలను తీసి గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు. ఈ మేరకు ప్రస్తుత రహదారుల స్థితిని ఫొటోలు తీయించడం ప్రారంభించారు. రహదారుల అభివృద్ధికి కేటయించిన నిధుల మళ్లింపునకు అవకాశం లేకుండా ఎస్ఎన్ఏ ఖాతా కిందకు తీసుకొస్తున్నారు. పనులు చేపట్టబోయే గుత్తేదారులకు సీఎంఎంఎస్ పేరుతో కాకుండా ఆస్క్రో ఖాతా ద్వారా చెల్లింపునకు సన్నాహాలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపు దాదాపు పూర్తికావొచ్చింది.న్యాయస్థానం ఆదేశాల మేరకు చెల్లింపులు చేపట్టారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన గుత్తేదారులకు ముందుగా చెల్లించారు. మొత్తంగా 2,800 బిల్లులకుగానూ 2,200 వరకు చెల్లించారు. మిగిలినవి వారం... పదిరోజుల్లో చెల్లింపునకు సన్నాహాలు చేస్తున్నారు. రహదారులు, భవనాలశాఖలోనూ చాలా వరకు పెండిండ్ బిల్లుల చెల్లించారు.
ఆరు నెలల్లో పూర్తి చేస్తాం...
కేంద్రం ఇస్తున్న ఆర్థిక సాయంతో ఆరు నెలల్లోగా రహదారులను బాగుచేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ మేరకు టెండర్ల ప్రక్రియకు సన్నాహాలు చేస్తున్నాం. దాదాపు అన్ని రహదారులు లభివృద్ధి చెందనున్నాయి. గుత్తేదారులకు చాలా వరకు పెండింగ్ బిల్లులు చెల్లించాం. మిగిలినవి త్వరలో చెల్లిస్తాం. నిధులూ కొంత వరకు మిగుల్లోకి రానున్నాయి. - శ్రీనివాసులురెడ్డి, ఎస్ఈ, పంచాయతీరాజ్శాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాయంచపై రాములోరి రాజసం
[ 19-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు గురువారం రాత్రి రాయంచపై రాములోరి విహారం కనులపండువగా సాగింది. -
మొదలైన నామినేషన్ల సందడి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ గురువారం మొదలైంది. కలెక్టర్ విజయ రామరాజు ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం కలెక్టరేట్లోని తన ఛాంబరులో నామపత్రాల స్వీకరణను ఆయన ప్రారంభించారు. -
జగన్ను నమ్మాం... నిండా మునిగాం!
[ 19-04-2024]
‘నేను ఉన్నానన్నావ్... నేను విన్నానన్నావ్... నిజమే అనుకున్నాం... నీ మాటలు విని మా బాధలు తెలుసుకుంటావని, పరిష్కారం చూపుతావని ఎంతో ఆశతో నిన్ను గెలిపించాం... తీరా చూస్తే నువ్వు ఉన్నావు... కానీ వినే ఓపికే లేకుండా పోయింది. -
షర్మిలకు మద్దతుగా పులివెందులలో సునీత ప్రచారం
[ 19-04-2024]
కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల తరఫున మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత దంపతులు గురువారం నుంచి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. -
బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మరథం
[ 19-04-2024]
బ్రహ్మాండ నాయకుడైన శ్రీరాముడి రథోత్సవం గురువారం వాల్మీకి క్షేత్రంలో వైభవంగా జరిగింది. ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
మరో వైకాపా ఫ్యానుపై వేటు
[ 19-04-2024]
వృత్తి ఉద్యోగమైనా... నిబంధనలు ఉల్లంఘించి అత్యుత్సాహంతో ముఖ్యమంత్రి జగన్కు ఊడిగం చేసే వారికి తగిన శాస్తి జరుగుతుందనడానికి నిదర్శనమే... ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై వేటు. -
పెద్దిరెడ్డి కుటుంబ దోపిడీని ఓటుతో అడ్డుకోండి
[ 19-04-2024]
రాజంపేట పార్లమెంట్ పరిధిలో పెద్దిరెడ్డి దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ముఖ్యమంత్రి, భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. -
జగన్ బాటలో బస్సులు.. జనానికి ‘ముప్పు’తిప్పలు!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో పల్లెలకు బస్సులు దూరమయ్యాయి... కొత్త బస్సులు రాకపోగా, ఉన్న బస్సులు మరమ్మతులకు గురయ్యాయి... పల్లె బస్సులు రద్దయ్యాయి. అవీ ఎప్పుడొస్తాయో తెలియదు. -
బ్రహ్మోత్సవ శోభ... ఆధ్యాత్మిక ప్రభ
[ 19-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రామయ్య క్షేత్రంలో రెండో రోజు గురువారం ఉదయం యాగశాలలో తితిదే ఆగమ సలహాదారు కల్యాణపురం రాజేష్ భట్టార్ ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు. -
జగనన్న చెప్పాడంటే చెయ్యడంతే
[ 19-04-2024]
మైకు పట్టుకుని రాజకీయ నాయకులేం చెబుతారో ఎన్నికల తర్వాత ఆ పని చేయకపోతే రాజీనామా చేసిపోయే పరిస్థితి రావాలన్నావు. నీ మాటలు నమ్మి ప్రశ్నిస్తే.. కేసులు పెట్టిస్తున్నావ్.. నీ అనునాయులతో ఉరికించి ఉరికించి కొట్టిస్తున్నావ్.. చెప్పిన మాటకు కట్టుబడక పోతే ఎలాగన్నా. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి
[ 19-04-2024]
కేంద్రం, రాష్ట్రంలో తమ ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే చేనేత కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తామని కడప ఎంపీ తెదేపా అభ్యర్థి భూపేష్రెడ్డి, జమ్మలమడుగు అసెంబ్లీ భాజపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డి హామీ ఇచ్చారు. -
జిల్లాకు చేరుకున్న కేంద్ర ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై పర్యవేక్షణకు కేంద్ర ఎన్నికల పరిశీలకులు గురువారం జిల్లాకు చేరుకున్నారు. తొలుత కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, ఎస్పీ కృష్ణారావు, ఇతర జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. -
రాజంపేట వైకాపాలో ముసలం
[ 19-04-2024]
రాజంపేట వైకాపాలో ముసలం పుట్టింది. నియోజకవర్గానికి చెందిన వైకాపా నాయకులు, కార్యకర్తలు ఇటీవల తెదేపాలో చేరారు. ఈ క్రమంలో హైదరాబాద్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో బుధవారం జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు, తెదేపా నాయకుడు పోలి సుబ్బారెడ్డి, సుగవాసి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో నందలూరు, రాజంపేట మండలాలకు చెందిన వైకాపా నేతలు పార్టీలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!