కళాకారులకు జిల్లా పుట్టినిల్లు : ఉపముఖ్యమంత్రి
కళాకారులకు పుట్టినిల్లు జిల్లా అని, ఈనెల 25 నుంచి 31వ తేదీ వరకు కడపలో జరగనున్న ప్రజానాట్యమండలి రాష్ట్ర స్థాయి మహాసభలు, కళా ఉత్సవాలను విజయవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్బాషా పిలుపునిచ్చారు. ఉప ముఖ్యమంత్రి తన కార్యాలయంలో
మహాసభల గోడపత్రాలు ఆవిష్కరిస్తున్న ఉపముఖ్యమంత్రి అంజాద్బాషా, సీపీఐ నాయకులు
కడప ఎన్జీవో కాలనీ, న్యూస్టుడే : కళాకారులకు పుట్టినిల్లు జిల్లా అని, ఈనెల 25 నుంచి 31వ తేదీ వరకు కడపలో జరగనున్న ప్రజానాట్యమండలి రాష్ట్ర స్థాయి మహాసభలు, కళా ఉత్సవాలను విజయవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్బాషా పిలుపునిచ్చారు. ఉప ముఖ్యమంత్రి తన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర మహాసభల గోడపత్రాలను సోమవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. కవులు, కళాకారులు, రచయితలకు, కళలకు కాణాచి అయిన జిల్లాలో రాష్ట్ర స్థాయి కళా ఉత్సవాలు జరుపుకోవడం సంతోషకరమన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, నాయకులు కృష్ణమూర్తి, నాగసుబ్బారెడ్డి, వెంకటశివ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మద్దిలేటి, ఏఐవైఎఫ్ నాయకుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.