logo

పరిహారం చెల్లించాలని ఆందోళన

ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి భూములు తీసుకున్నారని, ఇంతవరకు పరిహారం మాత్రం చెల్లించడం లేదని జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె, పెద్దనూరు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సోమవారం వారు నిరసన తెలిపారు.

Published : 24 May 2022 06:20 IST


నిరసన వ్యక్తం చేస్తున్న సున్నపురాళ్లపల్లె వాసులు

అరవిందనగర్‌ (కడప), న్యూస్‌టుడే: ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి భూములు తీసుకున్నారని, ఇంతవరకు పరిహారం మాత్రం చెల్లించడం లేదని జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె, పెద్దనూరు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సోమవారం వారు నిరసన తెలిపారు. ఎకరాకు రూ.7.50 లక్షల పరిహారం ఇస్తామని ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. అప్పట్లో మా భూములు బ్యాంకుల్లో పెట్టి అప్పు తీసుకున్నామని, ఇప్పుడు బ్యాంకు అధికారులు అప్పు చెల్లిస్తారా భూములిస్తారా అంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జిల్లా అధికార యంత్రాంగం స్పందించి పరిహారం చెల్లించేవిధంగా చర్యలు తీసుకోవాలని వారంతా కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని