logo

‘వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపాలి’

అన్ని ధరలు, పన్నులను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పెద్దచెప్పలిలో ప్రజా చైతన్యయాత్ర నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..

Published : 24 May 2022 06:27 IST


 మాట్లాడుతున్న తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి

కమలాపురం, న్యూస్‌టుడే : అన్ని ధరలు, పన్నులను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పెద్దచెప్పలిలో ప్రజా చైతన్యయాత్ర నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం చేస్తున్నవి నవ రత్నాలు కాదని, నవ మోసాలు అని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో తెదేపాను గెలిపించాలని కోరారు. తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి శీలం ప్రభాకర్‌రెడ్డి , బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి గండి ఓబయ్య, ముస్లీం మైనార్టీ జిల్లా అధ్యక్షుడు ఖాదర్‌బాషా, కాపునాడు మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.  - ఒంగోలులో నిర్వహిస్తున్న మహానాడును విజయవంతం చేయాలని పుత్తా నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆరు మండలాల పార్టీ కన్వీనర్లు, ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని