రైతుల గోడు పట్టడంలేదు!
వైయస్ఆర్ జిల్లా కమలాపురం పట్టణానికి చెందిన రైతు శంకర్రెడ్డి ఆరబోసిన వరిధాన్యం ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిపోయింది. కారుమబ్బులు కమ్ముకోవడంతో తన వద్దనున్న చాలీచాలని రంధ్రాలున్న పట్ట (టార్పాలిన్)ను కప్పడంతో ఆ రైతు కష్టమంతా వర్షార్పణమైంది.
మూడేళ్లుగా నిలిచిన రాయితీ టార్పాలిన్ల సరఫరా
కల్లంలో పంటలు కాపాడుకోవడానికి అష్టకష్టాలు
శనగలపై కప్పిన చాలీ చాలని ప్లాస్టిక్ పట్ట
ఈనాడు డిజిటల్, కడప, న్యూస్టుడే, కమలాపురం వైయస్ఆర్ జిల్లా కమలాపురం పట్టణానికి చెందిన రైతు శంకర్రెడ్డి ఆరబోసిన వరిధాన్యం ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిపోయింది. కారుమబ్బులు కమ్ముకోవడంతో తన వద్దనున్న చాలీచాలని రంధ్రాలున్న పట్ట (టార్పాలిన్)ను కప్పడంతో ఆ రైతు కష్టమంతా వర్షార్పణమైంది. తడిసిన పంటను తక్కువ ధరకు వదిలించుకోక తప్పలేదు. ఈయన ఒకరే కాదు ఉమ్మడి కడప జిల్లాలో రైతులందరిదీ ఇదే పరిస్థితి. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడం, రానున్నది వర్షాకాలం కావడంతో పట్టలు అందుబాటులో లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయశాఖ వివిధ పథకాలకు మంగళం పాడేసింది. రైతులకు ఉపయుక్తమైనవి అమలు చేయకుండా నిలిపివేసింది. ఇందులో అత్యంత ప్రయోజనకరమైన పట్టలు మూడేళ్ల కింద వరకు 50 శాతం రాయితీపై రైతులకు అందజేసింది. ఒక్కొక్క రైతుకు రెండేసి పట్టలు ఇవ్వడంతో మూడేళ్లపాటు వాటిని వినియోగించుకునేవారు. చివరిగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో రైతులు అబ్ధి పొందారు. అనంతరం ప్రభుత్వం రాయితీ పట్టలకు తిలోదకాలిచ్చింది.
* ఉమ్మడి కడప జిల్లాలో ఏటా 25 వేల పట్టలు రాయితీపై సరఫరా చేసేవారు. ప్రస్తుతం వైయస్ఆర్ జిల్లాలో 14 వేలు, అన్నమయ్య జిల్లాకు 11 వేలు వరకు సరఫరా చేయాల్సి ఉండగా ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. ప్రస్తుతం రైతులు మార్కెట్లో అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఇవి నాణ్యత, మన్నిక అంతగా ఉండకపోవడంతో త్వరగా చిరిగిపోతున్నాయి. పేద రైతులు సిమెంటు, రసాయన, దాణా బస్తాలతో తయారు చేసిన సాధారణ పట్టలు వినియోగిస్తున్నారు. వర్షానికి నీరు దిగి పంట తడిసిపోతోంది. ఆరబెట్టిన పంటను పోగు చేసిన రాశులపై కప్పేందుకు పట్టలు అందుబాటులో లేక కర్షకులు ఆందోళన చెందుతున్నారు. వైయస్ఆర్ జిల్లాలో ఇటీవల మూడు రోజులపాటు కురిసిన వర్షాలకు పలుచోట్ల ధాన్యం, రాగి, నువ్వు తదితర పంట తడిసిపోయాయి.
* ఏటా అక్టోబరు, నవంబరులలో ఖరీఫ్ పంట చేతికొస్తుంది. పంట కోసి కల్లాల్లో ఆరబెట్టి మార్కెట్లో విక్రయిస్తుంటారు. రబీ పంట మార్చి, ఏప్రిల్, మేలలో కోతకొస్తుంది. దాదాపు ఆరేడు నెలల పాటు నూర్పిడి చేసిన పంటలు జాగ్రత్తగా నిల్వ ఉంచుకోవాలి. ఆ సమయంలో తుపాన్లు, అకాల వర్షం వస్తే కాపాడుకోవడానికి పట్టలు అత్యవసరం. నూర్పిడి సమయంలో నేలపై పట్టలేసి పంటను నాణ్యతగా సేకరించుకోవడానికి సౌలభ్యంగా ఉంటుంది. సన్న, చిన్న కారు రైతులు ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా స్వతహాగా మార్కెట్లో రూ.ఆరేడు వేలు ఖర్చు చేయడం కష్టమవుతోంది. కొందరు రైతులు బాడుగకు తెచ్చు కుంటున్నారు. ఈ భారం మోయలేక రాయితీపై ఇచ్చే వాటి కోసం మూడేళ్లుగా రైతులు ఎదురుచూస్తున్నారు.
ఎంతో ప్రయోజనం...
ఖరీఫ్, రబీలో వరి, రాగి పంటలు పండిస్తున్నాను. యంత్రంతో కోత కోసిన పచ్చి ధాన్యం వారం రోజుల పాటు ఎండలో ఆరబెట్టాలి. ఆ సమయంలో వర్షమొస్తే పంట తడిసి నష్టపోతున్నాం. ప్రతి ఏటా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం రాయితీపై పట్టలిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. బయట కొనుగోలు చేసేవి అంత నాణ్యతగా ఉండడంలేదు. -సుబ్బరాయుడు, రైతు, కమలాపురం
వానొచ్చిందంటే భయమే...
ఏటా నాలుగైదు ఎకరాల్లో వరి, ఆరెకరాల్లో మినుము పంటలు సాగు చేస్తున్నాను. వానొచ్చిందంటే భయపడతున్నాం. పంటను కాపాడుకునేందుకు ప్రభుత్వం రాయితీపై పట్టలు సరఫరా చేయాలి. మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయలేకపోతున్నాం. -విజయభాస్కర్రెడ్డి, కంచన్నగారిపల్లె, కమలాపురం మండలం
ఉద్యానశాఖ అమలు చేస్తోంది...
వ్యవసాయశాఖ రాయితీపై టార్పాలిన్లను రైతులు అందించడలేదు. ఉద్యానశాఖ మాత్రమే అమలు చేస్తోంది. అవసరమైన రైతులు ఉద్యానశాఖ ద్వారా పొందవచ్చు.
-నాగేశ్వరరావు, డీఏవో, వైఎస్ఆర్ జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
[ 20-04-2024]
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
జనంపై జగనాసురుడి దండయాత్ర!
[ 20-04-2024]
జగన్ అయిదేళ్ల పాలనలో ఊరికో అసురుడు తయారయ్యాడు... కనిపించిన భూములన్నింటికీ కబ్జా చేశారు... సహజ వనరులను ఇష్టారీతిన కొల్లగొట్టారు... తమ ఆగడాలపై ప్రశ్నించినవారిపై దాడులకు తెగబడ్డారు... హత్యలకు సైతం వెనకాడలేదు. -
హామీలకు మంగళం... ఖాకీలకు ద్రోహం!
[ 20-04-2024]
జిల్లా వ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు సబ్ డివిజన్లు ఉన్నాయి. -
నేడు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నామినేషన్
[ 20-04-2024]
పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈమె ఉదయం 8 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి కడప నగరం ఐటీఐ సర్కిల్కు 9.15 గంటలకు చేరుకుని ర్యాలీ ప్రారంభిస్తారు. -
తెదేపా రాజంపేట నియోజకవర్గ పరిశీలకుడిగా దుర్గాప్రసాద్
[ 20-04-2024]
రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంపై తెదేపా అధిష్ఠానం ప్రత్యేక దృష్టిసారించింది. కడపకు చెందిన కీలక నేత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుధా దుర్గాప్రసాద్ను పరిశీలకుడిగా నియమించింది. -
ఏం చేశావ్ మేలు... కౌలు రైతు కుదేలు..!
[ 20-04-2024]
జిల్లాలో 4,88,672 మంది రైతులుండగా, పంటలు సాగు చేసే నికర భూమి 2,70,985 హెక్టార్లు ఉంది. సొంత పొలం లేని 50 వేల మందికి పైగా కౌలురైతులు సొంతూర్లు, ఇతర ప్రాంతాల్లో మిగతా సాగు దారులకు చెందిన భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. -
సింహ వాహనంపై సీతాపతి
[ 20-04-2024]
ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు శుక్రవారం రాత్రి సింహ వాహనంపై సీతాపతి ఊరేగారు. -
అశ్వవాహనంపై శ్రీరాముడు
[ 20-04-2024]
వాల్మీకిపురంలో తితిదే ఆధ్వర్యంలోని పట్టాభిరాముడి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అశ్వవాహనంపై శ్రీరాముడు అధిరోహించి తిరుమాడవీధుల్లో ఊరేగారు. -
మామయ్యనంటూ ఊదరగొట్టేశావ్.. చిన్నారుల భద్రతను గాలికొదిలేశావ్..!
[ 20-04-2024]
జగన్ మామయ్య మాయమాటలకు చిన్నారులూ మోసపోయారు. పిల్లలకు మేనమామనని ఊదరగొట్టి వారి భద్రతను పూర్తిగా గాలికొదిలేశారు. -
అరాచక పాలన పోవాలంటే తెదేపా రావాలి
[ 20-04-2024]
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన పోవాలంటే తెదేపా అధికారంలోకి రావాలని ప్రొద్దుటూరు శాసనసభ తెదేపా అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. -
చిన్నారులతో రాజకీయ ప్రచారం?
[ 20-04-2024]
అధికార పార్టీ ఉల్లంఘనలకు కాదేదీ అనర్హం అన్నట్లు ప్రచారంలోనూ నాయకులు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. చిన్నారుల చేతికి జెండాలిచ్చి ప్రచారం చేయించుకుంటున్నారు. -
వేడుకగా ఊంజల్ సేవ
[ 20-04-2024]
రామయ్య క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం కల్యాణ మండపంలో ఊంజల్ సేవ నిర్వహించారు. -
పాలకుల నిర్లక్ష్యం... ప్రజలకు శాపం
[ 20-04-2024]
పురపాలక హోదా కల్గి పద్దెనిమిదేళ్లు కావస్తున్నా ఇంకా బద్వేలులో పలువార్డులు కనీస సౌకర్యాలకు నోచుకోలేదు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
తెదేపాలో చేరిన పగిడాల దస్తగిరి
[ 20-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. -
ప్రభుత్వ స్థలం... రాచమల్లు పరం
[ 20-04-2024]
వైకాపా ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు, స్థానిక సంస్థల భూములను అధికార పార్టీ నేతలు తమ ఆధీనంలో పెట్టేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, వారి అనుయాయులు, పార్టీ నేతలు, ఓ మోస్తరు నాయకులు, కార్యకర్తలు సైతం మున్సిపల్ స్థలాలపై కన్నేసి వాటిని తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు. -
నిందితుల అరెస్టు
[ 20-04-2024]
బాలఓబిగారి వీధిలో ఈ నెల 17న రాత్రి ఓ మహిళ విషయంలో యువకుల మధ్య జరిగిన ఘర్షణ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఒకటో పట్టణ ఠాణా సీఐ శ్రీకాంత్ తెలిపారు.