మాజీ ఎమ్మెల్యేపై రాచమల్లు వ్యాఖ్యలు
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డిపై చేసిన సంచలన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ప్రొద్దుటూరు మండలం కామనూరులో బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే... మాజీ ఎమ్మెల్యేని ఉద్దేశించి
ఉద్రిక్తత... పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
ఎమ్మెల్యే రాచమల్లును ప్రశ్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి మద్దతుదారులు
ఈనాడు డిజిటల్, కడప: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డిపై చేసిన సంచలన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ప్రొద్దుటూరు మండలం కామనూరులో బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే... మాజీ ఎమ్మెల్యేని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘కామనూరులో పలుమార్లు రిగ్గింగ్ జరిగింది. ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అనేకసార్లు చంపేశారు.’ అని అన్నారు. ఈ గ్రామానికి చెందిన వరదరాజులురెడ్డి ఎన్నికల్లో గెలుపుపై నమ్మకం లేక ఇక్కడ స్వేచ్ఛాయుతమైన ఓటింగ్ లేకుండా రిగ్గింగ్కు పాల్పడటంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేస్తున్నట్లు మండిపడ్డారు. ఈ సమయంలో అక్కడే ఉన్న వరదరాజులురెడ్డి వర్గీయులు... ఎక్కడ?... ఎప్పుడు? రిగ్గింగ్ జరిగిందని ఎమ్మెల్యేను ప్రశ్నించడంతో ఉద్రికత్త చోటు చేసుకుంది. వరదరాజులురెడ్డి వర్గీయులపై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. కామనూరులో ప్రజాస్వామ్యానికి ప్రాణం పోయాలంటూ విజ్ఞప్తి చేయడంతో పాటు రాజకీయ గురువు వరదరాజులురెడ్డికి హెచ్చరిక చేస్తున్నానని ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో తెదేపా తరపున మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి పోటీ చేసినా కామనూరులో మాత్రం రిగ్గింగ్కు అవకాశం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామన్నారు. ఇన్నాళ్లగా ఇక్కడ అభివృద్ధి జరగలేదని, సీఎం జగన్ పుణ్యమా అని మెరుగైన వైద్యం, ఆరోగ్య సేవల కోసం కొత్తగా పీహెచ్సీ భవనం ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమం ముగిసిన తర్వాత వరదరాజులురెడ్డి మద్దతుదారులు ఏసు, గౌస్ లాజం మాట్లాడుతూ ఎమ్మెల్యేను పలు అంశాలపై ప్రశ్నించారు. శాంతిభద్రతలు దృష్ట్యా డీఎస్పీ ప్రసాదరావు ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్పంచి షేక్ షమీమ్, పురపాలక ఛైర్పర్సన్ లక్ష్మీదేవి, ర.భ ఎస్ఈ మహేశ్వరరెడ్డి, ఈఈ నరసింహారెడ్డి, డీఎంహెచ్వో నాగరాజు, డిప్యూటీ డీఎంహెచ్వో శాంతకళ, వైద్యుడు హనీఫ్బాబా, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
అక్రమాలపై ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు : ఎమ్మెల్యే
ప్రొద్దుటూరు పట్టణం : గోపవరం గ్రామ పంచాయతీలో ఇంటి నిర్మాణాలకు సంబంధించి అప్రూవల్ కోసం ఎవరైనా మామూళ్లు వసూలు చేస్తుంటే స్వయంగా తనకు ఫిర్యాదు చేయవచ్చునని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సీపీఎం నాయకులు చేస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందిస్తూ శుక్రవారం ఉదయం 11 గంటలకు గోపవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉంటానన్నారు. మామూళ్ల వసూళ్లపై బాధితులు ఎవరైనా ఉంటే తనకు ఫిర్యాదు చేయవచ్చునన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా శ్రీ వీరాంజనేయ స్వామి తిరుణాల
[ 19-04-2024]
మండలంలోని కొండపేటలో శుక్రవారం శ్రీ వీరాంజనేయ స్వామి తిరుణాల ఘనంగా జరిగింది. -
మద్యం సీసాలు పట్టివేత
[ 19-04-2024]
మండల కేంద్రంలో శుక్రవారం అక్రమంగా మద్యం సీసాలు తరలిస్తున్న రమేష్ అనే వ్యక్తిని అరెస్టు చేసి 15 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ నాగమురళి తెలిపారు. -
రాయంచపై రాములోరి రాజసం
[ 19-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు గురువారం రాత్రి రాయంచపై రాములోరి విహారం కనులపండువగా సాగింది. -
మొదలైన నామినేషన్ల సందడి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ గురువారం మొదలైంది. కలెక్టర్ విజయ రామరాజు ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం కలెక్టరేట్లోని తన ఛాంబరులో నామపత్రాల స్వీకరణను ఆయన ప్రారంభించారు. -
జగన్ను నమ్మాం... నిండా మునిగాం!
[ 19-04-2024]
‘నేను ఉన్నానన్నావ్... నేను విన్నానన్నావ్... నిజమే అనుకున్నాం... నీ మాటలు విని మా బాధలు తెలుసుకుంటావని, పరిష్కారం చూపుతావని ఎంతో ఆశతో నిన్ను గెలిపించాం... తీరా చూస్తే నువ్వు ఉన్నావు... కానీ వినే ఓపికే లేకుండా పోయింది. -
షర్మిలకు మద్దతుగా పులివెందులలో సునీత ప్రచారం
[ 19-04-2024]
కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల తరఫున మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత దంపతులు గురువారం నుంచి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. -
బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మరథం
[ 19-04-2024]
బ్రహ్మాండ నాయకుడైన శ్రీరాముడి రథోత్సవం గురువారం వాల్మీకి క్షేత్రంలో వైభవంగా జరిగింది. ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
మరో వైకాపా ఫ్యానుపై వేటు
[ 19-04-2024]
వృత్తి ఉద్యోగమైనా... నిబంధనలు ఉల్లంఘించి అత్యుత్సాహంతో ముఖ్యమంత్రి జగన్కు ఊడిగం చేసే వారికి తగిన శాస్తి జరుగుతుందనడానికి నిదర్శనమే... ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై వేటు. -
పెద్దిరెడ్డి కుటుంబ దోపిడీని ఓటుతో అడ్డుకోండి
[ 19-04-2024]
రాజంపేట పార్లమెంట్ పరిధిలో పెద్దిరెడ్డి దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ముఖ్యమంత్రి, భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. -
జగన్ బాటలో బస్సులు.. జనానికి ‘ముప్పు’తిప్పలు!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో పల్లెలకు బస్సులు దూరమయ్యాయి... కొత్త బస్సులు రాకపోగా, ఉన్న బస్సులు మరమ్మతులకు గురయ్యాయి... పల్లె బస్సులు రద్దయ్యాయి. అవీ ఎప్పుడొస్తాయో తెలియదు. -
బ్రహ్మోత్సవ శోభ... ఆధ్యాత్మిక ప్రభ
[ 19-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రామయ్య క్షేత్రంలో రెండో రోజు గురువారం ఉదయం యాగశాలలో తితిదే ఆగమ సలహాదారు కల్యాణపురం రాజేష్ భట్టార్ ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు. -
జగనన్న చెప్పాడంటే చెయ్యడంతే
[ 19-04-2024]
మైకు పట్టుకుని రాజకీయ నాయకులేం చెబుతారో ఎన్నికల తర్వాత ఆ పని చేయకపోతే రాజీనామా చేసిపోయే పరిస్థితి రావాలన్నావు. నీ మాటలు నమ్మి ప్రశ్నిస్తే.. కేసులు పెట్టిస్తున్నావ్.. నీ అనునాయులతో ఉరికించి ఉరికించి కొట్టిస్తున్నావ్.. చెప్పిన మాటకు కట్టుబడక పోతే ఎలాగన్నా. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి
[ 19-04-2024]
కేంద్రం, రాష్ట్రంలో తమ ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే చేనేత కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తామని కడప ఎంపీ తెదేపా అభ్యర్థి భూపేష్రెడ్డి, జమ్మలమడుగు అసెంబ్లీ భాజపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డి హామీ ఇచ్చారు. -
జిల్లాకు చేరుకున్న కేంద్ర ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై పర్యవేక్షణకు కేంద్ర ఎన్నికల పరిశీలకులు గురువారం జిల్లాకు చేరుకున్నారు. తొలుత కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, ఎస్పీ కృష్ణారావు, ఇతర జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. -
రాజంపేట వైకాపాలో ముసలం
[ 19-04-2024]
రాజంపేట వైకాపాలో ముసలం పుట్టింది. నియోజకవర్గానికి చెందిన వైకాపా నాయకులు, కార్యకర్తలు ఇటీవల తెదేపాలో చేరారు. ఈ క్రమంలో హైదరాబాద్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో బుధవారం జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు, తెదేపా నాయకుడు పోలి సుబ్బారెడ్డి, సుగవాసి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో నందలూరు, రాజంపేట మండలాలకు చెందిన వైకాపా నేతలు పార్టీలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ