logo

ప్రముఖులు వెళ్లిపోయాక వచ్చి... కాసేపు గడిపి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి గురువారం తన కుమారుడి ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా కోర్టు అనుమతితో బెయిల్‌పై బయటకొచ్చారు. ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీ అవినాష్‌రెడ్డి,

Published : 27 May 2022 06:07 IST
ఆసుపత్రి వద్ద దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి

ఈనాడు డిజిటల్‌, కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి గురువారం తన కుమారుడి ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా కోర్టు అనుమతితో బెయిల్‌పై బయటకొచ్చారు. ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎంపీ తండ్రి, చిన్నాన్నలు భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రముఖులను కలవకుండా వారు వెళ్లిపోయిన అనంతరం కుమారుడి ఆసుపత్రికి వచ్చి తిరిగి జైలుకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులతోపాటు వైకాపా శ్రేణులు, తన అభిమానులతో కొద్దిసేపు గడిపారు. అనంతరం ఆయనను సీబీఐ అధికారులు తిరిగి జైలుకు తీసుకెళ్లిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని