logo

రెవెన్యూ భూదస్త్రాల స్వచ్ఛీకరణ పనులు వేగవంతం

రెవెన్యూ భూదస్త్రాల స్వచ్ఛీకరణ పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భూ పరిపాలనశాఖ ముఖ్య కమిషనర్‌ సాయిప్రసాద్‌ ఆదేశించారు. జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథక కార్యాచరణ, అమలుపై గురువారం విజయవాడ

Published : 27 May 2022 06:07 IST

దృశ్యమాధ్యమ సమీక్షలో కలెక్టర్‌ విజయరామరాజు, అధికారులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : రెవెన్యూ భూదస్త్రాల స్వచ్ఛీకరణ పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భూ పరిపాలనశాఖ ముఖ్య కమిషనర్‌ సాయిప్రసాద్‌ ఆదేశించారు. జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథక కార్యాచరణ, అమలుపై గురువారం విజయవాడ నుంచి నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో కలెక్టర్‌ విజయరామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిప్రసాద్‌ మాట్లాడుతూ ఎంపిక చేసిన గ్రామాల్లో నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలన్నారు. ఆధునిక పరిజ్ఞానంతో భూ సర్వే పనులు చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో సర్వే పనులు వేగవంతంగా సాగుతున్నాయని, మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 735 గ్రామాల్లో ప్రణాళికా ప్రకారం డ్రోన్‌ ప్రక్రియ పూర్తిచేస్తున్నామన్నారు. నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి చేస్తామన్నారు. సమీక్షలోసర్వేశాఖ ఏడీ కనకప్రసాద్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని