‘బస్సు యాత్ర అప్రతిష్టపాలు చేయడమే వారి అజెండా’
తెలుగుదేశం, జనసేన పార్టీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా ఉమ్మడి అజెండాను అమలు చేస్తున్నాయని జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమరనాథ్రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే సుధ, నగర మేయర్ సురేష్బాబు ఆరోపించారు. గురువారం వైకాపా
మాట్లాడుతున్న మేయర్ సురేష్బాబు, పక్కన జడ్పీ ఛైర్మన్
అమరనాథ్రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే సుధ తదితరులు
కడప నగరపాలక, న్యూస్టుడే : తెలుగుదేశం, జనసేన పార్టీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా ఉమ్మడి అజెండాను అమలు చేస్తున్నాయని జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమరనాథ్రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే సుధ, నగర మేయర్ సురేష్బాబు ఆరోపించారు. గురువారం వైకాపా జిల్లా కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న మంత్రుల బస్సు యాత్రను అప్రతిష్టపాలు చేయడానికి అమలాపురం అల్లర్ల అజెండాను తెదేపా, జనసేన నాయకులు అమలుచేశారని ఆరోపించారు. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లను తగలబెట్టి, ఆ పని చేసింది అధికార పార్టీ నాయకులేనని ప్రచారం చేయడం తగదన్నారు. పోలీసులు సంయమనం పాటించడం వల్లే అక్కడ ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. అల్లర్లను ఆపడానికి పోలీసులు కాల్పులు జరిపి ఉంటే పలువురు ప్రాణాలు కోల్పోయేవారన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగితే దానిపై రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు సృష్టించాలని, ఆ పార్టీ నాయకులు ప్రణాళిక రూపొందించుకున్నారన్నారు. వైకాపా కార్యకర్తలు వారి నాయకుల ఇళ్లను వారే తగలబెడతారా అని ప్రశ్నించారు. దేశంలో ఇప్పటి వరకు ఏ ఒక్క జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టలేదన్నారు. ఆయన గౌరవార్థం కోనసీమ జిల్లాకు ఆయన పేరు పెట్టారన్నారు. ఈ నిర్ణయంపైన ప్రభుత్వానికి పునరాలోచన లేదని స్పష్టం చేశారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు గడికోట మోహన్రెడ్డి, అఫ్జల్ఖాన్, సంబటూరు ప్రసాదరెడ్డి, తాగ్యరాజు, గరుడాద్రి,. వినోద్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాలి
[ 25-04-2024]
మండలంలోని శంకవరంలో గురువారం రాత్రి భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోశన్న కుమారుడు బొజ్జా కార్తీక్, తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
తిరుగుబాటు మొదలైంది.. జగన్ ఇంటికి పోవడం ఖాయం: చంద్రబాబు
[ 25-04-2024]
రాయలసీమలో తిరుగుబాటు మొదలైందని.. జగన్ ఇంటికి పోవడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
వైకాపాని పాతాళానికి తొక్కేద్దాం.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం: పవన్
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దాం.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
[ 25-04-2024]
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
[ 25-04-2024]
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
[ 25-04-2024]
సీఎం జగన్ వైకాపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు గురువారం పులివెందుల రానున్నారు. -
మీ బిడ్డనని గారాలు... నీ గడ్డపైనే ఘోరాలు!
[ 25-04-2024]
రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా నరేగా నుంచి రూ.26.02 కోట్లతో 349 మట్టి పనులను వైకాపా నేతలకు పంచిపెట్టారు. -
ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం
[ 25-04-2024]
మాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు -
నేడు రాజంపేట, రైల్వేకోడూరులో ప్రజాగళం
[ 25-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరు పర్యటనకు రానున్నారు -
అక్రమాలకు పాల్పడకుండా గెలిచే సత్తా మీకుందా?
[ 25-04-2024]
అక్రమాలకు పాల్పడకుండా పులివెందులలో గెలిచే సత్తా మీకుందా? అని తెదేపా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి సీఎం జగన్కు సవాల్ విసిరారు -
నీళ్లు గరళం... పారిశుద్ధ్యం అధ్వానం
[ 25-04-2024]
నియోజకవర్గ కేంద్రాలు ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు పట్టణ ప్రాంతాల్లోని కాలనీల ప్రజలు కనీస వసతులకు నోచుకోలేక తల్లడిల్లుతున్నారు -
జగన్ పాలనలో పర్యాటకాభివృద్ధి శూన్యం
[ 25-04-2024]
పర్యాటకుల నుంచి ఛార్జీలు, పన్నులు తదితరాల పేరుతో ఆదాయం వస్తున్నా ఆ రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. -
జగనన్న హామీలు...నీటి మూటలు
[ 25-04-2024]
ఆరునూరైనా అభివృద్ధి చేసి తీరుతాం.. మైదుకూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామంటూ జగన్ ప్రభుత్వంలో పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?