Andhra News: ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్పై కొనసాగుతున్న ఉత్కంఠ!
ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారిన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్పై
కాకినాడ: ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారిన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కేసులో ఎమ్మెల్సీని ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్న నేపథ్యంలో ఆయన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారని దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అనంతబాబును అరెస్ట్ చేస్తామని శనివారం రాత్రే జిల్లా ఎస్పీ ప్రకటించినప్పటికీ దానికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని పోలీసులు ఇవ్వలేదు. పోస్టుమార్టం ఆలస్యం కావడం వల్లే కేసులో తాము ముందుకు వెళ్లలేకపోయామని పోలీసులు చెబుతూ వస్తున్నారు.
ఈ కేసుపై ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు సోమవారం సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. దళిత, ప్రజాసంఘాలతో పాటు విపక్ష పార్టీలు అనంతబాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ విషయంలోఎలా ముందుకెళ్లాలనే అంశంపై డీఐజీ చర్చించినట్లు తెలుస్తోంది. అనంతబాబు గత మూడురోజులుగా రాజమహేంద్రవరం, కాకినాడ పరిసరాల్లో ఉన్నట్లు సమాచారం. శుక్రవారం నుంచి తన ఇద్దరు గన్మెన్లను వదిలి వెళ్లినట్లు పోలీసువర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఎమ్మెల్సీ కోసం ఐదు బృందాలు గాలిస్తున్నాయి.
కాకినాడలో నిరసనలు
మరోవైపు సుబ్రహ్మణ్యం మృతిపై కాకినాడలో ఎస్సీ, ప్రజాసంఘాలు నిరసనకు దిగాయి. నగరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద దళిత, వామపక్ష, ప్రజాసంఘాల వేదిక ఆధ్వర్యంలో నేతలు ఆందోళన చేపట్టారు. ఎమ్మె్ల్సీ అనంతబాబును వెంటనే అరెస్ట్ చేయాలని.. ఆయన పదవిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది