ఎమ్మెల్సీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఎన్నికల నిర్వహణపై ఉమ్మడి జిల్లాల జడ్పీ సీఈఓలు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో
డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలిస్తున్న ఎన్నికల అధికారి, కలెక్టర్ కర్ణన్
కరీంనగర్ పట్టణం, న్యూస్టుడే: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఎన్నికల నిర్వహణపై ఉమ్మడి జిల్లాల జడ్పీ సీఈఓలు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించి 8 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కరీంనగర్ జడ్పీ కార్యాలయం, హుజూరాబాద్, జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి, మంథని, హుస్నాబాద్ ఎంపీడీవో కార్యాలయాలు, రాజన్నసిరిసిల్ల జడ్పీ సీఈఓ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాలు ఉంటాయన్నారు. ఈ నెల 10న ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ప్రతి కేంద్రంలో 200మంది ఓటుహక్కు వినియోగించుకునే అవకాశముందని వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తమ ఓటు వేస్తారని తెలిపారు. సంతకం చేయలేని వారు వేలిముద్ర వేసే వారు సహాయకుల కోసం మూడు రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటు వేసే వారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, ఆరు అడుగుల దూరం పాటించాలని, గ్లౌజులు ఇవ్వాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రంలోకి సెల్ఫోన్ తీసుకు రాకుండా బయట హెల్ప్డెస్క్లో డిపాజిట్ చేయించాలన్నారు. కొవిడ్ ఉన్న వారు పోలింగ్ రోజున మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓటు వేయవచ్చునని, ఓటర్లు ఎన్నికల సంఘం సూచించిన 11రకాల గుర్తింపు కార్డులు తీసుకురావాలన్నారు. పోలింగ్ అధికారి ఇచ్చే వాయిలెట్ పెన్తో బ్యాలెట్ పేపర్పై ఓటు వేసే అంకెలను ప్రాధాన్య క్రమంలో వేసేలా అధికారులు ఓటర్లకు సూచించాలని తెలిపారు.
డిస్ట్రిబ్యూషన్ కేంద్రం పరిశీలన
నగరంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్తో పాటు ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఎన్నికల అధికారి ఆర్.వి.కర్ణన్ సోమవారం పరిశీలించారు. ఈ నెల 9న ఎన్నికల అధికారులు ఎన్నికల సామగ్రితో ఉమ్మడి జిల్లాలోని కేంద్రాలకు వెళ్తారన్నారు. పోలింగ్ అనంతరం తీసుకు వచ్చే బ్యాలెట్ బాక్స్లను భద్రపరిచే స్ట్రాంగ్ రూం, ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఏర్పాట్లు తనిఖీ చేశారు.
72గంటల ముందు ప్రచారం ముగించాలి
ఈ నెల 10న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 72గంటల ముందు ఈ నెల 7న రాత్రి 7గంటల వరకు ప్రచారం ముగించాలని కోరారు. ప్రచారం చేస్తే నిబంధనల ఉల్లంఘన కింద రెండు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధిస్తారన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, జడ్పీ సీఈఓ ప్రియాంక, ఆర్డీఓ అనంద్కుమార్, ఏసీపీ తుల శ్రీనివాస్రావు తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూసేకరణలో జాప్యం
[ 28-03-2024]
భూసేకరణలో జాప్యమే జాతీయ రహదారుల విస్తరణకు శాపంగా మారుతోంది. జిల్లాలో ప్రధానంగా జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిగా మార్చి దశాబ్దం కావస్తున్నా.. నిర్మాణం మొదలు కావటం లేదు -
నత్తనడకన నిర్మాణాలు
[ 28-03-2024]
వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం పల్లెదవాఖానాలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర(సబ్సెంటర్ల)ను పల్లె దవాఖానాలుగా మార్చారు -
నిధులు వెచ్చించి.. పనులు వదిలేసి
[ 28-03-2024]
పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఆధునిక సాంకేతికను జోడించి పెద్ద నగరాలకు దీటుగా పోటీ పడేందుకు ప్రణాళికలు చేసిన నగరపాలిక.. ఆ విధానం అమలులో వెనుకబడింది -
తాగునీటి వృథా వద్దు : కలెక్టర్
[ 28-03-2024]
అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
కాంగ్రెస్ నిజామాబాద్ లోక్సభ స్థానం టికెట్ జీవన్రెడ్డికే దక్కింది. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది -
తొలిమెట్టు నోడల్ అధికారులకు భత్యం
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రత్యేక బోధన పద్ధతులతో కొనసాగుతున్న ఈ కార్యక్రమ పర్యవేక్షణకు మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 28-03-2024]
వాతావరణ సమాచారాన్ని ప్రతిఒక్కరి దైనందిన కార్యకలాపాల్లో భాగం చేయాలనే ఉద్దేశంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇటీవల ‘పంచాయత్ మౌసం సేవా’ మొబైల్ యాప్ విడుదల చేసింది. -
పఠనాలయం సద్వినియోగం... కల సాకారం
[ 28-03-2024]
గ్రంథాలయ పుస్తకాలతోనే ఏకకాలంలో రెండు ఉద్యోగాలు సాధించగలిగాను. తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ నిర్వహించిన ఫలితాల్లో పీజీటీ సాంఘికశాస్త్రం, జూనియర్ కళాశాలలో పౌరశాస్త్రం లెక్చరర్గా ఉద్యోగాలకు ఎంపికయ్యాను -
పంచాయతీల ఖజానా ఖాళీ
[ 28-03-2024]
ఓవైపు ఖజానా ఖాళీ, మరోవైపు సమస్యలు పంచాయతీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జమయ్యే నిధులకు మించిన వ్యయం చేయడంతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఓటు నమోదుకు ప్రత్యేక సాధారణ సెలవు
[ 28-03-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’ - దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?