అరకొర వసతులు... అందుబాటులోకి రాని భవనాలు
జిల్లాలో ఉన్నత విద్యాభివృద్ధే ధ్యేయంగా ఏర్పాటైన కళాశాల అది. విశాలమైన స్థలం, చక్కని వాతావరణంలో వసతులు సమకూర్చేందుకు భారీ అంచనాలతో మూడేళ్ల కిందటే ఆరంభమైనా నేటికీ పూర్తిస్థాయిలో వసతులు
వ్యవసాయ కళాశాల విద్యార్థులకు తప్పని ఇబ్బందులు
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల
నిర్మాణంలో ఉన్న పరిపాలన విభాగం భవనం
జిల్లాలో ఉన్నత విద్యాభివృద్ధే ధ్యేయంగా ఏర్పాటైన కళాశాల అది. విశాలమైన స్థలం, చక్కని వాతావరణంలో వసతులు సమకూర్చేందుకు భారీ అంచనాలతో మూడేళ్ల కిందటే ఆరంభమైనా నేటికీ పూర్తిస్థాయిలో వసతులు సమకూరలేదు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో 2018లో జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరైంది. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.36 కోట్లతో శాశ్వత వసతికి నిధులు కేటాయించారు. భవనాలు అందుబాటులోకి రాక అరకొర వసతుల నడుమ విద్యాభ్యాసం కొనసాగుతోంది.
కళాశాల మంజూరు తర్వాత స్థానికంగా వసతులు లేకపోవడంతో సర్దాపూర్లోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనాల్లో వసతి, తరగతులు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ కళాశాల రావడంతో ఇక్కడి పాలిటెక్నినిక్ కళాశాల అడ్మిషన్లు రద్దు చేశారు. ఇందులోని బోధన, బోధనేతర సిబ్బందిని కళాశాలకు వాడుతున్నారు. 60 మంది విద్యార్థులుండే వసతిలో ప్రస్తుతం 210 మందిని సర్దుబాటు చేశారు. కరోనాతో దాదాపు రెండేళ్లు ఆన్లైన్ తరగతులు జరగడంతో ఇప్పటి వరకు పెద్దగా ఇబ్బందేమీ రాలేదు. ప్రస్తుతం కళాశాలకు మూడు సంవత్సరాల విద్యార్థులు హాజరవుతుండటంతో వసతి, తరగతి గదుల సమస్య తలెత్తుతోంది. ఈ ఏడాది మెడికల్, నీట్ కౌన్సెలింగ్ ఆలస్యమైంది. ఈ నెలాఖరులోగా వ్యవసాయ ప్రవేశాలు పూర్తవుతాయి. కొత్తగా వచ్చే విద్యార్థులతో మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కళాశాలలో ప్రిన్సిపల్, 11 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లున్నారు. ఇటీవల వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన పదోన్నతుల్లో బోధన, బోధనేతర సిబ్బంది 15 మందిని జిల్లా కళాశాలకు కేటాయించారు. ఎన్నికల కోడ్ ముగిశాక వీరు ఇక్కడ విధుల్లో చేరనున్నారు.
జిల్లెల్లలోని వ్యవసాయ కళాశాల ప్రవేశ ద్వారం
రెండేళ్లుగా నిర్మాణాలు...
రెండేళ్లుగా భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. 40 ఎకరాల్లో 16 ఎకరాలు వసతులకు, మిగతావి పాలిహౌజ్లు, పంటలకు అనుకూలంగా మార్చనున్నారు. మొదటి విడతగా నాలుగు సంవత్సరాలకు సరిపడా అకాడమిక్ బ్లాకులు, ల్యాబ్లు, వసతి గృహాలను నిర్మించారు. తర్వాత అడ్మినిస్ట్రేషన్, సెమినార్, ఆడిటోరియం, అంతర్గత రహదారుల నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రస్తుతం నాలుగేళ్లకు అకాడమిక్, వసతి గృహాలు, ల్యాబ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ నిర్మాణ దశలో ఉంది. త్రీఫేజ్ విద్యుత్తు లైను అందుబాటులో లేదు. కళాశాలకు ప్రత్యేకంగా విద్యుత్తు లైను అమర్చేందుకు సెస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలో వసతి, తరగతి గదులు, ల్యాబ్లు సరిపోవడం లేదు. విద్యార్థులకు పూర్తిస్థాయిలో వసతులు సమకూరేందుకు ఇంకా ఎన్ని రోజులు ఎదురుచూడాలో తెలియని పరిస్థితి నెలకొంది.
ఈ నెలాఖరులో నూతన భవనంలోకి మారుతాం
- ఉమామహేశ్వరి, ప్రిన్సిపల్, వ్యవసాయ కళాశాల
నూతన కళాశాల భవనంలో వసతి గృహాలు, తరగతి గదులకు సంబంధించిన ఒక్కో బ్లాకు నిర్మాణం పూర్తయింది. విద్యుత్తు సరఫరాకు నియంత్రిక అమర్చాల్సి ఉంది. ఈ నెలాఖరులోగా నూతన భవనంలోకి మారుతాం. విద్యార్థుల ప్రయోగాలకు పాలిహౌజ్లు, క్షేత్ర పరిశీలనకు అవసరమైన పంటలను సిద్ధం చేసేందుకు నేలను చదును చేశాం. నాలుగో సంవత్సరం విద్యార్థులు ఆరు నెలలు క్షేత్ర పరిశీలనకు వెళ్తారు. మొదటి సంవత్సరం ప్రవేశాలు పూర్తయ్యేలోగా అన్ని వసతులు సమకూర్చేలా అధికారులతో మాట్లాడుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండో రోజు నలుగురు నామినేషన్
[ 20-04-2024]
కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ స్థానాలకు రెండో రోజు శుక్రవారం కేవలం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్ స్థానం కోసం భాజపా అభ్యర్థి బండి సంజయ్ తరఫున ఆ పార్టీ నాయకులు ఎన్నికల అధికారికి నామపత్రాలను అందజేశారు. -
ఆర్ఎం కార్యాలయానికి ఆరుగురు ఉద్యోగుల సరెండర్
[ 20-04-2024]
హుజూరాబాద్ ఆర్టీసీ డిపోనకు చెందిన ఆరుగురు ఉద్యోగులను కరీంనగర్ ఆర్ఎం కార్యాలయానికి సరెండర్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. స్థానిక డిపోలో పనిచేసే డ్రైవర్ రవీందర్ వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ డిపో మేనేజర్ శ్రీకాంత్ ఈ నెల 15న అనిశా అధికారులకు చిక్కిన విషయం విదితమే. -
ఉక్కపోతతో తల్లీబిడ్డల ఉక్కిరిబిక్కిరి
[ 20-04-2024]
భానుడి భగభగలకు ఉదయం 9 గంటలు దాటితే ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం భయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎండలు 40 డిగ్రీల కంటే అధికంగానే ఉంటున్నాయి. -
కాంగ్రెస్ నేతలకు మానసిక చికిత్స అవసరం
[ 20-04-2024]
కాంగ్రెస్ నేతలకు మానసిక చికిత్స అవసరమని హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు అన్నారు. వారికి చికిత్స అందేలా చూడాలని శుక్రవారం కరీంనగర్లో ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్కి వినతిపత్రం అందజేశారు. -
గంగుల, బండిల స్నేహం అందరికీ తెలుసు
[ 20-04-2024]
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ల మధ్య స్నేహం అందరికీ తెలుసునని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను ఓడించేందుకు గంగుల కమలాకర్ భాజపాతో కుమ్మకైనట్లు ఆరోపించారు. -
వారసత్వ సంపద పరిరక్షణకు ఓటేద్దాం
[ 20-04-2024]
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటేనే ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు, వారసత్వ కట్టడాలకు పెట్టింది పేరు. శాతవాహనులు, కాకతీయులు, నిజాముల కాలంలో నిర్మించిన కోటలు, మెట్ల బావులు, ఆలయాలు ఇక్కడ కనిపిస్తాయి. -
ఇదీ అన్నదాత ఎజెండా!
[ 20-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం వ్యవసాయపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. భిన్న వ్యవసాయ ఉత్పత్తులతో రాష్ట్రంలోనే ప్రత్యేకత చాటుకుంటోంది. దేశ విదేశాలకు ఎగుమతి చేసే పసుపు, మామిడి, మొక్కజొన్న, సన్న వరి, చెరకు, ఆవాలు, ఎర్రజొన్న, తెల్లజొన్న, సజ్జ తదితర పంటల దిగుబడిలో ఆదర్శంగా నిలుస్తున్నా అన్నదాతను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. -
ఒక ఎంపీ.. అయిదు జిల్లాలు
[ 20-04-2024]
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు గతంలో ఒకే జిల్లా పరిధిలో ఉండేవి. తెలంగాణ ఆవిర్భావం అనంతరం జిల్లాల పునర్విభజనతో ఎంపీ స్థానం అయిదు జిల్లాలకు విస్తరించింది. -
నీటి తొట్టిలో పడి బాలుడి మృతి
[ 20-04-2024]
ఇటుక బట్టీ వద్ద నీటి తొట్టిలో పడి ఏడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. కుటుంబసభ్యులు పోలీసుల కథనం ప్రకారం.. -
శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోండి
[ 20-04-2024]
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కేజీబీవీల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థినులకు కరీంనగర్ కేజీబీవీలో నిర్వహిస్తున్న ఎప్సెట్ శిక్షణ తరగతులను సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు అధికారి మల్లయ్య భట్టు శుక్రవారం సందర్శించారు. -
కరీంనగర్లో రూ.15.81 లక్షల పట్టివేత
[ 20-04-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా శుక్రవారం పోలీసులు కరీంనగర్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రూ.15.81 లక్షల నగదును పట్టుకున్నట్లు కమిషనర్ కార్యాలయం తెలిపింది. -
ఇంటి నుంచే ఓటింగ్పై అధికారులకు శిక్షణ
[ 20-04-2024]
ఇంటినుంచే ఓటింగ్పై పాటించాల్సిన నిబంధనలపై అధికారులకు మంథని శాసనసభ సెగ్మెంట్ అధికారి హనుమనాయక్ అవగాహన కల్పించారు. శుక్రవారం మంథని ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులకు శిక్షణ ఇచ్చారు. -
అడుగడుగునా తనిఖీలతో ప్రలోభాలకు అడ్డుకట్ట
[ 20-04-2024]
ఎన్నికల్లో డబ్బు, మద్యం, మాదకద్రవ్యాల పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. లోక్సభ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో జిల్లా సరిహద్దు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
పెరుగుతున్న పసిడి ధరలు... తగ్గుతున్న వ్యాపారం
[ 20-04-2024]
బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకి వెళుతున్నాయి. గతంలో పెళ్లి ముహూర్తాల సమయంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టేవి. దీనికి భిన్నంగా మార్కెట్లో ప్రస్తుతం పసిడి ధర పది గ్రాములు(తులం) రూ.76,000 వరకు పలుకుతోంది. -
కిట్టు సరే.. పరీక్ష చేసేవారేరీ?
[ 20-04-2024]
కలుషిత నీటితో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో ప్రజలకు శుద్ధ జలం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అక్కడక్కడ పైపులు పగిలి లీకేజీతో కలుషితమైన నీరు సరఫరా అయ్యే అవకాశం ఉంది. -
ఆరేళ్లుగా ఉపాధి కరవు
[ 20-04-2024]
వలసల నివారణకు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల కోసం ఆరేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఆ కుటుంబాలకు పనులు కల్పించడం లేదు. -
ప్రజలు మళ్లీ మోసపోవద్దు
[ 20-04-2024]
భాజపా అభ్యర్థి అర్వింద్ రాముడి పేరుతో రాజకీయం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. పొద్దునలేస్తే హిందూ-ముస్లిం, పాకిస్థాన్-ఇండియా, రోహింగ్యాంటూ మాటలు చెప్పడమే గాని ఎంపీగా ప్రజలకు చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. -
‘పసుపు బోర్డు పేరుతో మోసం’
[ 20-04-2024]
పసుపు బోర్డు పేరుతో ఎంపీ ధర్మపురి అర్వింద్ రైతులను మోసం చేశారని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు కూడా మభ్యపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.