సుందరీకరణ పనులపై నీలినీడలు
కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల పురపాలికల్లో సుందరీకరణ పనుల్లో భాగంగా 2018లో ఒక్కో పురపాలికకు రూ.50 కోట్ల నిధులను మంజూరు చేసింది. టీయూఎఫ్ఐడీసీ ద్వారా పురపాలికల్లో వివిధ పనులు చేపట్టారు. పనులు త్వరితగతిన జరిగేందుకు
ప్రారంభం కాకుండానే నిలిపివేయాలని ఆదేశాలు
కోరుట్లలో ప్రారంభం కాని గ్రీన్ఐలాండ్ పనులు
కోరుట్లగ్రామీణం, న్యూస్టుడే
కోరుట్ల పురపాలికలో ప్రారంభం కాని పనులు
కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల పురపాలికల్లో సుందరీకరణ పనుల్లో భాగంగా 2018లో ఒక్కో పురపాలికకు రూ.50 కోట్ల నిధులను మంజూరు చేసింది. టీయూఎఫ్ఐడీసీ ద్వారా పురపాలికల్లో వివిధ పనులు చేపట్టారు. పనులు త్వరితగతిన జరిగేందుకు ఆర్ఆండ్బీకి పనులను అప్పగించింది. రూ.25 కోట్లతో మొదటి విడత, రెండో విడతలో రూ.25 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రణాళికలు చేపట్టారు. కోరుట్ల పురపాలికలో రూ.25 కోట్లతో మొదటి విడతలో భాగంగా 15 పనులను గుర్తించారు. ఇందులో 11 పనులు పూర్తికాగా మరో నాలుగు పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. రెండోవిడత 9 పనులను గుర్తించగా ఏడు పనులు వివిధ దశలో ఉండగా రెండు పనులు ప్రారంభించలేదు. టీయూఎఫ్డీసీ పనులు ప్రారంభించి నాలుగేళ్లు గడిచిపోతున్న ఇంకా కొన్ని పనులు ప్రారంభించలేదు. ప్రారంభించని పనులు నిలిపివేయాలని వాటిని మొదలు పెట్టవద్దని ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో ప్రారంభం కానీ పనులపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
* మొదటి విడతలో రూ.కోటితో నందిచౌరస్తా, బస్టాండ్, ఐబీ అతిథి గృహం వద్ద జంక్షన్ల వద్ద గ్రీన్ ఐలాండ్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ సిగ్నల్తో పాటు, హైమాస్ట్ దీపాల ఏర్పాటు పనులు
* కోరుట్ల పట్టణంలోని అంతర్గత రహదారులైన పాత మున్సిపల్ నుంచి ఝాన్సీరోడ్ వరకూ కిలో మీటరుకు గానూ రూ.1.20 కోట్లతో ఆధునిక వీధిదీపాల ఏర్పాటు
* అంతర్గత రహదారి కార్గిల్ చౌరస్తా నుంచి వెంకటేశ్వర గుడి వరకూ 0.6 కిలోమీటరు, ఐబీరోడ్ నుంచి గడిబురుజు వరకూ 0.8 కిలోమీటరు ఆధునిక వీధిదీపాల ఏర్పాటుకు రూ.1.50 కోట్ల నిధులు
* మద్దుల చెరువు మినీ ట్యాంకు బండు వద్ద జాగింగ్ ట్రాక్, ఫుట్పాత్, ఇరువైపుల రేయిలింగ్, కూర్చునేందుకు బెంచీలు, గ్రీనరీ ఏర్పాటు పనులకు రూ.2.35 కోట్ల నిధుల కేటాయింపు
* కోరుట్ల వాగు వద్ద బతుకమ్మ ఘాట్, పాత్వేస్, టాయిలెట్బ్లాక్కు రూ.35 లక్షలు
* మద్దుల చెరువులోకి మురుగు కాలువ నీరు చేరకుండా ప్రధాన మురుగు కాలువ నిర్మాణానికి రూ.2 కోట్ల నిధులతో టెండర్లు పూర్తయిన గుత్తేదారు పనులు చేయడంలో జాప్యంతో నిలిచిపోయాయి.
ప్రారంభ దశలో గ్రంథాలయ భవన నిర్మాణ పనులు
ఉన్నతాధికారులకు నివేదించాం కల్వకుంట్ల విద్యాసాగర్రావు, కోరుట్ల ఎమ్మెల్యే
టెండర్ల జాప్యంతో పాటు, గుత్తేదారుల నిర్లక్ష్యంతో పనులు ప్రారంభం కాలేదు. ప్రారంభం కాని పనులు చేపట్టేలా ఉన్నతాధికారులకు నివేదించాం. తొందరలోనే అనుమతి వస్తుందని పనులు ప్రారంభానికి చొరవ చూపుతాం.
రెండో విడత పనులు
* గ్రంథాలయ భవన నిర్మాణానికి రూ.50 లక్షలతో టెండర్లు పూర్తయిన పిల్లర్లకు గోతులు తీసి వదిలేశారు.
* వెంకటేశ్వర గుడి వద్ద మినీ మాస్లైట్, ఫౌంటేన్ ఏర్పాటుకు రూ.10లక్షలు కోరుట్ల పురపాలికల్లో రూ.9 కోట్ల పనులు ప్రారంభం కాకపోగా, మెట్పల్లి పురపాలికలో దాదాపుగా రూ.5 కోట్ల పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చేంత వరకూ పనులు ప్రారంభించవద్దని బల్ధియాలకు పురపాలకశాఖ ఆదేశాలు జారీ అయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు