ఉబికివస్తున్న నీరు.. వరి వేయకపోతే కన్నీరు
భూగర్భజలాలు ఉబికి వస్తున్న తరుణంలో వరిపంట వేయవద్దంటూ ప్రభుత్వం ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. కాళేశ్వర జలాలకు తోడు పుష్కలంగా వర్షాలు కురవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా
జగిత్యాల జిల్లా రైతుల్లో ఆందోళన
ఈటీవీ, కరీంనగర్-సారంగాపూర్, న్యూస్టుడే
బీర్పూర్లో వ్యవసాయ బావుల్లో ఉబికివచ్చిన నీరు
భూగర్భజలాలు ఉబికి వస్తున్న తరుణంలో వరిపంట వేయవద్దంటూ ప్రభుత్వం ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. కాళేశ్వర జలాలకు తోడు పుష్కలంగా వర్షాలు కురవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బావుల్లో నీరు పుష్కలంగా కనిపిస్తోంది. గతంలో విద్యుత్తు నీటి కొరత ఉన్నప్పుడే వరి పంట వేసేవాళ్లమని ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని వాపోతున్నారు. గతేడాదితో పోలిస్తే పెద్దపల్లి జిల్లాలో మినహా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. దీంతో నీరు అందుబాటులో ఉన్నా వరిపంట వేయవద్దంటే ఏమి చేయాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో బావుల్లో నీరు చేతితో ముంచుకొనే విధంగా నీటి మట్టం పెరిగింది. గతంలో అయిదారు మీటర్ల లోతులో నీరు కాస్త ఇప్పుడు చేతికి అంది వచ్చింది. అటు బావుల్లోనే కాకుండా పొలాలు సైతం నీటికారణంగా బురదమయంగానే ఉన్నాయి. నీరు అందుబాటులో లేనప్పుడు ఆరుతడి పంటలు వేసుకున్నా కొంత బాగుంటుంది. కానీ ఇప్పుడు ఆరుతడి పంటలు ఎలా వేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని అంటున్నారు. ప్రస్తుతం వరి పంట కోత దశలో ఉన్నా నీళ్లతో బురదమయంగా ఉండటంతో యంత్రాలు కోతలు చేపట్టలేని స్థితిలో ఉన్నాయని అందువల్లనే కూలీలతో పంటలు కోయిస్తున్నామంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో వరి పంటకు బదులు ఇతర పంటలు ఎలా వేయగలమని ప్రశ్నిస్తున్నారు..
ప్రత్యామ్నాయం చూపకపోతే ఉరే గతి -చిన్నమల్లయ్య, రైతు బీర్పూర్
చెరువుల నుంచి నీళ్లు ఇవ్వకపోయినా వర్షపు నీటితోనే ఈసారి మేము వరి పండించుకున్నాం. పొలాలు బావుల్లో నీరు తగ్గలేదు. ఇప్పుడు ఏ పంట వేయలేని పరిస్థితి ఉంది. నువ్వులు, ఆముదాలు, పొద్దుతిరుగుడు ఏ పంట కూడా ఈ పొలాల్లో వేయలేం. పంటలు కాకుండా ఏ పంట వేసుకోవాలో ప్రభుత్వమే ఆలోచన చేయాలి. వరి పంట వేయొద్దని చెప్పి ప్రత్యామ్నాయం చూపెట్టకపోతే మాత్రం ఉరి వేసుకొనే పరిస్థితి ఉంటుంది. చెరువులు కుంటలు కట్టించిందే పంటలు పండించుకోవడానికి.. ఇప్పుడు వద్దంటే పొలాలను బీళ్లుగా వదిలేయమంటారా ఆలోచించుకొని చెప్పాలి. ఇప్పుడు పంట వేయకపోతే మా పరిస్థితి ఏంటి మా పిల్లల పరిస్థితి ఏమి కావాలో ప్రభుత్వమే చెప్పాలి.
గతేడాది కంటే ఈ సంవత్సరం వర్షాలు అధికం -నర్సయ్య, రైతు బీర్పూర్
గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి. ఈ సంవత్సరం అసలు బోర్లు వాడటం కానీ కాల్వ నీళ్లు వాడటం కానీ జరగలేదు. వానాకాలం పండించిన పంట చాలావరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నాయి. ఇంకా చాలా చోట్ల పొలాలు పచ్చిగా ఉండటంతో కొన్నిచోట్ల కోతలు మొదలు పెట్టలేదు. మన బావుల్లో ఈసారి నీళ్లు బాగున్నాయి కాబట్టి ఈసారి కూడా వరిపంట వేసుకోవాలన్నదే రైతుల ఆలోచన. ఏళ్ల కొద్ది వరి పంట పండించడం వల్ల నేల కూడా వరికే అనుకూలంగా మారింది. ఇప్పటివరకు పండిన ధాన్యం ఇంకా కల్లాలోనే ఉంది. మళ్లీ వరి వేయవద్దంటే మేము ఏ పంట వేయాలి. మేము ఎలా బతకాలో ప్రభుత్వమే సూచించాలి.
వానాకాలం యాసంగి ఏదైనా మాకు వరే దిక్కు -అజ్మీరా నర్సింహ నాయక్, రైతు బీర్పూర్
మా పొలాల్లో వానాకాలమైనా యాసంగి అయినా పండించే ఏకైక పంట వరి మాత్రమే. మొదటి నుంచి ఆ పంటనే వేస్తున్నాం. కందులు, పెసర్లు ఏ పంట వేసినా ఇప్పడు పంట పురుగు తినేస్తుంది. ఆ పంట వేస్తే కనీసం పెట్టుబడి కూడా మిగలదు. కష్టమైనా నష్టమైనా మేమంతా వరి పంటకే అలవాటు పడ్డాం. ఇంతకు అనుకున్నంత మేర నీళ్లు లేకపోయినా వరి పంటను పండించుకున్నాం. ఇప్పుడు చేతిలో ముంచుకొనే విధంగా బావిలో నుంచి నీళ్లు పైకి ఉబికి వస్తున్నాయి. మోటార్లు పెట్టకపోయినా పొలాల్లో ప్రవహిస్తున్నాయి. కానీ వరి పంట మాత్రం వేయవద్దంటే ఏమి చేయాలో అర్ధం కావడం లేదు. ఒక వైపు పండించిన పంట కొనకపోవడం మరోవైపు మళ్లీ పంట వేయవద్దనడంతో పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM