పల్లె లోగిలి.. వెలుగుల రవళి
సంక్రాంతి.. అనగానే పల్లె వాతావరణమే స్ఫురిస్తుంది. పంటలు చేతికొచ్చే సమయంలో అన్నదాత ఆనందంగా జరుపుకునే పండుగకు తెలుగు లోగిళ్లలో ప్రత్యేకత ఉంది. మూడు రోజుల పాటు ముచ్చటగా నిర్వహించే వేడుకకు పట్టణాలన్నీ పల్లె బాట పడతాయి. పిండి వంటలనే కాకుండా చక్కటి వినోదాన్ని ఆస్వాదించడం కూడా సంక్రాంతికే కుదురుతుంది
● జిల్లాలో సంక్రాంతి పండుగ ప్రత్యేకతలెన్నో
న్యూస్టుడే, పెద్దపల్లి
సంక్రాంతి.. అనగానే పల్లె వాతావరణమే స్ఫురిస్తుంది. పంటలు చేతికొచ్చే సమయంలో అన్నదాత ఆనందంగా జరుపుకునే పండుగకు తెలుగు లోగిళ్లలో ప్రత్యేకత ఉంది. మూడు రోజుల పాటు ముచ్చటగా నిర్వహించే వేడుకకు పట్టణాలన్నీ పల్లె బాట పడతాయి. పిండి వంటలనే కాకుండా చక్కటి వినోదాన్ని ఆస్వాదించడం కూడా సంక్రాంతికే కుదురుతుంది. ఇతర పండుగల్లాగా తిథి, నక్షత్రాలతో సంబంధం లేకుండా ఏటా దాదాపు ఒకే రోజు వచ్చే పర్వదినాన ఒక్కో ఊరిలో ఒక్కో విధంగా జరుపుకున్నా సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవడమే ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ ప్రత్యేకతల సమాహారమే ఇది.
ఆ పల్లెలు పందేలకు ప్రత్యేకం
సంక్రాంతి అంటేనే కోడి పందేలు గుర్తుకొస్తాయి. ఈ సంస్కృతి కోస్తా ప్రాంతంలోనే ఉన్నా జిల్లాలోని పలు గ్రామాల్లోనూ పోటీలు నిర్వహిస్తుంటారు. గెలుపోటములు సహజమైనా, కొన్ని సందర్భాల్లో గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఉదంతాలున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఇటీవల కొంత తగ్గినా కోడి పందేలు మాత్రం కొనసాగుతున్నాయి. జిల్లాలో కోడి పందేలకు ఎలిగేడు మండలం శివపల్లి ప్రసిద్ధి గాంచింది. గతంలో ఇక్కడికి ఇతర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పోటీదారులు వచ్చేవారు. రెండేళ్లుగా పోలీసులు గట్టి నిఘా వేయడంతో ఇక్కడి వారే ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. శివపల్లితో పాటు పెద్దపల్లి మండలం రాగినేడు, కనగర్తి గ్రామాలకు చెందిన పలువురు ఇప్పటికే మహారాష్ట్రకు వెళ్లిపోయారు. కోడి పందేలపై మహారాష్ట్రలో నిషేధం లేకపోవడంతో ఇక్కడి నుంచి ఆసక్తి కలిగిన వారంతా వెళ్తున్నారు.
పెద్దమ్మకు బోనాల మొక్కులు
సంక్రాంతి సందర్భంగా స్థానిక ఆలయాల్లో గ్రామదేవతలకు పూజలు నిర్వహించే సంస్కృతి పలు గ్రామాల్లో ఉంది. మంథని మండలం గుంజపడుగు, బోయపేట గ్రామాల్లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏటా సంక్రాంతికి పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తారు. కాల్వశ్రీరాంపూర్లో బోనాలతో ఆలయానికి వెళ్తున్న మహిళల దృశ్యమే ఇది.
పశువులను పూజించే కాట్రేవుల వేడుక
వ్యవసాయంలో నిరంతరం శ్రమించే రైతుకు చేదోడువాదోడుగా నిలిచే పశువులను పూజిస్తారు. పశువులను ప్రత్యేకంగా అలంకరించి వాటిని గ్రామ చావడి లేదా ఊరి చివరలో కట్టిన తోరణం కిందుగా పంపించే వేడుకను కాట్రేవుల పండుగగా పిలుస్తారు. ఒకప్పుడు జిల్లాలోని ప్రతి గ్రామంలో ఈ వేడుక నిర్వహించేవారు. యాంత్రీకరణ ప్రభావంతో పశు సంపద తగ్గడంతో ప్రస్తుతం కొన్ని గ్రామాలకే పరిమితమైంది. పెద్దపల్లి మండలం రాఘవాపూర్, సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి, భూపతిపూర్ గ్రామాల్లో కాట్రేవుల పండుగను ఘనంగా జరుపుకుంటారు. కొందరు యువ రైతులు పల్లెల్లో ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహించి, పండుగకు నిండుదనాన్ని తీసుకొస్తున్నారు.
పతంగుల సందడి..
పండుగ సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పిల్లలు గాలిపటాలను ఎగురవేస్తూ కేరింతలు కొడుతుంటారు. గోదావరిఖనిలో సింగరేణి, పెద్దపల్లిలో ఛత్రపతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఏటా గాలిపటాలు ఎగురవేసే పోటీలు నిర్వహిస్తుంటారు. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో పోటీలు నిర్వహించడం లేదు. కాగా పోటీలతో సంబంధం లేకుండా పెద్దపల్లిలోని ఎల్లమ్మ చెరువు ప్రాంతంలో పండుగ సెలవుల్లో పిల్లలు గాలిపటాలు ఎగురవేయడం ఆనవాయితీగా మారింది.
భోగి పండ్లు.. గౌరీ నోములు
మూడు రోజుల పండుగలో మొదటి రోజు భోగి. పిల్లలపై భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తుంటారు. పెద్దలు వ్రతాలు, బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తారు. మహిళలు కలియుగ వైకుంఠం, లాలీగౌరమ్మ, రేపల్లెవాడ, రుక్మిణీకల్యాణం, నవదుర్గ, చుక్కల పర్వతాలు, చాటల వాయినం, గుంటల వాయినం, పంచవట్టి, గజ్జలగౌరీ, గవ్వలగౌరీ, గాజులగౌరీ తదితర నోములు ఆచరిస్తారు. సామూహికంగా నిర్వహించే నోములను ఆలయాలు, సామాజిక భవనాల్లో నిర్వహిస్తారు. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, గోదావరిఖని పట్టణాల్లోని కొన్ని సామాజికవర్గాలు ఈ ప్రత్యేకమైన పూజలు, నోములు ఆచరిస్తున్నారు. ఇళ్ల ముందు అందమైన రంగవల్లికలను అలంకరించే మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా