logo

అతిథిగృహం ఠాణా ప్రారంభానికి సిద్ధం చేయాలి

గోదావరిఖనిలో నిర్మించిన పోలీసు అతిథిగృహం, ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌ భవనాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కోలేటి దామోదర్‌ సూచించారు.

Published : 15 Jan 2022 03:38 IST

భవనాన్ని పరిశీలిస్తున్న పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దామోదర్‌, సీపీ చంద్రశేఖర్‌రెడ్డి

గోదావరిఖని, న్యూస్‌టుడే : గోదావరిఖనిలో నిర్మించిన పోలీసు అతిథిగృహం, ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌ భవనాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కోలేటి దామోదర్‌ సూచించారు. పోలీసు కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఆయా భవనాలను పరిశీలించారు. పెండింగ్‌ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఏసీపీ గిరిప్రసాద్‌, ఒకటో పట్టణ సీఐలు రమేశ్‌బాబు, రాజ్‌కుమార్‌, శ్రీనివాస్‌, ఈఈ విశ్వనాథం, డీఈ సాయిచంద్‌, ఏఈ వినయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని