రైలు పట్టాల పద్మవ్యూహం
రైలు పట్టాలు ఆ పల్లెకు పద్మవ్యూహంలా మారాయి.. మొదట ఒకటిగా ఉన్న గ్రామాన్ని రెండు ముక్కలు చేశాయి. ఇప్పుడు రైలు వ్యాగన్ల కింది నుంచి పట్టాలు దాటి వెళ్లేలా మార్చాయి. రైలు మార్గాలు, గూడ్స్ రైళ్ల రాకపోకలు, నిలుపుదలతో ఆ గ్రామ
రైల్వే లైన్ల మధ్య బందీ
బద్రిపల్లి కష్టాలు తీరే దారేది?
న్యూస్టుడే, రామగుండం
పట్టాలపై నిలిచిన గూడ్స్ రైలు; ప్రత్యామ్నాయ సీసీ రోడ్డుపై 3వ ట్రాక్ నిర్మాణం
రైలు పట్టాలు ఆ పల్లెకు పద్మవ్యూహంలా మారాయి.. మొదట ఒకటిగా ఉన్న గ్రామాన్ని రెండు ముక్కలు చేశాయి. ఇప్పుడు రైలు వ్యాగన్ల కింది నుంచి పట్టాలు దాటి వెళ్లేలా మార్చాయి. రైలు మార్గాలు, గూడ్స్ రైళ్ల రాకపోకలు, నిలుపుదలతో ఆ గ్రామ రహదారి పూర్తిగా మూతపడింది. ప్రత్యామ్నాయ రహదారి నిర్మించినా.. ఇప్పుడు దానిపైనే 3వ రైలు మార్గం నిర్మిస్తుండటంతో ఆ గ్రామం పద్మవ్యూహంలో చిక్కింది. రహదారి మీదుగా రైల్వే ట్రాక్లు ఉండటం, వీటిపై నిత్యం గంటలకొద్ది గూడ్స్ రైళ్లు ఆగడంతో చేసేదిలేక రైలు వ్యాగన్ల కింది నుంచి పట్టాలు దాటి రాకపోకలు సాగిస్తూ ప్రమాదాల బారినపడ్తున్నారు. ఇప్పటికే పలువురు మరణించగా మరికొందరు క్షతగాత్రులయ్యారు. నిత్యం ప్రాణభయంతో తమ జీవనం పద్మవ్యూహంలా మారిందని అంతర్గాం మండలం కుందనపల్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన బద్రిపల్లి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు మరోచోట పునరావాసం కల్పించి రక్షణ కల్పించాలని రైల్వే, పరిశ్రమల యాజమాన్యాలు, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
బడికి వెళ్లి రావాలంటే ఇలా పట్టాలు దాటాల్సిందే..
ఒక ట్రాక్తో మొదలై..
50 ఏళ్ల క్రితం సింగరేణి, బీ-థర్మల్, ఎఫ్సీఐలకు బొగ్గు రవాణా కోసం రామగుండం రైల్వేస్టేషన్ నుంచి గోదావరిఖని వరకు రైలు మార్గాన్ని బద్రిపల్లి ప్రధాన రహదారి మీదుగా ఏర్పాటు చేశారు. గ్రామం మధ్య నుంచి ఈ రైలు మార్గం నిర్మించారు. ఒక ట్రాక్ కావడం, బొగ్గు రవాణా గూడ్స్ రైళ్లు ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తుండటంతో రహదారిపై రాకపోకలకు గ్రామస్థులకు ఇబ్బంది ఉండేది కాదు. ఎన్టీపీసీ విద్యుత్తు కేంద్రం కోసం 2వ ట్రాక్ను రైల్వే నిర్మించింది. రైళ్ల రాకపోకల సంఖ్య పెరిగింది. ఈ రెండు మార్గాల్లో నడిచే గూడ్స్ రైళ్లను రామగుండం రైల్వేస్టేషన్లోని యార్డు మీదుగా గ్రాండ్ట్రంక్ ప్రధాన ట్రాక్లకు అనుసంధానం చేసి నడిపించేవారు. బద్రిపల్లి వద్దే సిగ్నల్ పాయింట్ ఉండగా సిగ్నల్ ఇవ్వని సమయంలో ట్రాక్పై రైలు నిలిపేవారు. యార్డు మీదుగా ఎగువ, దిగువలకు గూడ్స్ రైళ్లను నడిపేందుకు ఆలస్యం అవుతుండటంతో అయిదేళ్ల క్రితం బద్రిపల్లి నుంచి కుందనపల్లి రైల్వేగేట్ మీదుగా ప్రధాన గ్రాండ్ట్రంక్ మార్గానికి అనుసంధాన మార్గాన్ని నిర్మించారు. ఇక్కడి ఇంధన నిల్వల కేంద్రాలకు ఇంధనాలు సరఫరా చేసే గూడ్స్ రైళ్లను అప్పుడప్పుడు బద్రిపల్లి సైడింగ్ మార్గాల్లో నిలపడంతో ఇది మరో యార్డుగా మారింది. రహదారిపై రైళ్ల నిలుపుదల పెరగడంతో లెవల్ క్రాసింగ్ గేట్ ఏర్పాటు చేశారు.
ఇప్పుడు.. 3వ ట్రాక్ నిర్మాణం
సింగరేణి, ఎన్టీపీసీల బొగ్గుతోపాటు తాజాగా ఆర్ఎఫ్సీఎల్ యూరియా రవాణా చేపడ్తుండటంతో గూడ్స్ రైళ్ల సంఖ్య, రాకపోకలు పెరిగాయి. రామగుండంలో ఒప్పుడు సరకు రవాణాతో రోజుకు రూ.కోటిన్నర ఆదాయం వచ్చేది. నేడు ఆ ఆదాయం సుమారు రూ.4 కోట్లకు పెరిగింది. ద.మ.రై. సికింద్రాబాద్ డివిజన్లో అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్న స్టేషన్ రామగుండం.. 6 నెలల క్రితం రామగుండం నుంచి గోదావరిఖని వరకు 3వ ట్రాక్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇందుకోసం బద్రిపల్లి వద్ద ఎన్టీపీసీ నిర్మించిన సీసీ రోడ్డును పూడ్చారు. దానిపైనే చేపడ్తున్న ట్రాక్ పనులు పూర్తికావస్తున్నాయి. రోజూ 10 నుంచి 12 గంటల పాటు రైలును ట్రాక్పై నిలపడంతో రహదారి దాదాపు పూర్తిగా మూతపడింది. రైల్వేతోపాటు సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యాలు తమ గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జిల్లా అదనపు పాలనాధికారి, రామగుండం రైల్వే ప్రాంతీయాధికారులను గ్రామస్థులు ఇటీవల కోరారు.
సురక్షిత ప్రాంతానికి తరలించాలి
-ఒడ్నాల రాములు, బద్రిపల్లి
గ్రామానికి ఒక వైపు రైలు మార్గాలు, 2వ వైపు బీపీఎల్ ప్రాజెక్టు ప్రహరీ, 3వ వైపు ఎన్టీపీసీ బూడిద సరఫరా పైపులు, 4వ వైపు మల్యాలపల్లి 2 చెరువులు ఉండటంతో అన్నివైపులా దారులు మూసుకపోయాయి. ప్రత్యామ్నాయ దారి ఏర్పాటుకు అవకాశం లేదు. రైల్వే భూగర్భ వంతెన నిర్మించడం లేదు. సురక్షిత ప్రాంతానికి గ్రామాన్ని తరలించడమే ఏకైక మార్గం. పునరావాసం కల్పించాలి.
పిల్లలను పట్టాలు దాటిస్తున్నాం
-గంధం సునీత, బద్రిపల్లి
పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పిల్లలను జాగ్రత్తగా వ్యాగన్ల కింది నుంచి పట్టాలు దాటిస్తూ బడులకు పంపిస్తున్నాం. దాటించే సమయంలో ఒక్కసారిగా రైలు కదిలితే ఇక అంతే.. పెద్దలు ఎలాగోలా బయటపడవచ్చు. ఇక్కడి ట్రాక్లు పిల్లలకు, మాకు ప్రాణసంకటంగా మారాయి. గతంలో స్కూల్ బస్సు గ్రామానికి వచ్చేది. రైళ్ల నిలుపుదలతో ఇప్పుడు రావడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్