అందమైన బాల్యం.. రక్షించడమే ధ్యేయం
బాలకార్మికులుగా మారి అష్టకష్టాలు పడుతున్న చిన్నారులకు మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు ఇంటిగ్రేటెడ్ ఛైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్(ఐసీపీఎస్) అధికారులు. అందమైన బాల్యాన్ని కష్టాలబాట పట్టిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు.
ఆపరేషన్ స్మైల్తో పనిలో నుంచి బాలలకు విముక్తి
సిరిసిల్ల(విద్యానగర్), న్యూస్టుడే
బడిబయట బాలలను గుర్తిస్తున్న అధికారులు
బాలకార్మికులుగా మారి అష్టకష్టాలు పడుతున్న చిన్నారులకు మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు ఇంటిగ్రేటెడ్ ఛైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్(ఐసీపీఎస్) అధికారులు. అందమైన బాల్యాన్ని కష్టాలబాట పట్టిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. బాలకార్మికులుగా మారిన చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు చిందిస్తున్నారు.
బాలలు, అనాథ పిల్లలు, బాలకార్మికులను గుర్తించేందుకు ప్రభుత్వం 2015లో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం జనవరి 7వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆపరేషన్ స్మైల్లో భాగంగా బడి బయట బాలలను గుర్తిస్తున్నారు. జిల్లాలో ఈ నెల 7వ తేదీన కార్యక్రమం ప్రారంభమవగా ఐసీపీఎస్ అధికారులు, పోలీస్శాఖ ఇతర శాఖల సమన్వయంతో ఇప్పటివరకు 14 మంది (వేములవాడ 9, సిరిసిల్ల 5) బాలకార్మికులను గుర్తించారు. ఇసుక బట్టీలు, హోటళ్లు, మెకానిక్ దుకాణాల్లో వీరిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో కొందరు, ఇతరుల స్వార్థానికి కొందరు బాలలు కూలీలుగా మారుతున్నారు. కొందరు ట్రాఫికింగ్ బాధితులుగా మారుతున్నారు. ఆపరేషన్ స్మైల్లో భాగంగా జిల్లాలో 2017లో 65 మంది, 2018లో 50, 2019లో 31, 2020లో 40, 2021లో 255 మందిని విముక్తి చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఇక్కడ పనిచేస్తున్న బాలకార్మికులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కరోనా కారణంగా బాలకార్మికుల సంఖ్య పెరిగినట్లు అధికారులు తెలిపారు. మిస్సింగ్, పారిపోయిన చిన్నారులు, బలకార్మికులు, వీధి బాలలు, ఛైల్డ్ ట్రాఫికింగ్కి గురైన బాలలు, హింసకు గురైన చిన్నారులను విముక్తి చేస్తున్నారు. 0 నుంచి 14 సంవత్సరాలలోపు బాలలు ఏ పనిలో ఉన్నా పనిచేయించుకునేవారు శిక్షార్హులని తెలిపారు. 14 నుంచి 18 మధ్య బాలలు ఇటుక బట్టీలు, టపాసుల తయారీలాంటి భయంకరమైన పనిలో ఉంటే బాధ్యులు శిక్షార్హులు. రైస్మిల్, ఇటుక బట్టీలు, ఫ్యాక్టరీలు, చిన్న పరిశ్రమలు, కాటన్ మిల్లు, హోటళ్లు, వెల్డిండ్ దుకాణాలు, రెస్టారెంట్లు, దాబాలు, కనస్ట్రక్షన్ సైటÆ్లు, టైర్ దుకాణాలు, స్వీట్ దుకాణాలు, షాపింగ్ మాల్, బస్స్టేషన్లు, ట్రాఫిక్ జంక్షన్, ఫుట్పాత్, మెకానిక్ దుకాణాలు, భిక్షాటన చేసే ప్రాంతాల్లో బాలలను గుర్తించి విముక్తి చేస్తున్నారు. ముందుగా బాలలను గుర్తిస్తారు. ఆ తర్వాత బాధ్యులను మందలిస్తారు. అవసరమైతే ఛైల్డ్ లేబర్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తారు. బాధిత బాలలకు పరిహారం, లాభాలను చేకూరేలా చూస్తారు. తల్లిదండ్రులకు, బాలలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. దగ్గరలో ఉన్న పాఠశాలలను చేర్పిస్తారు.
ఒకేచోట ఎక్కువ
ఉంటే వారందరినీ విముక్తి చేసి అక్కడే వర్క్సైటÆ్ స్కూల్ను ఏర్పాటు చేస్తారు. వారికి మధ్యాహ్న భోజనం అందేలా చర్యలు తీసుకుంటారు. చిన్నారుల వివరాలను ్మ(‘్ప్ర.‘్ణ్ణ.్ణ్న్ర.i- వెబ్పోర్టల్లో నమోదుచేసి వారి సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. సీడబ్ల్సూసీ కమిటీ ముందు హాజరుపరుస్తారు. అనాథలు, ఎవరూ లేనివారు హింసకు గురైతే సిరిసిల్లలోని రంగినేని ట్రస్టులో ఏర్పాటు చేసిన ఛైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్ (సీసీఐ)లో చేర్పిస్తారు.
పాఠశాలల్లో నమోదు చేస్తున్నాం
-అంజయ్య, సీడబ్ల్యూసీ ఛైర్మన్
ఆపరేషన్ స్మైల్లో భాగంగా బడిబయటి బాలలను గుర్తిస్తున్నాం. పాఠశాలల్లో నమోదు చేస్తున్నాం. ఎక్కువగా ఇటుక బట్టీలలో బాలలు పనిచేస్తున్నట్లు గుర్తించాం. ఇతర రాష్ట్రాల బాలల కూలీలుగా పనిచేస్తున్నారు. బాలల అందమైన బాల్యాన్ని సంరక్షిచడమే ఆపరేషన్ స్మైల్ లక్ష్యం. వేములవాడలో చాలావరకు భిక్షాటన చేస్తున్న బాలలను గుర్తించి బడిలో చేర్పించాం. కొవిడ్ కారణంగా అనాథలు, సెమీ ఆర్ఫన్లు డ్రాపౌట్లుగా ఉన్నట్లు గుర్తించాం. తగు చర్యలు చేపడుతున్నాం. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్నాం.
సద్వినియోగం చేసుకోవాలి
-లక్ష్మీరాజం, జిల్లా సంక్షేమశాఖ అధికారి
బాలలు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఎవరైనా తమ ప్రాంతంలో బాలకార్మికులను గుర్తించినా ఛైల్డ్ లైన్-1098ను సద్వినియోగం చేసుకోవాలి. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల సంరక్షణ అందరి బాధ్యత. తప్పిపోయిన పిల్లలను వారి స్వస్థాలకు పంపించడం, అనాథలు, భిక్షాటన చేస్తున్నవారిని, నిర్లక్ష్యానికి గురైన బాలలను గుర్తించి వారికి ఆదరణ కల్పించడం, సంరక్షించడమే ఆపరేషన్ స్మైల్ లక్ష్యం. బడి బయటి బాలలను గుర్తించి సీడబ్లూసీ ముందు ప్రవేశపెట్టి సంరక్షణకు చర్యలు చేపడుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూసేకరణలో జాప్యం
[ 28-03-2024]
భూసేకరణలో జాప్యమే జాతీయ రహదారుల విస్తరణకు శాపంగా మారుతోంది. జిల్లాలో ప్రధానంగా జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిగా మార్చి దశాబ్దం కావస్తున్నా.. నిర్మాణం మొదలు కావటం లేదు -
నత్తనడకన నిర్మాణాలు
[ 28-03-2024]
వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం పల్లెదవాఖానాలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర(సబ్సెంటర్ల)ను పల్లె దవాఖానాలుగా మార్చారు -
నిధులు వెచ్చించి.. పనులు వదిలేసి
[ 28-03-2024]
పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఆధునిక సాంకేతికను జోడించి పెద్ద నగరాలకు దీటుగా పోటీ పడేందుకు ప్రణాళికలు చేసిన నగరపాలిక.. ఆ విధానం అమలులో వెనుకబడింది -
తాగునీటి వృథా వద్దు : కలెక్టర్
[ 28-03-2024]
అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
కాంగ్రెస్ నిజామాబాద్ లోక్సభ స్థానం టికెట్ జీవన్రెడ్డికే దక్కింది. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది -
తొలిమెట్టు నోడల్ అధికారులకు భత్యం
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రత్యేక బోధన పద్ధతులతో కొనసాగుతున్న ఈ కార్యక్రమ పర్యవేక్షణకు మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 28-03-2024]
వాతావరణ సమాచారాన్ని ప్రతిఒక్కరి దైనందిన కార్యకలాపాల్లో భాగం చేయాలనే ఉద్దేశంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇటీవల ‘పంచాయత్ మౌసం సేవా’ మొబైల్ యాప్ విడుదల చేసింది. -
పఠనాలయం సద్వినియోగం... కల సాకారం
[ 28-03-2024]
గ్రంథాలయ పుస్తకాలతోనే ఏకకాలంలో రెండు ఉద్యోగాలు సాధించగలిగాను. తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ నిర్వహించిన ఫలితాల్లో పీజీటీ సాంఘికశాస్త్రం, జూనియర్ కళాశాలలో పౌరశాస్త్రం లెక్చరర్గా ఉద్యోగాలకు ఎంపికయ్యాను -
పంచాయతీల ఖజానా ఖాళీ
[ 28-03-2024]
ఓవైపు ఖజానా ఖాళీ, మరోవైపు సమస్యలు పంచాయతీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జమయ్యే నిధులకు మించిన వ్యయం చేయడంతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఓటు నమోదుకు ప్రత్యేక సాధారణ సెలవు
[ 28-03-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య