భగీరథ.. ఎన్నాళ్లీ వ్యథ
చొప్పదండి పురపాలక సంఘం పరిధిలో మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో పట్టణంలోని పలు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని 6వేల కుటుంబాలకు ఇంటింటికి మిషన్ భగీరథలో భాగంగా నల్లాలు బిగించకపోవడంతో
తరచూ అంతరాయాలతో నీటిసరఫరా నిలిపివేత
చొప్పదండి, న్యూస్టుడే
చొప్పదండిలో ఏర్పాటు చేసిన నల్లాలు
చొప్పదండి పురపాలక సంఘం పరిధిలో మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో పట్టణంలోని పలు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని 6వేల కుటుంబాలకు ఇంటింటికి మిషన్ భగీరథలో భాగంగా నల్లాలు బిగించకపోవడంతో పూర్తిస్థాయిలో మంచినీటిని పొందలేకపోతున్నారు. పట్టణంలో పాత ట్యాంకులతో పాటు అవసరమైన చోట నూతన ట్యాంకుల నిర్మాణం చేసి సుమారు 4,469 మిషన్ భగీరథ కనెక్షన్లను ఏర్పాటు చేశారు. ఇంకా సుమారు 1500 వరకు కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. కొన్ని ప్రాంతాల్లో నల్లాలు పూర్తిస్థాయిలో బిగించలేదు. ఇంకా సుమారు 18కి.మీ మేర నూతన లైన్లు వేయాల్సి ఉంది. పట్టణంలో పాతవి మూడు ట్యాంకులు ఉండగా 5ట్యాంకులు నూతనంగా నిర్మించారు. పట్టణానికి ప్రతీరోజు 20లక్షల లీటర్ల నీరు అవసరముండగా ప్రస్తుతం కేవలం 9.20లక్షల లీటర్లు మాత్రమే సరఫరా అవుతుంది. మరో 11లక్షల నీటి సరఫరాకు గాను సుమారు ఏడు ట్యాంకుల వరకు నిర్మాణం జరగాల్సి ఉంది.
దూరాభారంతో తక్కువగా నీరు
చొప్పదండికి అగ్రహారం నుంచి సుమారు 70కి.మీ నుంచి మిషన్భగీరథ నీరు సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి చివరికి వచ్చేది చొప్పదండే కావడంతో నీరు చాలా తక్కువ వేగంతో కొద్దిసేపు మాత్రమే వస్తుంది. ఎల్ఎండీ నుంచి వచ్చే లైన్ నగునూరు వరకు సరఫరా జరుగుతుంది. కనీసం ఈ సరఫరాను చొప్పదండి వరకు పెంచితే బాగుంటుందని ఈ దిశగా అధికారులు ఆలోచన చేయాలని ప్రజలు కోరుతున్నారు. అగ్రహారం నుంచి చొప్పదండికి సుమారు 70కి.మీ ఉండటంతో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేమార్గంలో తరుచు పైపులైన్లు ధ్వంసం అవుతుండటంతో నీటి సరఫరా నిలిచిపోతుంది. గత 15 రోజులుగా మూడు ప్రాంతాల్లో పైపులైన్ ధ్వంసంతో పాటు పైపులైన్ సర్వీసింగ్ పేరుతో నీటి సరఫరా నిలిచిపోయింది. కేవలం ఒకటి,రెండురోజుల్లో మాత్రమే నీటి సరఫరా జరిగింది. పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న పాతబావిల నుంచి నీటి సరఫరా చేస్తున్నారు.
ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి
- లలిత, చొప్పదండి
పట్టణంలో నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి. అప్పుడప్పుడు నీరు మురికిగా వస్తుంది. నీరు తాగడానికి అనువుగా లేకుండాపోతుంది. దీంతో మళ్లీ శుద్ధజలం కొనుగోలు చేయాల్సివస్తుంది. శుద్ధిచేసిన నీటిని సరఫరా చేస్తే అందరికి ఉపయోగకరంగా ఉంటుంది.
నీటిఎద్దడి రాకుండా చర్యలు
- రాజేశం, ఏఈ పురపాలక సంఘం
పట్టణంలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆదేశాల మేరకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే అన్ని కాలనీల్లో అవసరమైన చోట నిర్మాణాలకు సంబంధించిన వివరాలు సేకరించాం. పూర్తి నివేదికతో ప్రణాళికలు సిద్ధం చేసి మంజూరు కాగానే నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)