నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దడమే లక్ష్యం
రాష్ట్రంలో కరీంనగర్ నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం బి.ఆర్ అంబేడ్కర్ స్టేడియంలో రూ.2.80 కోట్లతో
ఇండోర్ స్టేడియం, స్కేటింగ్ రింక్ను ప్రారంభించిన మంత్రి గంగుల
స్కేటింగ్ క్రీడాకారులతో మంత్రి కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, అతిథులు
కరీంనగర్ క్రీడావిభాగం, న్యూస్టుడే: రాష్ట్రంలో కరీంనగర్ నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం బి.ఆర్ అంబేడ్కర్ స్టేడియంలో రూ.2.80 కోట్లతో ఆధునికీకరించిన ఇండోర్ స్టేడియం, స్కేటింగ్ రింక్, బాస్కెట్ కోర్టును రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి ప్రారంభించారు. అనంతరం రాంనగర్లోని యువజన సమాచార కేంద్రంలో నిర్మించిన నిరుద్యోగ వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణలో కరీంనగర్ నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. ప్రజలు కోరుకున్న విధంగా, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో కరీంనగర్ పట్టణంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. క్రీడలు భావితరానికి బంగారు బాటలు వేయాలనే ఉద్దేశంతో కరీంనగర్ స్టేడియంలో రూ.8కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్, రూ.1.5కోట్లతో ఇండోర్ స్టేడియం ఆధునికీకరణ, రూ.30లక్షలతో స్కేటింగ్, రూ.30లక్షలతో బాస్కెట్బాల్ కోర్టు, రూ.21 కోట్లతో స్లేడియం ప్రాంగణం అభివృద్ధి పనులు చేపటినట్లు పేర్కొన్నారు. రూ.48లక్షలతో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం భవనాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం పెట్టుబడుల్లో తెలంగాణ మొదటి వరుసలో ఉందన్నారు. కార్యక్రమంలో మేయర్ సునీల్రావు, సుడా ఛైర్మన్ రామకృష్ణరావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి, జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, నగరపాలక సంస్థ కమిషనర్ ఇస్లావత్, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి రాజవీరు, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.మహిపాల్, ఉపాధ్యక్షుడు రమేష్రెడ్డి, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు కడారి రవి, లక్ష్మణ్, సంపత్రావు, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)