ముంపు ముప్పు తప్పేలా!
వర్షం పడితే చాలు.. నగర వీధులు జలమయమవుతున్నాయి. గతంలో నిర్మించిన డ్రైనేజీల సామర్థ్యం అంతంతా మాత్రంగానే ఉండగా.. పెరుగుతున్న నగర విస్తీర్ణంతో ముంపు సమస్య తీవ్రమైంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీరంతా కాల్వల గుండానే వస్తుండటంతో ఆ కాల్వలు నిండి రోడ్ల మీదికి ప్రవహిస్తుండటం, లోతట్టు ప్రాంతాలు నీట మునగడం సాధారణంగా మారింది. ఏళ్ల తరబడి ఈ సమస్య ఇలాగే ఉన్నా పరిష్కరించడం లేదనే నగరవాసుల విమర్శలను కట్టి పెట్టేలా స్మార్ట్సిటీలో శాశ్వత పరిష్కారం చేసేందుకు కసరత్తు ప్రారంభించారు.
వరదనీటి మళ్లింపునకు శాశ్వత పరిష్కారం
రూ.132.98 కోట్లతో ప్రధాన నాలాల విస్తరణ
న్యూస్టుడే, కరీంనగర్ కార్పొరేషన్
ఏటా వర్షాకాలంలో ముంపునకు గురవుతున్న జ్యోతినగర్ ప్రాంతం
వర్షం పడితే చాలు.. నగర వీధులు జలమయమవుతున్నాయి. గతంలో నిర్మించిన డ్రైనేజీల సామర్థ్యం అంతంతా మాత్రంగానే ఉండగా.. పెరుగుతున్న నగర విస్తీర్ణంతో ముంపు సమస్య తీవ్రమైంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీరంతా కాల్వల గుండానే వస్తుండటంతో ఆ కాల్వలు నిండి రోడ్ల మీదికి ప్రవహిస్తుండటం, లోతట్టు ప్రాంతాలు నీట మునగడం సాధారణంగా మారింది. ఏళ్ల తరబడి ఈ సమస్య ఇలాగే ఉన్నా పరిష్కరించడం లేదనే నగరవాసుల విమర్శలను కట్టి పెట్టేలా స్మార్ట్సిటీలో శాశ్వత పరిష్కారం చేసేందుకు కసరత్తు ప్రారంభించారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ప్రధానమైన నాలాల విస్తరణ, అభివృద్ధికి ముందడుగు పడింది. ఇటీవల జరిగిన స్మార్ట్సిటీ బోర్డు సమావేశంలో రూ.132.98 కోట్లతో వరదకాల్వలు నిర్మించేందుకు ఆమోదం లభించింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలోంచుకొని వీటిని నిర్మించేందుకు ప్రతిపాదనలు చేశారు. ఇప్పటికే ఏ ప్రాంతం నీట మునుగుతోంది. ఎక్కడ ఎంతమేర వరదనీరు వస్తుంది? నగర వ్యాప్తంగా వరద, మురుగునీరు పంపించేలా సర్వే నిర్వహించిన స్మార్ట్సిటీ కన్సల్టెన్సీ బృందం ఆ మేరకు డీపీఆర్లు తయారు చేసి టెండర్లు నిర్వహించేందుకు చకచకా అడుగులు వేస్తున్నారు.
వరదకాల్వలు సక్రమంగా లేక రోడ్డుపై నిలుస్తున్న నీరు
736 కిలోమీటర్లు
నగరంలో వరదకాల్వల నిర్మాణానికి ఐదు జోన్లుగా ఖరారు చేశారు. ఇందులో మొత్తం 736.3 కిలోమీటర్ల పొడవునా నాలాలు నిర్మించనున్నారు. వీటిని ప్రధాన, అంతర్గత కాల్వలుగా గుర్తించగా ప్రైమరీ, సెకండరీగా ప్రాధాన్యం ఇచ్చారు. లోతట్టు ప్రాంతాలు కూడా గుర్తించారు. జ్యోతినగర్, టెలిఫోన్ కాలనీ, సప్తగిరికాలనీ, శివనగర్, గణేశ్నగర్, భగత్నగర్, తిరుమల్నగర్, ఇందిరానగర్, ఆదర్శనగర్, ప్రవిష్ట ఏరియా నుంచి కిసాన్నగర్ వైపు ఉండేలా ప్రతిపాదించారు.
ఐదు జోన్లలో ప్రాంతాల వారీగా...
1. రేకుర్తి రోడ్డు, విద్యానగర్, పీఆండ్టీ కాలనీ, చైతన్యపురి, సంతోష్నగర్, భాగ్యనగర్, విద్యానగర్, జ్యోతినగర్, రాంనగర్, శివనగర్, సప్తగిరికాలనీ, శ్రీనగర్కాలనీ, మంకమ్మతోట, పద్మనగర్, ముకరంపుర, కశ్మీర్గడ్డ, భగత్నగర్, రాంచంద్రాపూర్కాలనీ, కట్టరాంపూర్, తిరుమల్నగర్, గణేశ్నగర్, బోయవాడ, మారుతీనగర్, షాషాబ్మహల్, లక్ష్మీనగర్, పోచమ్మవాడ, కోతిరాంపూర్ నుంచి మానేరు నది వరకు.
2. బ్యాంకుకాలనీ, సూర్యనగర్, వావిలాలపల్లి, ఆదర్శనగర్, క్రిస్టియన్కాలనీ, సాయినగర్, అజ్మత్పుర, ఉస్మాన్పుర, ఇస్లాంపుర, అశోక్నగర్, హౌసింగ్బోర్డుకాలనీ, కృష్ణనగర్, హుస్సేనీపుర, శ్రీపురంకాలనీ, సుభాష్నగర్, విజ్ఞాన్నగర్కాలనీ నుంచి మానేరు నది వరకు.
3. సరస్వతీనగర్, కిసాన్నగర్, జగ్జీవన్రావుకాలనీ మీదుగా సిటీజన్కాలనీ నుంచి మానేరు నది వరకు.
4. పార్ట్ రాంచంద్రాపూర్కాలనీ, కట్టరాంపూర్, పార్ట్ సప్తగిరికాలనీ, హనుమాన్నగర్, అలకాపురికాలనీ, పార్ట్ పోచమ్మవాడ మీదుగా ఎన్టీఆర్ విగ్రహం వరకు.
5. ఆర్టీసీ కాలనీ, సాలెహ్నగర్, పార్ట్ బ్యాంకుకాలనీ, హిందూపురికాలనీ మీదుగా జగిత్యాల రోడ్డు కెనాల్ వరకు.'
తొమ్మిది నెలల్లో పూర్తికి కార్యాచరణ
- వై.సునీల్రావు, మేయర్, కరీంనగర్
స్మార్ట్సిటీ బోర్డు సమావేశంలో సాంకేతిక అనుమతి లభించింది. వారం రోజుల్లో టెండర్లు పిలుస్తాం. 6-9 నెలల వ్యవధిలో పనులు పూర్తి కావాలనే లక్ష్యాన్ని విధించడం జరిగింది. ముందుగా సమస్యలున్న చోట వర్షాకాలం లోగా పనులు పూర్తి చేయించడం జరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్