logo

ఆసుపత్రి పరిసరాలు అధ్వానం

గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి వార్డుల్లోకి వెళ్లే ప్రధాన రహదారిలోనే అపరిశుభ్రత నెలకొనడంతో పాటు పందుల సంచారంతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు

Published : 18 Jan 2022 02:34 IST

గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి వార్డుల్లోకి వెళ్లే ప్రధాన రహదారిలోనే అపరిశుభ్రత నెలకొనడంతో పాటు పందుల సంచారంతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొవిడ్‌ ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేయడంతో వార్డుల్లోకి వెళ్లాల్సిన ప్రధాన రహదారిని ఆస్పత్రి వెనుక నుంచి ఏర్పాటు చేశారు. అటువైపు వెళ్లే దారితో పాటు ఆస్పత్రి ముందు అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. దుర్వాసనతో పాటు పందులు తిరుగుతున్నాయి.

-న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని